Thursday, December 26, 2019

ఒక్క రూపాయికే "బారిస్టర్ పార్వతీశం " !!!

పది రూపాయలకే "జంగిల్ బుక్" !
ఐదు రూపాయలకే "నేటి పిల్లలకు రేపటి ముచ్చట్లు" !
ఒక్క రూపాయికే "బారిస్టర్ పార్వతీశం " !!!

ఇంకా అనేక హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పుస్తకాలు పదిరూపాయల లోపు ధరకే  లభిస్తాయి
కేవలం డిసెంబర్ 28 , 29  తేదీల్లో
బుక్ ఫెయిర్ స్టాల్ నెం 305 లో
ఎన్టీఆర్ స్టేడియం, లోయర్ ట్యాంక్  బండ్, ఇందిరాపార్క్ ఎదురుగా !



ప్రజల పక్షాన నిలబడిన హైదరాబాదు బుక్ ట్రస్ట్, గత నాలుగు దశాబ్దాలుగా అనేక పుస్తకాలను ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా వచ్హిన మంచి సాహిత్యాన్ని అనువదించి ప్రధానంగా తెలుగు పాఠకుల దరి చేర్చాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నది. ఇంతవరకూ హెచ్.బి.టి. ప్రచురించిన వాటిలో సామాజిక,ఆర్ధిక, రాజకీయపరమైన అంశాలతో పాటు సమాజ మార్పుకోసం వివిధ రంగాలలో విభిన్న రీతులలో కృషి చేసిన వారి చరిత్రలను, ఆత్మ కధలను, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక అంశాలపై దాదాపు నాలుగు వందల పుస్తకాలను ప్రచురించింది. పాఠకుల ఆదరణ, అనేక మంది సహాయ సహకారాలతోనే ఈ ప్రయాణం హెచ్.బి.టి.కి సాధ్యం అయింది. 2020 ఫిబ్రవరితో హెచ్.బి.టి.ని ప్రారంభించి 40 సంవత్సరాలు పూర్తవుతాయని తెలియచేయడానికి ఆనందిస్తూ ఈ సందర్భంగా హెచ్.బి.టి. ప్రచురించిన అనేక విలువైన పుస్తకాలను ఒక రూపాయి నుంచి పది రూపాయల ధర లోపల పాఠకులకు అందించాలని భావించింది. ఈ అవకాశాన్ని పుస్తక ప్రియులు వినియోగించుకుంటారని ఆశిస్తున్నది. ఈ పుస్తకాల వివరాలను వాటి సారాంశాన్నిక్లుప్తంగా కింద పేర్కొనడం జరిగింది. ఈ పుస్తకాల అమ్మకం ఎన్.టి.ఆర్. స్టేడియంలో జరుగుతున్న బుక్ ఫేఇర్, స్టాల్ నంబర్ 305 లో 28, 29 తేదీలలో రెండు రోజులు మాత్రమే నిర్వహించ బడుతుంది.

1. పిల్లల రాజ్యం - చాకిరి చదువు: రచయిత మైరన్ వైనర్(అయిదు రూపాయలు) చదువుకు నోచుకోక, చాకిరి బ్రతుకులీడ్చే పసివాళ్ళు ప్రపంచంలో వున్న మొత్తంలో అతి ఏక్కువ మంది వున్నది భారతదేశంలోనే. అందుకు ఏ మౌలిక భావనలు, కులవ్యవస్థ దానికి దారితీసాయో వివరించే పుస్తకం.

2. చదువు : రచయిత కృష్ణ కుమార్ (అయిదు రూపాయలు) ఏది బొధన యోగ్యమైంది? యోగ్యమైనదానిని భోదించడం ఎలా? విద్యావకాశాల వ్యాప్తి ఏ స్థితిలో వుందో తెలియ చేసే పుస్తకం.
                               

3. పిల్లల పాఠాలు పెద్దలకు గుణపాఠాలు: రచయిత కృష్ణ కుమార్(అయిదు రూపాయలు)పిల్లలకు పెనుభారంగా మారిన మన విద్యావిధానం, పుస్తకాలు, సిలబస్ బొధన, మొత్తం విద్యావ్యవస్థను విమర్శనాత్మకంగా, సృజనాత్మకంగా రచయిత కృష్నకుమార్ ఈ పుస్తకం ద్వారా మన ముందుంచారు.
4. మీ పిల్లలు టి.వి. చూస్తారా? - రచయితలు నమితా ఉన్ని కృష్ణన్, శైలజా బాజ్ పాయ్: (పది రూపాయలు)భారతదేశంలో టెలివిజన్ అనూహ్య వేగంతో మన ముంగిట్లోకి వచ్హింది. పిల్లలు టి.వి. ముందు కూర్చుంటే వాళ్లనిక పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొంతమంది భావిస్తుంటే, వాటికి అతుక్కుపోయిన పిల్లలను వాటినుంచి ఎలా దూరం చేయాలో తెలియక తలపట్టుకుంటున్న తల్లితండ్రులు మరికొంత మంది. మీ పిల్లల మనస్తత్వాన్ని అర్ధం చేసుకోడానికి మీకు ఈ పుస్తకం తోడ్పడుతుంది.
5. అమ్మా నాన్నలకు-రచయిత ఏ.ఎస్.మకరెంకొ(పది రూపాయలు)ప్రపంచ ప్రసిద్ధిగాంచిన విధ్యావేత్తలలో ఒకరైన మకరెంకొ పిల్లల పెంపకంపై తన అభిప్రాయాలను, చేపట్టవలసిన చర్యలను లక్ష్యాలను తెలియచేస్తూ తల్లితండ్రుల కోసం రాసిన పుస్తకం ఇది.
6. అల్లరి పిల్లలలో అద్భుత మార్పులు-రచయిత ఏ.ఎస్.మకరెంకొ(పది రూపాయలు)పిల్లల కోసం మకరెంకొ రాసిన మరో అమూల్యమైన పుస్తకం. విద్యాబోధన విషయంలో చేసిన తార్కిక సూత్రీకరణలు,అనుసరించవలసిన విధానాల గురించి వివరిస్తూ వాటిని తల్లితండ్రులు, ఉపాధ్యాయులు తెలుసుకోవలసిన అవసరాన్ని ఇందులో గుర్తుచేసారు.
7. ఎగిరే క్లాస్ రూము రచయిత ఎరిక్ కేస్పనర్ - (పది రూపాయలు)సుప్రసిద్ధ జర్మన్ రచయిత ఎరిక్ కేస్పనర్ పిల్లల కోసం రాసిన నవల ప్లయింగ్ క్లాస్ రూం కు తెలుగు అనువాదం ఇది. బోర్డింగ్ పాఠశాలలో చదువుకునే పిల్లల జీవన చిత్రాన్ని ఆవిష్కరించిన గొప్ప పుస్తకం.
8. తొలి ఉపాధ్యాయుడు - రచయిత చింఘిజ్ ఐతమాతవ్(పది రూపాయలు)ప్రముఖ రచయిత చింగిజ్ ఐతమాతోవ్ చదువుపై రాసిన మరో అమూల్యమైన పుస్తకం. ఉప్పల లక్ష్మన్ రావు అనువాదం పాఠకులను కంఠ తడిపెట్టిస్తుంది.
9. ఉడకని మెతుకు-రచయిత కె.ఆర్.వేణుగొపాల్(పది రూపాయలు)పేదల జీవితాలతో లోతుగా ముడిపడిపోయిన సమగ్ర శిశు అభివృద్ధి పధకం ఏవిధంగా నిర్వీర్యం అవుతున్నదనేదిచెప్పేందుకే ఈ పుస్తకాన్ని రచించారు రచయిత.

