హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌

HYDERABAD BOOK TRUST
Plot No.85, Balaji Nagar, Gudi Malkapur, Hyderabad, A.P. 500 067, INDIA .... ...................................... Email ID : hyderabadbooktrust@gmail.com ..Phone+91-040-23521849 (Working Hrs. 10.00 AM to 5.00 PM IST)
View my complete profile

Saturday, November 21, 2009

భారతదేశంలో కులాలు - వాటి పుట్టుక, పనితీరు, అభివృద్ధి ... డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ... తెలుగు అనువాదం : భార్గవ ...


భారతదేశంలో కులాలు వాటి పుట్టుక, పనితీరు, అభివృద్ధి ...
1916 మే 9వ తేదీన కొలంబియా యూనివర్సిటీ, న్యూయార్క్‌ అమెరికాలో జరిగిన డాక్టర్‌ ఎ.ఎ.గోల్డెన్‌ వైజర్‌ స్మారక ఆంత్రోపాలజీ సెమినార్‌లో చేసిన ప్రసంగ పాఠం.


డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ అధ్యయనశీలతకు, శాస్త్రీయ దృక్పథానికి, తర్క పటిమకు ఈ చిన్న పుస్తకం ఒక ఉదాహరణ.

ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ, సమాజంలో అట్టడుగున నలిగిపోయే దళితుల విముక్తి కొరకు తదనంతర కాలంలో తాను నిర్మంచిన దళిత చైతన్య, విముక్తి ఉద్యమాలకు సైద్ధాంతిక భూమికను ఆయన చాలా మ,ధుగానే తయారుచేసుకున్నారు అనడానికి ఈ ప్రసంగపాఠం ఒక నిదర్శనం.

కులం పుట్టుక అన్నది ఇప్పటికీ పరిష్కారం దొరకని ఒక వివాదాస్పద అంశంగానే ఉన్నప్పటికీ, 1916 నాటి ఈ ప్రసంగం కులం పుట్టుక - పరిణామం విషయంలో నేటికీ కొత్త ఆలోచనలను రేకెత్తించగల శక్తిని కలిగి వున్నది.

అనువాదకులు భార్గవ ప్రజాభ్యుదయ సంస్థ (కర్నూలు) ప్రధాన కార్యదర్శి. మార్క్సిస్టు రాజకీయ కార్యకర్తగా పనిచేసే వీరు సామాజిక వ్యవస్థ,ఉద్యమాలు, రాజకీయ వ్యూహాలకు మధ్య గల సంబంధాన్ని అధ్యయనం చేయడంపై ఆసక్తి కలిగివున్నారు.


భారతదేశంలో కులాలు వాటి పుట్టుక, పనితీరు, అభివృది
- బి.ఆర్‌.అంబేడ్కర్‌
తెలుగు అనువాదం : భార్గవ


27 పేజీలు, వెల: రూ.8

ప్రతులకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీనగర్‌, గుడిమల్కాపూర్‌,
మెహదీపట్నం, హైదరాబాద్‌ - 500067 (ఫోన్‌ 040-23521849)

సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌,
3-4-142/6, ఫస్ట్‌ ఫ్లోర్‌, బర్కత్‌పుర,
హైదరాబాద్‌ -500027 (ఫోన్‌ 040-23449192)

Friday, November 20, 2009

ఆంగ్లేయ పాలకులు అంటరానివాళ్లు ... డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ... తెలుగు: యాజ్ఞి ...


ఆంగ్లేయ పాలకులు అంటరానివాళ్లు ...

డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఈ దేశ అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక.
ఆయన రాసిన ఈ పుస్తకంలో బ్రిటీష్‌ పాలనలో 'చట్టం ముందు అందరూ సమానమే' అనే విషయంలో తప్ప, దళితులకు మరే యితర న్యాయమూ జరగలేదని ఎన్నో ఆధారాలతో ఆయన చేసిన వాదన పాఠకులను కట్టిపడేస్తుంది.

