Saturday, June 29, 2019

బొజ్జా తారకం నీలిజెండా వ్యాసాలు

బొజ్జా తారకం నీలిజెండా వ్యాసాలు

అరవై ఏళ్ళలో దళిత సామాజిక ప్రగతి

          ఒకప్పుడు అరవై ఏళ్ళంటే అది నిండు జీవితం. ఒక మనిషి అరవై ఏళ్ళు బ్రతికాడంటే అది గొప్ప. ఒక అదృష్టం. అందుకే దానిని డబ్బున్నవాళ్ళు పండగ చేసుకొనేవారు. ఒక జాతి జీవితంలో అరవై ఏళ్ళు ఏమంత కాం కాదు. అందులోనూ అన్నీ అందుతున్న జాతికి అరవై ఏళ్ళు నిజంగానే పెద్దకాం కాదు. కాని ఏమీ అందని జాతికి, ఏ వికాసానికీ నోచుకోని జాతికి, ఏ అవకాశాలూ లేని జాతికి, ఏ ఆధారాలు, వనయీ లేని జాతికి, విద్య ఉపాధి ఐశ్వర్యం అందని జాతికి వీటన్నిటికోసం ఎదురుచూస్తున్న జాతికిమాత్రం అరవై ఏళ్ళు పెద్ద సమయమే! తినటానికి తిండి, ఉండటానికి గుడిసె లేని జాతికి అరవై ఏళ్ళుగా ఎదురు చూడటం దుర్భర సమయమే!
          స్వతంత్రం వచ్చి అరవై ఏళ్ళు అవుతున్నది కాబట్టి ఆ పరిమితిలో దళిత సామాజిక ప్రగతి ఎంతవరకూ వెళ్ళిందో చూడానుకుంటున్నారు. అరవై ఏళ్ళ స్వతంత్రంలో ఏమంత చెప్పుకోలేని భాగస్వామ్యం ఉన్న దళితు ప్రగతి గురించి మాట్లాడుకోవటం కొంత బాధాకరమే! అయితే ఈ బాధ వెనుక జరుగుతున్న మార్పు కనబడటం లేదని కాదు. సాగుతున్న జీవన ప్రవాహంలో మార్పు సహజమే! మార్పు కూడా స్వహస్తాతో తెచ్చుకున్నదా లేక ఎవరో తెచ్చి ఇస్తున్నదా! అనే దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. కబీర్‌ అన్నట్టు ‘‘అడగకుండా వచ్చేది నీళ్ళ వంటిది, అడిగితే వచ్చేది పా వంటిది, కొట్లాడి తెచ్చుకొనేది రక్తం వంటిది’’. అరవై ఏళ్ళ దళిత సామాజిక ప్రగతి నీళ్ళ వంటిదా, పా వంటిదా లేక రక్తం వంటిదా చూద్దాం!
           మనిషి పెరుగుద కోరుకుంటాడు, మానవ సమాజం వికాసం కేసి పయనిస్తుంది, దేశం అభివృద్ధికోసం అడుగు వేస్తుంది. ఈ ప్రయత్నంలో దేశానికి గాని, సమాజానికిగాని, మనిషికిగాని కొన్ని శక్తు సహకరిస్తాయి, కొన్ని అడ్డుకుంటాయి, కొన్ని నిరాకరిస్తాయి. ఈ శక్తు కొన్ని అంతర్గతంగా ఉంటాయి, కొన్ని బాహ్యంగా ఉంటాయి. మానవ ప్రయత్నాు, ఈ అంతర్భాహ్య శక్తు పరస్పరం సంఘర్షించుకుంటాయి. ఆ సంఘర్షణలో నుంచి వస్తున్నదే పెరుగుద, అభివృద్ధి, ప్రగతి మీరేదైనా అనండి! ఈ నేపథ్యంలో దళిత సామాజిక ప్రగతిని విశ్లేషించాలి.