10. మొగ్లీ-జంగిల్ బుక్ కధలు- రచయిత రడయర్డ్ కిప్లింగ్(పది రూపాయలు)రడ్యర్డ్ కిప్లింగ్, ఆంగ్ల భాష నుంచి సాహిత్యంలో తొలి నోబుల్ బహుమతిని అందుకున్న రచయిత. చిన్న పిల్లలకు ఎంతో ఆసక్తిగా అద్భుతంగా రాసిన కధల పుస్తకం.
                         

11. నేటి పిల్లలకు రేపటి ముచ్హట్లు(అయిదు రూపాయలు)ప్రధానంగా యుక్త వయసులోని వారిని దృష్టిలో ఉంచుకుని రాయబడిన పుస్తకం. బాల్యానికి యవ్వనానికి మధ్య దశ గురించి, యువతకు ఉండవలసిన ఆత్మ గౌరవం, స్థిరత్వం గురించి, లైంగిక పట్ల ఏర్పరచుకోవలసిన నిర్షిష్ట వైఖరి గురించి తెలియ చేస్తుంది.
                         

12. మా యాత్ర-రచయిత దేవులపల్లి కృష్ణమూర్తి(పది రూపాయలు)ప్రదేశాల చరిత్ర, శిల్ప సంపద ప్రాముఖ్యత, దారికిరువైపులా పరుచుకున్న రమణీయత, ప్రయాణంలో పడిన కష్టనష్టాలు, సహయాత్రికుల సంసారాల్లోని కల్లోలాలను పడుగు పేకల్లా అల్లుకుంటూ అత్యంత నైపుణ్యంతో పాఠకుల ముందుంచారు రచయిత.
13. మంచి చెడూ - రచయిత శారద(పది రూపాయలు)సమాజంలో చోటు చేసుకుంటున్న వ్యాపార సంస్కృతిని, విలువలను అవి ధ్వంసం చేస్తున్న మానవ సంబంధాలను ఎంతో సులువుగా అర్ధం అయ్యేలా రచించారు రచయిత్రి.
14. రధచక్రాలు-రచయిత మహీధర రామమోహనరావు(అయిదు రూపాయలు) ప్రజల జీవితాలలోకి ప్రవేశించిన "ఆధునికత"ను దాని అవకాశాలనూ,సందర్భాలనూ అవి తీసుకు వచ్హిన మార్పులనూ రచయిత ఇందులో అక్షరబద్ధం చేశారు.
15. నల్లజాతి నిప్పు కణిక-సోజర్నర్ ట్రూత్(పది రూపాయలు)సకల వివక్షతలకు పీడనలకూ నిలయం ఈ భూమండలం. ఓ నల్లజాతి నిరక్షరాస్యురాలు అసాధారణ శక్తితో పీడిత సమూహాలపైన అమలవుతున్న వివక్షతలను బద్దలు కొట్టడమే లక్ష్యంగా అధమ స్థాయి నుంచి నిప్పు కణికలా జ్వలిస్తూ అసాధారణ పోరాటం సాగించింది ఈ నవలా నాయకురాలు. కంట తడిపెట్టించే ఆర్తి, ఉద్వేగాన్ని రగిల్చే స్పూర్తి ఆమె జీవితం నిండా పరుచుకున్నాయి. ఈమె జీవితంపై పాటలు, సినిమాలు, నాటకాలు, పిల్లల పుస్తకాలు, పాఠాంశాలు అసంఖ్యాకంగా ఎందుకు వచ్హాయో ఈ పుస్తకం చదివితే మనకు అర్ధం అవుతుంది.
16. సూర్యుడి ఏడో గుర్రం - రచయిత ధర్మవీర్ భారతి(పది రూపాయలు)పైకి అతి సాధారణంగా కనిపిస్తూనే నిగూఢమైన మానవ సంబంధాలను, ప్రేమ పరిణామాలనూ అసాధారణ సహజత్వంతో కొత్త కోణంలోంచి పాఠకులకు చూపించారు రచయిత. తప్పకుండా చదవవలసిన పుస్తకం.
17. జమీల్యా - రచయిత చింగిజ్ ఐతమాతొవ్(పది రూపాయలు) రాజకీయ, సామాజిక విప్లవోద్యమ కాలాలలో సంక్షుభిత సందర్భాలలో జీవితాలను, అద్భుతంగా ఒడిసిపట్టిన రచయిత చింగిజ్ ఐతమాతొవ్. ప్రపంచంలోని ప్రేమ కధల్లోనే ఒకటిగా గణుతికెక్కిన రచన ఇది. అతి తక్కువ ధరకే లభిస్తున్న ఈ ప్రేమ కధను మిస్ అవకండి.
18. బారిష్టరు పార్వతీశం - రచయిత మొక్కపాటి నరసిమ్హ శాస్త్రి( ఒక్క రూపాయి) తాను చూసిన ప్రాచ్య, పాశ్చాత్య సంప్రదాయిక జీవన విధానాలను, హాస్య వ్యంగ్య రసస్పోరకంగా చిత్రిస్తూ పార్వతీశం పాత్రను అజరామరంగా అద్భుతంగా తీర్చిదిద్ది పాఠకుడి మదిలో శాశ్వతంగా గుర్తుండి పోయేలా చేసారు రచయిత. చదివి హాయిగా ఆనందించండి.
19. దక్షిణ తూర్పు పవనం- రచయిత మార్కోస్(అయిదు రూపాయలు)జపాటిస్తా జాతీయ విముక్తి సైన్యం తిరుగుబాటు నాయకుడు మార్కోస్. మూలవాసుల పక్షాన నిలబడిన మార్కోస్ గెరిల్లా యోధుడు మాత్రమే కాదు, మంచి కవి,రచయిత కూడా. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యమ నిర్మాణమూ లక్ష్యమూ కూడా వుండాలని మార్కోస్ అభిమతం. ఈ పుస్తకం మార్కోస్ రాసిన ఉత్తరాల సంకలనం. సమాజ మార్పును కోరేవారందరూ చదివి తీరాల్సిన పుస్తకం.