బ్రిటీష్‌ వాళ్లు ఈ దేశాన్ని అక్రమించుకోవటానికి, అధికారం నిలబెట్టుకొని పరిపాలించడానికి అంటరానివాళ్ల సహాయం తీసుకొని ఆ తర్వాత వారిని నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వ సర్వీసు, విద్య, సాంఘిక సంస్కరణల విషయంలో వాళ్లు అమలు చేసిన విధానాలు, అగ్రవర్ణాలపట్ల చూపిన పక్షపాత వైఖరిని కూడా ఇది తేటతెల్లం చేస్తుంది.

ఆధునిక విద్య, ఉపాథి రంగాల్లో ప్రతిభ, కులం వలసపాలకుల చేతిలో అవసరానికి తగినట్టు రంగులు మారుస్తూ కింది కులాలకు అవకాశాలు లేకుండా చేశాయి. కేవలం పుట్టుకను బట్టి మనిషి అర్హతను నిర్ణయించిన వలస ప్రభుత్వం అసలు ప్రజా ప్రభుత్వం ఎలా అవుతుందని అంబేడ్కర్‌ సూటిగా ప్రశ్నిస్తారు.

అంటరానితనం దేశమంతా అమల్లో వున్నా, ఆధునికులమూ నాగరికులమూ అని చాటుకునే బ్రిటీషు పాలకులు ఈ సమస్యపై ఒక్క సాంఘిక చట్టమూ తీసుకొని రాలేదు. పైకి దళితులకు అనుకూలంగా మాట్లాడినట్టు కనిపించినా, సారాంశంలో కులతత్వం ఈ దేశంలో మరింతగా వేళ్లూనుకునేట్టు చేసిన బ్రిటీష్‌ కుటిల రాజనీతిని ఆయన బట్టబయలు చేశారు.

అనువాదకులు యాజ్ఞి ఆ లంపూరు (మహబూబ్‌నగర్‌)కు చెందినవారు. ఆయనకు అధికారం-విస్మృతి ఇష్టమైన అంశం. దీనిలో భాగంగానే కర్నూలు జిల్లాలో 'జానపద కథనాల'కు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు.


ఆంగ్లేయ పాలకులు అంటరానివాళ్లు
డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌
తెలుగు: యాజ్ఞి


60 పేజీలు, వెల: రూ.20

ప్రతులకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీనగర్‌, గుడిమల్కాపూర్‌,
మెహదీపట్నం, హైదరాబాద్‌ - 500067 (ఫోన్‌ 040-23521849)


సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌,
3-4-142/6, ఫస్ట్‌ ఫ్లోర్‌, బర్కత్‌పుర,
హైదరాబాద్‌ -500027 (ఫోన్‌ 040-23449192)

...................................

Wednesday, November 18, 2009

రాష్ట్రాలు - మైనారిటీలు ... డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ...తెలుగు అనువాదం: హారతి వాగీశన్‌ ...


రాష్ట్రాలు - మైనారిటీలు
స్వతంత్ర భారత రాజ్యాంగంలో వారి హక్కులేమిటి? వాటిని సాధించుకోవడం ఎట్లా?
... అఖిల భారత షెడ్యూల్డ్‌ కులాల సమాఖ్య తరఫున భారత రాజ్యాంగ నిర్ణయసభకు షెడ్యూల్డు కులాల రక్షణలకు సంబంధించి
సమర్పించిన నివేదిక (ప్రచురణ 1947)...


ఆధునిక భారత సామాజిక విప్లవ ప్రవక్త భారతరత్న డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌. భవిష్యత్తు భారతదేశం యొక్క రాజ్యాంగం, సామాజికార్థిక
నమూనా ఎలా ఉండాలని ఆయన భావించారో తెలిపే రచన ఇది. ఈ దేశం బలమైన రాష్ట్రాలు, బలమైన కేంద్రం గలిగిన, భారత సంయుక్త రాష్ట్రాలుగా రూపొందాలని బాబాసాహెబ్‌ ఆశించారు. ఆ సమాఖ్యలో సామాజిక ఆర్థిక అసమానతలుండకూడదని ఆయన ఆకాంక్ష.