బొజ్జా తారకం నీలిజెండా వ్యాసాలు
440 పేజీలు, వెల: రూ.250/-

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ , బొజ్జా తారకం ట్రస్ట్
 ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
 ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com

Thursday, June 27, 2019

అంటరానితనం - ఇంకానా? : బొజ్జా తారకం

అంటరానితనం  - ఇంకానా? : బొజ్జా తారకం 
‘‘అంటరానితనం నాడు ` నేడు ‘  రేపు అనే శీర్షికతో తారకంగారు 2006లో ఒక రాత ప్రతి సిద్ధం చేశారు. కార్య వ్యగ్రత వ్ల దానిని ప్రచురించలేదు. తర్వాత 2008లో దానిని 108 పుటకు (రాత ప్రతి) కుదించారు. దానినీ ప్రచురించలేదు.
                అంటరానితనం అనేది శతాబ్దాుగా భారత దేశంలో పాతకుపోయిన దురాచారం. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. 2008 నాటి పరిస్థితి 2019 నాటికి మెరుగుపడకపోగా ఇంకా విషమ స్థితికి చేరుకుంటూ ఉన్నది. తారకంగారి అప్పటి ఆలోచను ఈనాడూ సమాజానికి అవసరమౌతున్నాయి. వారు 2007 లో రాసిన ‘‘అరవై ఏళ్ళలో దళిత సామాజిక ప్రగతి’’ అనే వ్యాసాన్ని కూడా దీనితో పాటే పాఠకు ముందు ఉంచుతున్నాం. ఎందుకంటే ఈనాటి సమాజానికి వీటి అవసరం ఉన్నదని గుర్తు చేసే సంఘటను ఇప్పుడూ జరుగుతూ ఉన్నాయి.
ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండం సింగంపల్లిలో ఒక దళిత యువకుడి హత్య జరిగింది. బిక్కి శ్రీని అనే అతడు వర్షం కారణంగా రోడ్డు పక్కనే ఉన్న మామిడి తోటలో ఆగాడు. వర్షానికీ గాలికీ మామిడి కాయు రాలి కింద పడి ఉన్నాయి. రెండు మూడు కాయు చేతిలోకి తీసుకున్నాడు అదే సమయానికి తోట కాపలాదారు వచ్చి కేకు వేస్తూ మరో నుగురిని పిలిచి గొడవ చేశాడు. ఇతడు చెప్పేది వినకుండా నుగురూ అతడిని చితక బాదారు. కాయ దొంగతనానికి వచ్చాడంటూ అతడిని పంచాయితీ ఆఫీసుకు తీసుకువెళ్ళి చిత్రహింసు పెట్టారు. ఇనప కడ్డీ మద్వారంలో దూర్చి తిప్పారు. మరణించిన కళేబరాన్ని ఉరిపోసుకున్న భంగిమలో పెట్టి జరిగిన సంఘటనను ఆత్మహత్యగా చూపటానికి ప్రయత్నించారు.
అంటరానితనం  - ఇంకానా? : బొజ్జా తారకం
64 పేజీలు, వెల: రూ.50/-

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com   


Sunday, June 23, 2019

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ కేటలాగ్


హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన,
ప్రస్తుతం అందుబాటులో వున్న 
పుస్తకాల 
వివరాల కోసం
ఈ కింది లింక్ పై 
క్లిక్ చేయండి

( మీరు ఈ పీడీఎఫ్ ఫైల్ ని డౌన్లోడ్ / ప్రింట్ కూడా చేసుకోవచ్చు) 