20. రేపటి కల- రచయిత రిచడ్ రైట్(పది రూపాయలు) 20వ శతాబ్దపు ప్రధమార్ధంలో అమెరికాలోని నల్లజాతి ప్రజల జీవన పరిస్థితులను ఏడుతరాలు పుస్తక రచయిత ఎలెక్స్ హేలి లాగే రిచడ్ రైట్ కూడా తన రచనలో చిత్రించారు. ఇది రచయిత ఆత్మకధ బ్లాక్ బాయ్ కి సంక్షిప్తానువాదం. కాత్యాయని దీనిని తెలుగులోకి అనువదించారు.
21. ఖైది నంబర్ 174517 -రచయిత ప్రీమొ లెవి(అయిదు రూపాయలు) జర్మనీలో నాజీలు, ఫాసిస్టులు సృష్టించిన విధ్వంసం, భయానకమైన మారణకాండపై ఎంతో సాహిత్యం వచ్హింది. అటువంటి సాహిత్యంలో ప్రీమొ లెవి రాసిన ఈ పుస్తకం మనల్ని వెంటాడుతుంది. ఆయన స్వయంగా నాజీల మృత్యు శిభిరాలలో బందీగా వుండి చావు కనుచూపు మేరలో కనిపిస్తుండగా బతికిపోయి ఒక చారిత్రక వికృతత్వానికి సాక్షిగా నిలిచి రాసిన ఈ పుస్తకం ఫాసిస్టు హింసను నగ్నంగా ప్రపంచం ముందు పెట్టింది.
22. యుద్ధానికి పునాదులెక్కడ -రచయితలు నోంచాంస్కి తదితరులు(అయిదు రూపాయలు)గల్ఫ్ ప్రాంతాలలో అమెరికా సాగిస్తున్న చమురు రాజకీయాలను, అమెరికాకు పెనుసవాలుగా నిలుస్తున్న రాజకీయ, ఉగ్రవాద "ఇస్లామిక్" ఉద్యమాలను అర్ధం చేసుకోవాలంటే ఈ పుస్తకాన్ని చదివి తీరాలి.
23. సరుకు-సంపద రచయిత లియో హ్యూబర్మన్(అయిదు రూపాయలు) పెట్టుబడిదారుడు మొదట ఎలా పుట్టుకొచ్హాడో భూస్వామ్య సమాజాన్ని విచ్హినం చేసి సామాజిక వ్యవస్థగా రూపుదిద్దుకునే క్రమంలో పెట్టుబడి ఏఏ దశల్ని దాటుకుంటూ వచ్హిందో, పెరుగుతున్న ఉత్పత్తులకు కావలసిన మార్కెట్ల అన్వేషణలో అది యావత్ ప్రపంచాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తూ దేశాలకు దేశాలను యుద్ధభూమిగా ఎలా మారుస్తున్నదో అత్యద్భుతంగా లియో ఇందులో వివరించాగా మహీధర రామమోహనరావు తెలుగులోకి దీనిని అనువదించారు.
24. భారతీయ ఆర్ధిక వ్యవస్థ (1600-1947)-రచయిత హెచ్.ఎస్.గిల్.(అయిదు రూపాయలు)బ్రిటిష్ వాళ్లు భారతదేశాన్ని జయించక ముందు భారతీయ ఆర్ధిక వ్యవస్థ స్వరూపం ఎలా ఉండేది. దాని స్వభావం ఏమిటి? బ్రిటిష్ ప్రభుత్వం నెలకొల్పిన కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థ గ్రామ సమాజ క్షీణతకూ, విచ్హిత్తికీ ఎలా దోహదం చేసిందో, బ్రిటిష్ వలసవాదపు దోపిడి అవసరాలకు అనుగుణంగా భారతీయ పాలకులు ఏ విధంగా తోడ్పాటు నందించారో తదితర వివరాలను తెలుసుకోవడానికి ఈ పుస్తకం దోహదం చేస్తుంది.
25. దేశమంటే మార్కెట్ కాదోయ్- రచయిత ఎస్.జయ.(ఒక రూపాయి)డ్బ్ల్యు.టి.వొ. దాని పుట్టు పూర్వోత్తరాల గురించి విపులంగా తెలియ చేసిన పుస్తకం. మానవ హక్కుల ఉల్లంఘనకు, కార్మిక చట్టాల తొలగింపుకు, పర్యావరణ పరిరక్షణను విస్మరించి లాభాలు గడించడానికి, బహుళజాతి సంస్థల ప్రయోజనాలను రక్షించడానికి సామ్రాజ్యవాద దేశాలకోసం ఏర్పడిన డ్బ్ల్యు.టి.వొ. ప్రపంచ ప్రజలకు ఏ రకంగా వ్యతిరేకమో రచయిత ఇందులో తెలియ చెప్పారు.
26. ప్రపంచ పేదరికం పెట్టుబడి సంచయనం పేదరికీకరణ- రచయిత సమీర్ అమీన్(ఉచితంగా)పెట్టుబడిదారీ విధానంపై సమీర్ అమీన్ రాసిన చిన్న బుక్ లెట్.
27. ఆంధ్రప్రదేశ్ లో భూసంస్కరణలు-రచయిత ఎస్.ఆర్.శంకరన్(ఉచితంగా) తెలుగు రాష్ట్రాలలో చేయవలసిన భూసంస్కణల గురించి తెలియ చేసిన చిన్న బుక్ లెట్.
28. ఆరోగ్య రంగంలో సంస్కరణలు-రచయిత ఎం.తిమ్మారెడ్డి(రెండు రూపాయలు) ఆరోగ్య విధానాలను పునహ్ సమీక్షించి ప్రజలందరికీ ఆరోగ్యం అందుబాటులో వుండేటట్లు విధాన రూపకల్పన జరగవలసిన అవసార్న్ని ఈ పుస్తకంలో రచయిత నొక్కి చెప్పారు.

29. వైద్య వ్యాపారం-రచయితలు అమర్ జెసాని తదితరులు( అయిదు రూపాయలు) ఆరోగ్య సమ్రక్షణలో ప్రజల హక్కుల పట్ల మీకు ఆసక్తి ఉందా? రోగుల హక్కులపైన వారికి లభిస్తున్న వైద్య సమ్రక్షణపైన మీరు ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ పుస్తకాన్ని చదవండి.
                                 