ఈ రోజు మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు మూలమేమిటో ఈ రచన చదివితే తెలుస్తుంది. అంతరాల దొంతరల వర్గ కుల
సామాజిక వ్యవస్థ స్థానంలో స్వేచ్ఛా, సమానత్వం, సామాజిక న్యాయం లభించాలన్న అంబేడ్కర్‌ ఆలోచనలకు అక్షరరూపం ఈ పుస్తకం.

పౌరులందరికీ ప్రాథమిక హక్కులు, దారుణమైన సామాజిక వివక్షకు గురై దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్న షెడ్యూల్డు
కులాలవారికి ప్రత్యేక హక్కులుండాలన్నది అంబేడ్కర్‌ వాదం. అ ల్పసంఖ్యాకులు (మైనారిటీలు) అంటే హిందూ మతంలో లేనివారు
అన్న తప్పుడు అభిప్రాయానికి అంబేడ్కర్‌ గట్టి సమాధానం యిస్తారు. షెడ్యూల్డ్‌ కులాలు మైనార్టీలకంటే దుర్భర స్థితిలో ఉన్నారని
నిరూపించారు.

రాజ్యాధార సామ్యవాదం (స్టేట్‌ సోషలిజం) అంటే ప్రభుత్వం చేతిలో వ్యవసాయం పరిశ్రమలు ఉంచడం ద్వారా సామాజిక, ఆర్థిక
సమానత్వం సాధించవచ్చన్న అభిప్రాయాన్ని, వాదనా పటిమను ఇందులో చూడవచ్చు.

అనువాదకులు హారతీ వాగీశన్‌ ఖిల్లా ఘన్‌పూర్‌ (మహబూబ్‌నగర్‌)కు చెందిన రాజనీతి శాస్త్ర విద్యార్థి, యూజీసీ ఢిల్లీ వారి రీసెర్చ్‌
ఫెలోషిప్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ''పంచాయితీ రాజ్‌ వ్యవస్థలో నాయకత్వం'' విషయంలో పరిశోధన పూర్తి చేసే దశలో
వున్నారు.

రాష్ట్రాలు - మైనారిటీలు
డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌
తెలుగు అనువాదం: హారతి వాగీశన్‌
74 పేజీలు, వెల:రూ.25


ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీనగర్‌, గుడిమల్కాపూర్‌,
మెహదీపట్నం, హైదరాబాద్‌ - 500067 (ఫోన్‌ 040-23521849)

సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌,
3-4-142/6, ఫస్ట్‌ ఫ్లోర్‌, బర్కత్‌పుర,
హైదరాబాద్‌ -500027 (ఫోన్‌ 040-23449192)

Monday, November 16, 2009

బషీర్‌ ఫకీర్‌ సూఫీ ఫన్‌కార్‌ (కళాకారుడు). ...సాక్షి సమీక్ష ...



బషీర్‌ కథలు

అతను వేరు, అతని సృజన వేరు కాదు.
అతని ఆత్మ, అతని అక్షరం రెండూ ఒక్కటే.
రచయితగా కావచ్చు, అతని రచనలు కావచ్చు, అతనే కావచ్చు- మొదటి నుంచి చివరి దాకా క్రమంగా అర్థం కావచ్చు, కాకపోనూ వచ్చు.
ఎంత కొంచెం జ్ఞానమైనా, అదీ అత్తరబుత్తర గున్నా, జ్ఞానం జ్ఞానమే.
జ్ఞానమే జీవితం.
అందుకే ఆ మహాసముద్రుడి నుంచి ఓ నాలుగు జ్ఞానం చుక్కల్ని నెత్తిన చల్లుకుంటాను!

