
సంక్లిష్ట భారతీయ సమాజంలో సామాజిక అంశాతిని ఎగదొసే పరిణామాలు ప్రతినిత్యం చోటుచేసుకుంటూనే ఉంటాయి. కొన్ని భగ్గుమని ఆరిపోతే మరికొన్ని రావణకాష్ఠంలా రగులు తుంటాయి.
ముంబైలో టెర్రరిస్టులు సృష్టించిన మారణహోమం యావత్ దేశాన్ని కదిపేసింది.
ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భంలో బాధితులకు మతం ఉండదు.
ఇలాంటి సంఘటనల నుంచి లబ్ది పొందాలనుకునేవారు మాత్రం మతాన్ని ఉపయెగించుకుంటారు. దీనివల్ల సామరస్య జీవనం నెత్తురోడుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ప్రధాన మతాల అనుయాయుల మద్య పరిపూర్ణమైన పరస్పర అవగాహన ఉండాలి.
భారత్లో ఇస్లాం వ్యాపించి కొన్ని వందల సంవత్సరాలైన్పటికీ మెజార్టీ సంఖ్యాకులైన హిందువుల్లో ఇస్లాం ఆవిర్భావం చారిత్రక నేపథ్యం, తమ ప్రాభవం భారతీయ సమాజంలో ఇస్లాం పాత్ర వగైరా అంశాలకు సంబంధించిన అవగహన చాలా తక్కువ.
ముందుస్తుగా ఏర్పడిన అభిప్రాయలతో ఇస్లాంను, ముస్లింలను చూసేవారి సంఖ్య చాలా ఎక్కువ. ఉన్నత విద్యావంతులైన హిందువుల్లో కూడా అదే పరిస్థితి. ఇస్లాంకు సంబందించి పూర్తి అవగాహన హిందువుల్లో లేనట్టుగానే, తమ మతానికి సంబందించిన చారిత్రక జ్ఞానం కొరవడిన కారణంగా ముస్లింల్లో కూడా సంకుచిత్వం పేరుకుపోయిందటారు ఎంఎన్ రాయ్.
20 శతాబ్దంలో భారత్ గర్వించదగిన మహామేధావి ఎంఎన్ రాయ్ రాసిన చిరుపుస్తకం హిస్టారికల్ రోల్ ఆఫ్ ఇస్లాం ఎన్ ఎస్సే ఆన్ ఇస్లామిక్ కల్చర్. దీనినే ''ఇస్లాం చారిత్రక పాత్ర'' పేరుతో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ తెలుగులో ప్రచురించింది.
దేశ కాల మాన పరిస్థితులను బట్టి చూస్తే ఇది అత్యంత సందర్భోచితమైన ప్రచురణ. ఇస్లాం ప్రపంచగతిని ఏ విధంగా మార్చించిందో రచయిత అత్యంత ఆసక్తికరంగా వివరించారు.
ఇస్లాంను యుద్ధోన్మాదంగా భ్రమపడే పరిస్దితి ఎందుకు వచ్చింది?
ఈ తరహా అవగాహనకు కారణమైన అంశాలేమిటి?
ఇస్లాం విజయాన్ని సైనికవిజయంగా భావించడం సబబేనా అరబ్బుల సారథ్యంలో అత్యున్నత శిఖరాలకు చేరిన ఇస్లాం సంస్కతి ప్రాభవాన్ని దెబ్బతీసిన చారిత్రక అంశాలేవి?
ఇలాంటి ప్రశ్నలన్నింటికి ఈ పుస్తకంలో సహేతుకమైన సమాధానాలు దొరుకుతాయి. హిందు ముస్లిం తేడా లేకుండా ఇస్లాం గురించిన శాస్త్రీయ అవగాహనకు అందరూ చదవదగిన ఈ పుస్తకంలో అనువాదంలో మరికొంత జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.
(- ఆదివారం ఆంధ్ర జ్యోతి 21-12-2208లో వెలువడిన పుస్తక సమీక్ష. సమీక్షకులు: వి. శ్రీనివాస్ )
ఇస్లాం చారిత్రక పాత్ర
ఎంఎన్ రాయ్,
తెలుగు: సుందరవర్దన్
ప్రతులకు. వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెంబరు 85, బాలాజినగర్,
గుడిమల్కాపూర్. హైదరాబాద్ - 500 067
ఫోన్: 040 - 2352 1849
36 పేజీలు, వెల: రూ.25
No comments:
Post a Comment