30. ఆధునిక కామసూత్రం-రచయిత సిద్ధార్ధ దూబే(అయిదు రూపాయలు)ఇప్పుడు ఎయిడ్స్ ఎక్కడో దూరంగా వున్న బూచి కాదు. మన మధ్యనే స్వైర విహారం చేస్తూన్న ప్రాణాంతక ఉపద్రవం. ప్రధానంగా లైంగికంగా వ్యాపించే ఈ వైరస్ మనదేశంలో ఎందుకిలా తిష్టవేసుకుని మన వాళ్ళందరిని కబళిస్తోంది. నైతిక విలువల్లో మనల్ని మించినవారు లేరని లైంగిక వ్యవహారాల్లో మన సమాజం సమున్నత ప్రమాణాలు పాటిస్తుందని గొప్పగా చెప్పుకునే మన దేశంలో ఈ వైరస్ ఇంతగా ఎలా విజృభిస్తోంది. సులభశైలిలో ఆసక్తికరంగా సాగే రచన. నోబెల్ బహుమతి పొందిన అమర్త్యసేంతో సహా పలువురి మన్ననలను పొందిన రచన.
31. జండర్ రాజకీయాలు-రచయిత వందనా సోనాల్కర్(ఒక్క రూపాయి)స్త్రీలకు అన్ని రంగాలలో అమలు కావలసిన రిజర్వేషన్ల గురించి, పితృస్వామిక వివిధ కోణాల గురించి డా.వందనా సోనాల్కర్ చాలా చక్కగా ఇందులో వివరించారు.
32. స్త్రీలు-ప్రాతినిధ్యం- (అయిదు రూపాయలు)33శాతం రిజర్వేషన్ల పై వచ్హిన చర్చ మహిళా సంఘాలలో ఉన్న బేదాభిప్రాయాలను, కులవ్యవస్థపై వుండే అవగాహనలను వెలికి తెచ్హాయి. ఈ చర్చను చారిత్రకంగా, రాజకీయంగా అర్ధం చేసుకోవడానికి తోడ్పడే పుస్తకం.
33. మోతె-రచయితలు కోదండరాం తదితరులు(ఒక్క రూపాయి)మోతె ఒక తెలంగాణా గ్రామం. బాధల నుండి బయట పడడానికి చేస్తున్న ప్రజల పోరాటాల వీర గాధే ఈ పుస్తకం.

34. శాంతి దూతలు- మతోన్మాదాన్ని ఎదిరించిన మానవత్వం(అయిదు రూపాయలు) అబ్దుల్ హలీం సిద్ధిఖీ, హర్ష్ మందిర్ మాలెగావ్లో, గుజరాత్ లో పర్యటించి రాసిన వాస్తవ సంఘటనల చిత్రీకరణ. స్పూర్తిదాయకమైన ఈ కధలను చదివి తీరాలి.
                                   

35. గెట్ పబ్లిష్డ్-రచయిత మహమ్మద్ ఖదీర్ బాబు(అయిదు రూపాయలు) ఒక్క దోషికి శిక్ష పడకపోయినా పర్వాలేదు కాని, నూరుమంది నిర్దోషులు తప్పించుకోవాలి అంటారు రచయిత.
36. ప్రసార సాధనాలు పీడిత ప్రజలు-రచయిత పి.సాయినాధ్(రెండు రూపాయలు) సమకాలీన సామాజిక జీవితంలో సమాచారానికి ఉండే ప్రాధాన్యత వలన ప్రసార సాధనాలకు ఉన్న కీలకమైనపాత్ర గురించి ప్రముఖ రచయిత సాయినాధ్ ఇందులో వివరించారు.

Tuesday, October 15, 2019

Buddhist Archeological sites need to be safeguarded - Emani Raji Sarma

Buddhist Archeological sites need to be safeguarded - Emani Raji Sarma, Author of Tadhagatuni Adugujadalu published by HBT



Monday, October 14, 2019

"తథా గతుని అడుగుజాడలు" పుస్తక రచయిత్రి, ప్రముఖ చరిత్రకారిణి రాణీ శర్మ తో సాక్షి ఇంటర్వ్యూ



"తథా గతుని అడుగుజాడలు" పుస్తక రచయిత్రి, ప్రముఖ చరిత్రకారిణి రాణీ శర్మ తో
సాక్షి ఇంటర్వ్యూ
ఈ దిగువ లింక్ పై క్లిక్ చేయండి :

"జాడల్ని చేరిపెసుకుంటున్నాం"  సాక్షి ఫ్యామిలీ పేజ్ 14-10-2019

-------------------------------------------------------------------------
..................................................................రాణి శర్మ ఈమని

‘బుద్ధుని బోధనలు ఆద్యంతరహితమైనవి; కానీ బుద్ధుడు వాటిని శాశ్వత సత్యాలుగా ప్రకటించుకోలేదు. మారుతున్న కాలంతో బాటుగా మారే సామర్థ్యం బౌద్ధ ధర్మానికి ఉంది. ఇది మనకు ఇంకే మతంలోనూ కనబడదు. బౌద్ధాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అది పూర్తిగా హేతుబద్ధతపై ఆధారపడి ఉన్నదని మనకు అర్థం అవుతుంది.’ అంటాడు డా. బి.ఆర్. అంబేద్కర్.

ఆధునిక భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్, బౌద్ధాన్ని స్వీకరించడం కూడా యాదృచ్చికంగా జరిగిన వ్యక్తిగత నిర్ణయంగా కాకుండా ఆనాటి సామాజిక స్థితిగతులకు పర్యవసానంగా గుర్తించాలి. ఆ పరిస్థితులు ఎంతవరకూ మారాయనేది కూడా ఒక కీలకమైన చర్చనీయాంశమే. 

ఏది ఏమైనప్పటికీ, బౌద్ధానికి ఆదరణ, ధర్మం పట్ల ఆసక్తి – మన దేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా – నానాటికీ పెరుగుతూనే వస్తున్నవి. ఇందుకు ప్రధాన కారణం – అంబేద్కర్ చెప్పినట్లు – బౌద్ధ ధర్మంలోని నిత్యనూతనత్వం, పరిస్థితులకు అనుగుణంగా మారగల లక్షణం, తద్వారా కొనసాగే కాలాతీత సమకాలీనత.

యావత్ ప్రపంచాన్నీ ప్రభావితం చేసిన భారతీయ ఆధ్యాత్మికతలో బౌద్ధం ఒక ప్రధానమైన పార్శ్వం. భారతదేశాన్ని పాలించిన రాజులు, ప్రాచీన రోమ్ సామ్రాజ్యానికి తొమ్మిది రాయబార బృందాలను పంపిన ఆధారాలున్నాయి. వాటిల్లో ఒకటి పోరస్ (ఇతడెవరై ఉంటాడనేది రూఢి చేసుకోవాల్సి ఉంది) 
అనే రాజు పంపినది. 