పద్మశ్రీ వైకం మహమ్మద్‌ బషీర్‌కు కథకుడిగా భారతీయ సాహిత్యంలో పెద్దపేరు. అతను పుట్టిన ఊరు 'వైకం'. అదే అతని ఇంటిపేరయింది. నివసించిన ఊరు 'బేపూర్‌' పేరిట మేపూర్‌ సుల్తాన్‌ బిరుదయింది. అతని కథలు చదువుతుంటే మామూలు దిన చర్య రాసుకున్నట్లే వుంటుంది. ఎవరైనా కథలు రాయగలరు అనిపిస్తుంది. ఇల్లు కట్టుకుంటే కథ షల్లుకున్నాడు. బిడ్డ పుడితే కథను సృష్టించాడు. గాంధీజీని ముట్టుకోవడం కథ అయింది. మానసిక అనారోగ్యంతో దవాఖానలో చేరితే కథా రచన ఉపశమనం ఇచ్చింది.

కళాత్మక కత తెలిసిన జీవిత కథకుడాయన. ఏ వస్తువును తీసుకున్నా అద్భుత సాహితీ రూపాన్ని తీసుకుంది. విభిన్న కథలను రాసిన కథా ప్రేమికుడు. స్వతంత్ర పోనరాట కథలు, జైలు కథలు, తాత్విక కథలు, ప్రేమ కథలు ఇలా ఏ అంశం గురించి రాసినా మనం చదవకుండా, ప్రభావితం కాకుండా వుండలేం.

మన తెలుగు కథలకు భిన్నంగా వుండే ఏనుగులను దొంగిలించే వాళ్ల కథలు ఎంతో ఆసక్తికరంగా వున్నాయి. అంతేకాదు ఎంతో జటిలమైన అంతర్మథనాలూ ఎంతో సులువుగా అర్థమైపోతాయి. చాలా కథల్లో పునరావృతమయ్యే అతని కొన్ని పాత్రలతో, ఆ వాతావరణంతో కలిసిపోతాం. ప్రతి కథలో బషీరే నేరుగా పాఠకులకు కథ చెప్తుంటాడు. విస్మయాన్ని కలిగించే విషయాలున్నా, చదువుతూ పోతుంటే చాలా మామూలుగా జరిగిపోయినట్లు అనిపిస్తాయి. మనింట్లోనో, మనకు పరిచయమున్న బజార్లోనో, మనూర్లోనో జరిగినట్లుంటాయి. సంఘటనలన్నీ, ఎంతో విస్తృతమైన తన జీవితానుభవాలను, సామాజిక వాస్తవికతలను ఆవిష్కరించటమే ప్రధానం కానీ, ఏ శిల్పంలో చెప్పాలనేది అతనికి ప్రధానం కాదు. ఆ వస్తువే దాని శిల్పాన్ని మలచుకుంటుంది. శ్రద్ధ చూపించినట్లు అన్పించకపోయినా అతనో గొప్ప ఫన్‌కార్‌ (కళాకారుడు).

చాలా వరకు కథలన్నీ ఫస్ట్‌ పర్సన్‌లో ఆత్మకథనాత్మక ధోరణిలో సాగుతాయి. బషీర్‌ పేరుతోనే నేరేషన్‌ సాగుతుంటుంది. ఆతని వ్యక్తీకరణలు ఎంత అద్భుతంగా వుంటాయో!