HBT BOOKS CATALOG





https://drive.google.com/file/d/1JIoBaV3RZFJVEVYwIM7Anmx55JXnGM7t/view



Saturday, June 1, 2019

నా గొంతే తూపాకి తుట  :  మల్లు స్వరాజ్యం ఆత్మకథ
మల్లు స్వరాజ్యం : తెలంగాణా ఝాన్సీ రాణి
                స్వాతంత్య్రోద్యమం యువతను ఉర్రూతూగిస్తున్న కాలానికి చెందిన మల్లు స్వరాజ్యం గొప్ప సాహస యోధురాలు. ఒక లెజెండ్‌, ఒక హీరో. ఆ కాంలో గుర్రం మీద ప్రయాణం చేసే ఆమెను చూసి జనం అభిమానంతో ఝాన్సీ రాణి అని పిలుచుకునేవారు. స్వరాజ్యం ఒక సంపన్న భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. పరదాల చాటున పెరిగారు. పరదాల చాటున్నే చదువు సంధ్యలు నేర్చుకున్నారు. మొదట స్వాతంత్య్రోద్యమంలోనూ ఆ తరువాత తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలోనూ చాలా చురుకుగా పాల్గొన్నారు. నిర్మొహమాటానికి,  ధైర్యానికి పెట్టింది పేరు. ఆమె అంటే సహచరుకే కాదు, నాయకులకు కూడా అభిమానమూ  - భయమూ రెండూ వుండేవి. చక్కని వాక్చాతుర్యంతో, హాస్య సంభాషణతో ఆకట్టుకుంటూ తన తరానికే కాదు, తర్వాతి తరానికి కూడా గొప్ప స్ఫూర్తిప్రదాతగా నిలిచారామె. అరమరికలు లేకుండా అందరితో కసిపోయే మనస్తత్వం వల ఇతర నాయకుకంటే ఆమె ఎంతో భిన్నంగా కనిపించేవారు. అటు స్వాతంత్య్రోద్యమంలో, ఇటు సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొంటూ ఆమె తన అనుభవాను వివరిస్తుంటే వినడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని,  ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఆమె మాటతీరు, వ్యవహార శైలి మూస పద్ధతికి భిన్నంగా, చాలా విక్షణంగా వుంటాయి. ఇలాంటి వ్యక్తు శతాబ్దానికి ఏ ఒక్కరో వుంటారు. మల్లు స్వరాజ్యం రెండు శతాబ్దాలను ప్రభావితం చేసిన మహా యోధురాలు.                                                                                        -వసంత కన్నబిరాన

మల్లు స్వరాజ్యం గారి జీవితమంటే 20వ శతాబ్దపు తెలంగాణా సామాజిక రాజకీయ చరిత్ర. అణచివేతను సహించలేని ప్రజ సామూహిక తిరుగుబాటు చరిత్ర. పీడితుల పట్ల సహానుభూతితో పిడికిలి బిగించి పోరాడిన ఒక తరం చరిత్ర. వ్యక్తి శక్తిగా మారే క్రమాన్ని చూపే చరిత్ర.
                రాజకీయాలోకి మహిళలు రావటమంటే మల్లు స్వరాజ్యం గారిలా రావాలి. అధికారం, పెత్తనం, అనేకానేక స్వీయ ప్రయోజనాను ఆశించి రాజకీయాలోకి వచ్చిన నాయకురాళ్లకు పూర్తిగా భిన్నం ఆమె రాజకీయ జీవితం. మన జీవితాలకు సంబంధించిన నిర్ణయాధికారాన్ని మన చేతుల్లోకి తీసుకోవటమెలాగో నేర్పే గొప్ప పాఠం ఆమె తొలినాళ్ల జీవితం.
-ఓలా

మల్లు స్వరాజ్యం తన పదకొండేళ్ల వయసులో ప్రజా జీవితంలో అడుగుపెట్టారు. ఆనాడు తనలో ఏ నిప్పు రవ్వ రాజుకుందో ఇవాళ 86 ఏళ్ల వయసులో కూడా ఇంకా ఆ జ్వాల అలాగే ఎగిసిపడుతూ వుంది. ఈ రోజు కూడా ఆమె ఎంతో స్పష్టతతో, ఆలోచనాత్మకంగా మాట్లాడుతూ, పోరాడుతూ ఎందరో మహిళకు స్ఫూర్తినిస్తున్నారు. కార్యాచరణకు పూనుకునేలా ప్రేరణను అందిస్తున్నారు. ‘‘నా గొంతే నాకు నా తుపాకి, తూటా’’ అంటారామె. జీవితంలో ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఏనాడూ వెనుకంజ వేయని ధీరత్వం ఆమెది. ఆమె జీవితం ఒక మార్క్సిస్టు వీరోచిత పోరాట గాథ.
                                                                                                                                               - శాంత సిన్హా


నా గొంతే తూపాకి తుట  :  మల్లు స్వరాజ్యం ఆత్మకథ
136 పేజీలు, వెల: రూ.120/-

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com  

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