రోమన్ చక్రవర్తి అగస్టస్ సీజర్ (క్రీ.పూ.27-క్రీ.శ.14) ని కలుసుకోవడానికి వెళ్లిన ఈ బృందంలో ఒక శ్రమణుడు (బౌద్ధ భిక్షువు) కూడా ఉన్నాడట. ఆ భిక్షువు ఏథెన్స్ లో బౌద్ధంపట్ల తనకున్న నిబద్ధతను ప్రకటిస్తూ ఆత్మాహుతి చేసుకొని మరణించాడనీ, అతని సమాధిపై ‘భారతదేశం నుండి వచ్చిన శ్రమణుడు’ అని వ్రాసి ఉంటుందనీ గ్రీకు చరిత్రకారుడు ప్లూటార్క్ (క్రీ.శ. 46-120) తన 
రచనలలో పేర్కొన్నాడు. అశోకుడు సిరియా, ఈజిప్టు, గ్రీసు దేశాలకు పంపిన రాయబార బృందాలు క్రైస్తవ ఆలోచనలను ప్రభావితం చేసి ఉంటాయని విల్ డ్యురాంట్ 1930లో చేసిన తన రచనలలో ప్రతిపాదించాడు.

బౌద్ధం, బుద్ధుని జీవితగాథ, క్రీ.శ. ఐదు, ఆరు శతాబ్దాలనాటికి సిల్క్ రూటు వంటి వ్యాపార మార్గాల ద్వారా ఆఫ్ఘనిస్తాన్, బాట్రియా, సూగ్డియానా, పర్షియా దేశాలకు కూడా విస్తరించాయి. ఒక భారతదేశపు రాకుమారుడు, సుఖమయ జీవనాన్నీ, ఐశ్వర్యాన్నీ, రాజ్యాధికారాన్నీ త్రోసిపుచ్చి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకున్న వైనం – ఆ దేశాల ప్రజలని ఎంత ప్రభావితం చేసిందంటే, ఆ 
గాథని పర్షియా దేశభాష అయిన పెహలవీలో క్రీ.శ. ఐదు ఆరువందల సంవత్సరాలలోనే వ్రాసుకున్నారు. అదే గాథని ‘భారతదేశపు గొప్ప ముని కథ’గా బాగ్దాద్ ని ఏలిన అబ్బాసిదుల రాజ్యంలో, ‘బిలావర్-బుద్ధస’ అన్న పేరుతో, మార్పులు, కూర్పులు చేసి అరబ్బు భాషలో తిరిగి వ్రాసుకున్నారు. 

ఈ క్రమంలో బుద్ధ చరిత పలుదేశాల సంస్కృతులలోకి చొచ్చుకుపోయింది. బుద్ధ చరిత, బుద్ధుని ఉపదేశం ఏదో ఒక రూపంలో యూరేసియా లోని ప్రతీ ఒక్క దేశంలోనూ, అన్ని వాంగ్మయాలలోనూ చోటు చేసుకుంది. ఈ గాథ ప్రాచీనకాలంలోనే సుమారు నూరు భాషలలోకి తర్జుమా అయిందని 
చరిత్రకారులు చెబుతున్నారు.  

గ్రీకు భాషలో ‘బార్లాం-జోసఫట్’ అన్న పేరుతో ప్రచురించబడిన బుద్ధుని గాథ ఎంత ప్రజాదరణ పొందిందంటే, ఐదవ  పోప్ సిక్స్టస్ బార్లాం, జోసఫట్ అనే వ్యక్తులు సెయింట్ లని ప్రకటించాడు. ఇది మధ్యయుగంలో అత్యంత జనాదరణ పొందిన గాథలలో ఒకటిగా ప్రాచుర్యం పొందింది. దీన్ని నాటక 
రూపంలో కూడా ప్రదర్శించేవారు. ఈ గాథలన్నిటికీ మూలం, సంస్కృతం, లేదా ప్రాకృతం నుండి గ్రహించిన గౌతమ బుద్ధుని కథే అని సుమారు వందేళ్ల క్రితం మాత్రమే పరిశోధకులు నిర్ధారించారు.

(తథాగతుని అడుగుజాడలు పుస్తకం నుంచి )


తథాగతుని అడుగుజాడలు
రచన: రాణీ శర్మ ఈమని,
ఉణుదుర్తి సుధాకర్

196 పేజీలు, వెల: రూ.200/-
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com 

Tuesday, October 1, 2019

టిపు సుల్తాన్ ఒక్కడే ఎందుకు వివాదాస్పదుడయ్యాడు? - యార్లగడ్డ నిర్మల

టిపు సుల్తాన్‌

‘‘టిపు చనిపోయి 220 ఏళ్లు అవుతున్నా..
ఇప్పటికీ వార్తల్లో ఉంటున్నాడు.
బ్రిటిషర్స్‌ మనల్ని వదిలి 72 ఏళ్లు అవుతున్నా..
క్రూర నియంతగా, ఇస్లాం మతోన్మాదిగా సుల్తాన్‌ మీద వాళ్లు వేసిన ముద్ర చెరిగిపోలేదు.

ఈ వలస సామ్రాజ్యపు విధి విధానాలను సంస్కరించుకోవాల్సిన అవసరం ఎంతుందో.. వాళ్ల కోణంలోని మన చరిత్రను తిరగ రాసుకోవాల్సిన అవసరమూ అంతే ఉంది!

అలాంటి ప్రయత్నమే ఈ ‘టిపు సుల్తాన్‌’ పుస్తకం’’ అని అంటున్నారు పుస్తక రచయిత్రి యార్లగడ్డ నిర్మల.
ఆమె హైదరాబాద్‌ వాసి.
హిస్టరీ డిపార్ట్‌మెంట్‌లో రీడర్‌గా పనిచేసి రిటైరయ్యారు.
‘టిపు సుల్తాన్‌’ రచన సందర్భంగా ఆమె గురించి ఆమె మాటల్లోనే..

‘‘పుస్తకాలు చదవడం నా దిన చర్యలో భాగం.. చిన్నప్పటి నుంచి. మా నాన్న (జయ రావు) నేర్పిన అలవాటు. ఆయన సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగి. అమ్మ (మేరీ) టీచర్‌. వాళ్లిద్దరూ ఎడ్యుకేటెడ్స్, ఉద్యోగస్తులవడం వల్ల మా ఇద్దరినీ (అక్క, నేను) బాగా చదివించారు. ఆడపిల్లలకు అంత చదువెందుకని ఏ రోజూ అనుకోలేదు. తెలుగు మీడియంలో చదివించి విడిగా ఇంగ్లిష్‌ నేర్పించారు.. సాహిత్యం ద్వారా. ఇంగ్లిష్‌ లిటరేచర్‌లోని పెద్ద పెద్ద రైటర్స్‌ అంతా మా చిన్నప్పుడే మాకు పరిచయం అయ్యారు. అంతేకాదు హాలీవుడ్‌ క్లాసిక్స్‌ అన్నీ చూపించారు మాకు.  ఇంగ్లిష్‌ భాష ఇంప్రూవ్‌మెంట్‌కు అదెంతో హెల్ప్‌ అయింది. ఇంకో రకంగా కూడా మేం అదృష్టవంతులమని చెప్పాలి.