ఉదాహరణకు ఓ రెండ చూడండి. ''జమీలా... కన్నీళ్లన్నీ కూజాలోకి పడేలా ఏడువు. వృథా కాకుండా నేను స్నానం చేస్తాను- ప్రపంచాన్ని మార్చేయాలి. జరిత్ర తిరగరాయాలి. లోకాన్ని నెత్తుట్లో స్నానం చేయించి సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాలి. ఆత్మగౌరవం దెబ్బతినకుండా ప్రేమించాలి. యవ్వనంలో ఆలోచనలకు సలాం- మతాలకతీతంగా పిల్లల పేర్లు - చిన్నకథ, నాటకం, వచన కవిత ఆకాశం, ఆలిచిప్ప, చాక్లెట్‌, రొయ్యకన్ను, నక్షత్రం, తుఫాను అని పెట్టుకుందాం.

అతన్ని చదవటం షురూ చేస్తే ఎదురుగా వచ్చి కూర్చుని నింపాదిగా కథలు చెప్తున్నాడనుకుంటాం. చదవటం పూర్తయ్యాక మనకు మనం అర్థమైపోతాం. కథలు సుదీర్ఘంగా నడుస్తున్నట్లే వుంటాయి. కానీ నవలలా సాగదీయని కథా కళాత్మకతా రహస్యాలు అతనికి తెలుసు.

తెలుగు కథల్లో ముస్లిం జీవితం పది, పదిహేను సంవత్సరాల నుంచే వస్తున్నది. కానీ బషీర్‌ యాభై సంవత్సరాల క్రితమే రాశాడు.

''ఫాతిమా మేక'', ''మి గ్రాండాడ్‌'' లాంటి పెద్ద కథలు లేదా నవలికలు సాహితీ ప్రేమికులు తప్పక చదివి తీరాల్సినవి.
అన్ని కథలూ చదివాక బషీర్‌ ఆత్మకథను చదివినట్లు అనిపిస్తుంది.
అతని కుటుంబం మన కుటుంబం అయిపోయినట్టు అనిపిస్తుంది.

ఆలస్యంగానైనా ''బషీర్‌ కథలు'' హెచ్‌బిటి వాళ్లు తెలుగు వారికి పరిచయం చేయటం ఎంతో అభినందనీయం. (ఈ పుస్తకం అన్ని ప్రధాన బుక్‌ షాపుల్లోనూ దొరుకుతోంది). అతని మిగిలిన సాహిత్యాన్ని కూడా ఇంకో పుస్తకంగా తీసుకురావాలని విన్నపం.
- బా రహమతుల్లా
సాక్షి దినపత్రిక 16 నవంబర్‌ 2009.

……………………………….

ఇందులోని కథలు:

1. ఒక ప్రేమ లేఖ 2. ఏనుగుల దొంగ - బంగారు శిలువ 3. పూవన్‌ బనానా 4. బంగారు ఉంగరం 5. దుడ్డులాఠీ పణిక్కర్‌ 6. అమ్మ 7. మోసకారి కూతురు 8. తాయెత్తు 9. విశ్వవిఖ్యాత ముక్కు 10. ఏకాంత తీరం 11. గోడలు 12. ఒకనాటి ప్రేమకథ 13. పుట్టిన రోజు 14. టైగర్‌ 15. ఒక మనిషి 16. అవని తల్లికి అసలైన వారసులు 17. అనల్‌ హఖ్‌ 18. శబ్దాలు 19. ఏనుగు పిలక 20. పాత్తుమ్మా మేక కథ నేపథ్యం 21. పాత్తుమ్మా మేక


ఈ కథలను తెలుగులోకి అనువదించినవారు:

సి.అనంత్‌, జి.షేక్‌బుదన్‌, విమల, ప్రభాకర్‌ మందార, సి.వనజ, హెచ్చార్కె, పి.సత్యవతి, ఎస్‌.జయ, భార్గవ, కాత్యాయని, ఆకెళ్ల శివప్రసాద్‌, సంధ్య, కలేకూరి ప్రసాద్‌, పట్నం ఉమాదేవి.

...............

బషీర్‌ కథలు
-వైక్కం మొహమ్మద్‌ బషీర్‌

ముఖచిత్రం: శంకర్‌
మొదటి ముద్రణ: ఆగస్ట్‌ 2009


289 పేజీలు, వెల: రూ.100
.....................