మా ఇష్టాయిష్టాల మీద మా అమ్మానాన్న ఏనాడూ పెత్తనం చెలాయించలేదు.  ఇంటర్‌లో నాకు మంచి పర్సెంటేజ్‌ వచ్చింది. అప్పట్లో మెడిసిన్, ఇంజనీరింగ్‌లకు ఇప్పట్లా ఎంట్రన్స్‌ లేదు. మంచి పర్సెంటేజ్‌ ఉంటే చాలు సీట్‌ వచ్చేది. అట్లా నాకు ఇంటర్‌లో వచ్చిన మార్క్స్‌తో ఈజీగా మెడిసిన్‌లో సీట్‌ వచ్చేది. మా బంధువులంతా కూడా మా పేరెంట్స్‌ మీద ప్రెషర్‌ పెట్టారు నన్ను మెడిసిన్‌ చదివించమని. కాని నాన్న  నన్ను ఫోర్స్‌ చేయలేదు. డిగ్రీలో బీఏ ఇంగ్లిష్‌ లిటరేచర్‌ తీసుకున్నా. ఎమ్మేలో హిస్టరీ తీసుకున్నా.   ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యా. అప్పుడే గ్రూప్‌ వన్‌ కూడా రాశా. 23 ఏళ్లకే గ్రూప్‌ వన్‌ ఆఫీసర్‌ అయ్యా.

కాని ఆ ఉద్యోగం అంత గొప్పగా అనిపించలేదు.అప్పటికే ఎంఫిల్‌ కూడా రాసి ఉన్నా. దాంతో గ్రూప్‌ వన్‌కి గుడ్‌బై చెప్పా. అప్పుడు మాత్రం పేరెంట్స్‌ కొంచెం డిసప్పాయింట్‌ అయ్యారు. ఎంఫిల్‌ కూడా ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యా. పీహెచ్‌డీ చేశా.. విజయనగర సామ్రాజ్యంలోని గుడుల మీద. ఆ థీసిస్‌ని పబ్లిష్‌ కూడా చేశా యూజీసీ గ్రాంట్స్‌తో. అమెరికా, యూరప్‌ కంట్రీస్‌లోని స్కాలర్స్‌ అందరూ నా థీసిస్‌ను రిఫరెన్స్‌గా తీసుకుంటూంటారు. యూజీసీ ఫెలో, ఏపీపీఎస్‌సీ క్యాండిడేట్‌ని. నన్ను గైడ్‌ చేసి, ఈ స్థాయిలో నిలబెట్టిన గైడ్‌.. ప్రొఫెసర్‌ పీసపాటి శ్రీరామ్‌ శర్మగారు.

టిపు సుల్తాన్‌.. నిజాలు..!
తెలుగు, ఇంగ్లిష్‌ సాహిత్యంతోపాటు చరిత్ర అన్నా చాలా ఇష్టం నాకు. చదువు థియరీ అయితే.. దానికి ప్రాక్టికల్స్‌ పర్యటన అని బలంగా నమ్మడమే కాదు ఆచరిస్తాను కూడా. అందుకే నా సేవింగ్స్‌ అన్నిటినీ పర్యటనకు వెచ్చించాను. సోలో ట్రావెలింగ్‌నే ఇష్టపడ్తా. పందొమ్మిదో శతాబ్దపు ఇంగ్లిష్‌ సాహిత్యాన్ని ప్రాక్టికల్‌గా ఎక్స్‌పీరియన్స్‌ చేసేందుకు యూరప్‌ వెళ్లాను. చరిత్రను అర్థం చేసుకోవడానికి ఆఫ్రికా దేశాలు తిరిగాను. చిత్రంగా అక్కడి ప్రతి మూల.. ప్రతి ప్రదేశంతో నాకు ఇదివరకే పరిచయం ఉన్నట్టనిపించింది. అదే సాహిత్యానికున్న గొప్పదనం. ప్రాంతాలనే కాదు మనం లేని కాలమాన పరిస్థితుల్లోకి మనల్ని తీసుకెళ్లి వాటితో మనల్ని మమేకం చేస్తుంది. అట్లాగే నేను చూసిన హాలీవుడ్‌ క్లాసిక్స్‌లోని ప్లేసెస్‌నీ చుట్టొచ్చాను.

‘ఇగ్నోరెన్స్‌ ఈజ్‌ బ్లెస్‌’ అని బెర్నాడ్‌ షా సెలవిచ్చాడు కాని నేనైతే ‘నాలెడ్జ్‌ ఈజ్‌ హ్యాపీనెస్‌’ అనుకుంటాను. ఇదే సూత్రాన్ని నేను పనిచేసిన నాంపల్లి (హైదరాబాద్‌)లోని ఇందిరా ప్రియదర్శిని గవర్నమెంట్‌ డిగ్రీ మహిళా కాలేజ్‌ స్టూడెంట్స్‌ విషయంలోనూ అప్లయ్‌ చేశాను. నా పర్సనల్‌ ఇంటరెస్ట్‌తో యేడాదికి ఒకసారి ఆ పిల్లల్నీ స్టడీ టూర్‌కి తీసుకెళ్లేదాన్ని.

అలా చరిత్ర చదివితే, ప్రపంచం చుడితే వచ్చిన జ్ఞానమే ఈరోజు టిపు సుల్తాన్‌  గురించి రాయడానికి తోడ్పడింది.
టిపు సుల్తాన్‌ గురించి చాలా చదివాను.
మరింతగా అర్థం చేసుకోవడానికి అనేకసార్లు మైసూర్‌ కూడా వెళ్లొచ్చాను.
ఆ అనుభవం.. టిపు మీద వచ్చిన ఇంకా అనేక పుస్తకాలు.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన చరిత్రకారులు ఆయన గురించి పలు సందర్భాల్లో ఇచ్చిన రిఫరెన్స్‌లు..  థీసిస్‌ మొదలైనవాటినన్నీ అధ్యయనం చేసి... విశ్లేషించి.. రెండేళ్లు శ్రమించి రాశాను.

నాకు తెలుసు ఇప్పటి పరిస్థితుల్లో అది కాంట్రవర్షియల్‌ అని.
కాని నిజం తెలియాలి కదా.
అందుకే ధైర్యం చేశా.
దానిమీద వచ్చే ఏ చర్చకైనా ఆధారాలతో రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాను కూడా.

నిజానికి  మన చరిత్రను కూలంకుషంగా చదివి.. నిశితంగా పరిశీలిస్తే.. ఈ నేలను ఏలిన ముస్లిం రాజులు తమ రాజ్య విస్తరణ కాంక్షనే బయటపెట్టుకున్నారు తప్ప సామాన్య ప్రజల విశ్వాసాలు, జీవన విధానాల జోలికి పోలేదు.