ప్రతులకు, వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067

ఫోన్‌: 040 2352 1849
EMail ID : hyderabadbooktrust@gmail.com

Sunday, November 15, 2009

భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు - దళితులు ... ప్రొఫెసర్‌ బాల్‌చంద్ర ముంగేకర్‌ ... తెలుగు అనువాదం: అ ల్లం నారాయణ ...


భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు - దళితులు
ఒక అంబేడ్కర్‌వాద దృక్పథం


మాంఛెస్టర్‌ మెట్రోపాలిటన్‌ యునివర్సిటీ, లండన్‌లో ముంబాయి విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ బాల్‌చంద్ర ముంగేకర్‌ చేసిన డాక్టర్‌ అంబేడ్కర్‌ స్మారక ప్రసంగపాఠం

భారత ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేస్తున్న ప్రణాళిక చేస్తున్న ప్రణాళిక సంఘం సభ్యులుగా వున్న డాక్టర్‌ బాల్‌చంద్ర ముంగ్రేకర్‌ దేశంలో అగ్రగణ్యులైన వ్యవసాయ ఆర్థిక శాస్తవేత్తలలో ఒకరు. ప్రణాళిక సంఘం బాధ్యతకలు చేపట్టడానికన్న ముందు ఆయన ముఐబాయి విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌గా పనిచేశారు. అ లాగే, ప్రతిభావంతులైన ఒక సామాజిక తత్వవేత్త. సంస్కర్త. ఆయన ప్రతిభావ్యృత్పత్తులు గల అనేక అకడమిక్‌ పదవులు అధిష్టించారు. ముఐబాయి యూనివర్శిటీ ''అడ్వాన్స్‌డ్‌ స్టడీ సెంటర్‌'' చైర్మన్‌గా, భారత సాంస్కృతిక సంబంధాల మండలి సభ్యుడుగా, ''డాక్టర్‌ అంబేడ్కర్‌ సామాజిక, ఆర్థిక పరిణామాల సంస్థ'' వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ఇతర ప్రతిష్టాత్మక పనులను ఆయన నిర్వహించారు. వ్యవసాయం, అభివృద్ధి ఆర్థిక శాస్త్రాలలో ప్రావీణ్యతకు గుర్తింపుగా 1999లో భారత ప్రభుత్వం ఆయనకు వ్యవసాయ ధరవరల మండలి సభ్యునిగా నియమించింది. జాతీయ, రాష్ట్రీయ స్థాయిలలో పలు ప్రభుత్వ కమిటీలలో కూడా ఆయన సేవలు అందించారు.

డాక్టర్‌ ముంగేకర్‌ను అంబేడ్కర్‌ ఆలోచనావిధానం వెలుగులో సాగే ఉద్యమాలలో అగ్రగణ్యుడైన నిపుణుడుగా భావిస్తారు.

ఆర్థిక సంస్కరణలు పేదలపై, ముఖ్యంగా దళితులపై కలుగజేస్తున్న దుష్పరిణామాలను అర్థం చేసుకునేందుకు ఈ పుస్తకం ఎంతగానో తోడ్పడుతుంది.

భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు - దళితులు - ఒక అంబేడ్కర్‌వాద దృక్పథం
-ప్రొఫెసర్‌ బాల్‌చంద్ర ముంగేకర్‌
తెలుగు అనువాదం: అల్లం నారాయణ


పేజీలు 72, వెల: రూ.20

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీనగర్‌, గుడిమల్కాపూర్‌,
మెహదీపట్నం, హైదరాబాద్‌ - 500067 (ఫోన్‌ 040-23521849)

సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌,
3-4-142/6, ఫస్ట్‌ ఫ్లోర్‌, బర్కత్‌పుర,
హైదరాబాద్‌ -500027 (ఫోన్‌ 040-23449192)