 పద్దెనిమిదో శతాబ్దంలో ఎందరో రాజులు పాలించారు.
కాని టిపునే ఎందుకు వివాదాస్పదుడయ్యాడు?
ఆ వివాదాల చారిత్రక నేపథ్యం ఏమిటి?
మొదలైన అంశాల విశ్లేషణే నేను రాసిన ‘టిపు సుల్తాన్‌’.

చిన్న మాట
కాలం తెచ్చిన మార్పులను ఆహ్వానించాల్సిందే. అయితే విపరీతాలను నిలువరించాలంటే పాత టెక్నిక్స్‌ను ఉపయోగించాలి. ఆ పాత పద్ధతే పుస్తక పఠనం. ఇప్పుడు అవసరం. రీడింగ్‌ హాబీ సామాజిక స్పృహను కలిగిస్తుంది. భావోద్వేగాలను కంట్రోల్‌ చేసుకోవడం నేర్పిస్తుంది. ఇప్పుడు మన చదువులో సోషల్‌ సైన్సెస్‌ చోటు లేకుండా పోయింది కాబట్టి పుస్తక పఠనం కంపల్సరీ. అలాగే ఆడపిల్లలకు ఒక మాట. ధైర్యంగా ఉండాలి. సమస్యలుంటాయి. ఎదుర్కొనే స్థయిర్యాన్ని అలవర్చుకోవాలి. దీనికి చదువును మించిన ఆయుధం లేదు’’ అని చెప్తారు రైటర్, హిస్టారియన్‌ యార్లగడ్డ నిర్మల.
– సరస్వతి రమ
ఫొటో: మోహనాచారి

►నిర్మల అనేక కథలు, అనువాద కథలు రాశారు.  ఇవన్నీ ప్రముఖ దినపత్రికలు, మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి. ప్రముఖ రచయిత డాక్టర్‌ విజయభారతితో కలిసి అంబేడ్కర్‌ పుస్తకానికీ పనిచేశారు నిర్మల. ఆమె రాసిన తాజా పుస్తకం ‘టిపు సుల్తాన్‌’ను హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురణ.

(సాక్షి దినపత్రిక ,ఫామిలీ పేజ్ , 30 -9 -2019 సౌజన్యం తో )

https://epaper.sakshi.com/c/44166898

Friday, September 27, 2019

తెలుగులో " దళిత్ పాంథర్స్ "

(హైదరాబాద్ బుక్ ట్రస్ట్ త్వరలో తెలుగులో వెలువరిస్తున్న" దళిత్ పాంథర్స్ " పుస్తకం నుంచి రచయిత, దళిత్ పాంథర్ వ్యవస్తాపకులలో ఒకరైన జే.వీ.పవార్ ముందుమాట : )

డా.బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ మరణించిన తరువాత అంబేడ్కరిస్ట్‌ ఉద్యమంలో స్వర్ణ యుగం వంటిది ఏదైనా వుందంటే అది దళిత్‌ పాంథర్‌ ఉద్యమమే. ఈ మిలిటెంట్‌ సంస్థ 1972 మే 29న ఆవిర్భవించింది. ఐదు సంవత్సరాల అనంతరం 1977 మార్చి 7న సంస్థను రద్దు చేస్తున్నట్టు ముంబయిలో చేసిన ఒక పత్రికా ప్రకటనతో దళిత్‌ పాంథర్‌ సంస్థ అంతరించిపోయింది.

నాయకుల మధ్య తలెత్తిన సైద్ధాంతిక విభేదాల కారణంగా రాజా దాలే, జె.వి. పవార్‌లను సంస్థనుంచి బహిష్కరిస్తున్నట్టు నామ్‌దేవ్‌ దసాల్‌ 1974 సెప్టెంబర్‌ 30న ముంబయిలో ఒక ప్రకటన చేశారు. అది రాజుకుని 1974 అక్టోబర్‌ 23, 24 తేదీల్లో నాగపూర్‌లో జరిగిన దళిత్‌ పాంథర్స్‌ తొలి సదస్సులో నామ్‌దేవ్‌ దసాల్‌నే సంస్థ నుంచి బహిష్కరిస్తున్నట్టు తీర్మానం చేసే వరకు వెళ్లింది. ఆ తదనంతరం 1975 జూన్‌లో ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా ఆత్యయిక పరిస్థితిని విధించారు. వార్తా పత్రికల మీదా, ప్రజా సంస్థల మీదా తీవ్రమైన ఆంక్షలు అమలయ్యాయి. అందువల్ల దళిత్‌ పాంథర్‌ ఉద్యమంలో 1972 మే- 1975 జూన్‌ మధ్యకాలమే అత్యంత కీలకమైనదని చెప్పవచ్చు.

ఈ కాలంలో దళిత్‌ పాంథర్‌ ఉద్యమం దేశంలో ఒక పెను తుఫాన్‌ను సృష్టించింది. సమకాలీన సామాజిక, రాజకీయ రంగాలను ఒక ఊపు ఊపింది. దళితులపై రోజురోజుకూ పెరిగిపోతున్న అన్యాయాలను, అత్యాచారాలను దీటుగా ఎదుర్కొనేవిధంగా అంబేడ్కర్‌ అనుచరులకు నూతనోత్తేజాన్ని అందించింది. నిబద్ధ సైనికుల మాదిరిగా వీధుల్లోకి వచ్చిన యువతీయువకులను వ్యవస్థను ఎదిరించగల వీరులుగా తీర్చిదిద్దింది. బాధితులకు చేయూతనిచ్చింది. దళిత్‌ పాంథర్‌ మనుగడ సాగించింది కొద్దికాలమే అయినా మొద్దు నిద్ర పోతున్న వ్యవస్థను తట్టిలేపి, అణగారిన వర్గాలవైపు దృష్టి సారించేట్టు చేసింది. దళిత్‌ పాంథర్‌ లక్ష్యం కేవలం దళితుల ఆర్థికాభ్యున్నతి మాత్రమే కాదు వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులు సక్రమంగా అమలు జరిగేలా, సమాజంలో వారికి స్వేచ్ఛా సమానత్వం, సౌభ్రాతృత్వం దక్కేలాచేయడం కూడా.

దళిత్‌ పాంథర్‌ ఉద్యమం 1974 జనవరి 4 వరకూ ఎంతో ఉధృతంగా సాగింది. ఆతరువాత 1974 జనవరి 5న ముంబయిలో ముఖ్యంగా వోర్లీ, నయీగావ్‌ ప్రాంతాల్లో ఉద్యమంపై ఒక పథకం ప్రకారం పెద్ద ఎత్తున దాడిజరిగింది. ఆ దాడిలో దళిత్‌ పాంథర్లు భగవత్‌ జాదవ్‌, రమేష్‌ డియెరుక్కర్‌లు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది దళిత యువకుల జీవితాలు అతలాకుతలమయ్యాయి. ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. జైళ్లపాలయ్యారు. అయితే వారి త్యాగాలు అంబేడ్కరిస్ట్‌ ఉద్యమానికి ఒక కొత్త శక్తిని సమకూర్చాయనే చెప్పాలి.

కొన్ని పదవులు, కొద్దిపాటి డబ్బు కోసం ఉద్యమాన్ని సంపన్నుల పాదాలవద్ద తాకట్టు పెట్టిన పరిస్థితికి ఇది పూర్తిగా భిన్నమైనది. దళిత్‌ పాంథర్‌ కొనసాగింది కొద్దికాలమే అయినా అది భారత సమాజంమీదా, రాజకీయాల మీదా బలమైన ముద్ర వేసింది. ఈ చారిత్రాత్మకమైన ఉద్యమ ప్రభావం ఎంతటిదంటే 2006లో మహారాష్ట్ర భండారా జిల్లా ఖైర్లాంజిలో ఒక దళిత కుటుంబంలో నలుగురిని (ఒక మహిళ, ఆమె యుక్తవయసు కూతురుతో సహా) అత్యంత దారుణంగా హత్యచేసినప్పుడు- కులపరమైన దాడులకు పాల్పడేవారిని నిర్మూలించేందుకు మళ్లీ దళిత్‌ పాంథర్‌ వంటి మిలిటెంట్‌ సంస్థ కావాలి అన్న డిమాండ్‌ తిరిగి బలంగా వినిపించింది.

ఈ ఉద్యమంపై ఇప్పటికే పలు పరిశోధనాపత్రాలు, సంకలనాలతో సహా అనేక రచనలు వెలువడ్డాయి.

వార్తాపత్రికలలో వచ్చిన కథనాలను, ఉద్యమకారులతో జరిపిన సంభాషణలను ఆధారంగా చేసుకుని దళిత్‌ పాంథర్‌పై ఆ పరిశోధనా పత్రాలను, వ్యాస సంకలనాలను తయారుచేశారు. చాలామంది తమ సైద్ధాంతిక ఆలోచనలకు అనుగుణంగా, తమకు నచ్చిన రీతిలో దళిత్‌ పాంథర్‌ ఉద్యమాన్ని విశ్లేషించారు. రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. వాటిలో చరిత్రను వక్రీకరిస్తూ, గాలివాటంగా చేసినవే ఎక్కువ. మరికొందరు ప్రచారం కోసం, తాత్కాలిక లబ్దికోసం ఉద్యమకారులమనే ముసుగుతో, ఉద్యమ పితామహులమని చెప్పుకుంటూ రచనలు చేశారు. ఉద్యమాన్ని మొట్టమొదటి రోజునుంచీ పరిశీలించిన ప్రత్యక్ష సాక్షిని నేను. కేవలం ప్రేక్షకుడిగానో, రచయితగానో కాకుండా ఈ ఉద్యమ వ్యవస్థాపకుల్లో ఒకడిగా, చురుకైన ఉద్యమకారుడిగా ఈ ఉద్యమంలో పాలుపంచుకున్నాను. దళిత్‌ పాంథర్‌ సంస్థకు నామ్‌దేవ్‌ దసాల్‌, నేనూ వ్యవస్థాపకులం. అలాగే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి రాజా దాలే.

కాబట్టి, దళిత్‌ పాంథర్‌ ఉద్యమ చరిత్రను రాజా దాలే, నామ్‌దేవ్‌ దసాల్‌, జె.వి.పవార్‌ (నేను) మాత్రమే సరిగా లిఖించేందుకు అర్హులమని భావిస్తాను. నేను మొదట దళిత్‌ పాంథర్‌ నిర్వాహకుడిగా, ఆతరువాత ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. తత్ఫలితంగా సంస్థకు సంబంధించిన ఉత్తరప్రత్యుత్తరాలు, దస్తావేజులు అన్నీ నావద్ద భద్రంగా వున్నాయి. ఆరోజుల్లో ఫొటో కాపీయింగ్‌ యంత్రాలు అందుబాటులో వుండేవి కావు. అందువల్ల ఉత్తరాలను, ప్రకటనలను రాసేటప్పుడు కార్బన్‌ పేపర్లను ఉపయోగించి ప్రతులను తయారు చేసేవాళ్లం. అలాంటి వాటన్నింటినీ నేను జాగ్రత్తగా భద్రపరిచాను. ఈ పుస్తకంలో పేర్కొన్న విషయాలన్నింటికీ నావద్ద సాక్ష్యాధారాలు వున్నాయనీ, ఇవన్నీ సాధికారికమైనవనీ స్పష్టం చేసేందుకే నేనీ మాట చెబుతున్నాను. వీటికి తోడు మహారాష్ట్ర ప్రభుత్వం వారు నాకు ప్రాచీన పత్ర భాండాగారాన్నీ, పోలీసు ఇంటలిజెన్సు విభాగాల దస్తావేజులను అన్నింటినీ పరిశీలించేందుకు అనుమతినిచ్చారు. అందువల్ల నా ఈ రచనకు మరింత సాధికారికత చేకూరింది.

'డా. బి.ఆర్‌.అంబేడ్కర్‌ అనంతరం అంబేడ్కరిస్ట్‌ ఉద్యమం' అనే అంశంపై నేను మరాఠీలో అనేక వ్యాసాలు రాశాను. అదే క్రమంలో వెలువడుతున్న నాలుగవ పుస్తకం ఇది. దళిత్‌ పాంథర్‌ ఉద్యమ కాలం ఎంతో మహత్తరమైనది. రాజా దాలే, నామ్‌దేవ్‌ దసాల్‌లతో సహా అనేకమంది మేధావులు ఇప్పటికే ఈ ఉద్యమంపై పలు రచనలు చేశారు.

దళిత్‌ పాంథర్‌ ఉద్యమ కాలంలో మరాఠీ వార్తా పత్రిక 'నవకాల్‌' సంపాదకుడు నీలూభావ్‌ ఖాదిల్కర్‌ తన పత్రికను ఈ ఉద్యమవార్తలకు వేదికగా చేశారు. నవకాల్‌ దళిత్‌ పాంథర్ల అధికార పత్రికేమో అన్నట్టుగా వుండేది. దీనితోపాటు నవశక్తి, మరాఠా, మహారాష్ట్ర టైమ్స్‌, లోక్‌సత్తా, సకాల్‌ వంటి మరికొన్ని ఇతర పత్రికలు కూడా దళిత్‌ పాంథర్‌ వార్తలను ప్రచురిస్తూ ఉద్యమానికి ఎంతో అండగా నిలిచాయి. వారందరికీ ఈసందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

1956 డిసెంబర్‌ 6న అంబేడ్కర్‌ చనిపోయిన తరువాత అంబేడ్కరిస్ట్‌ ఉద్యమం ఇటు విజయాలనూ అటు అపజయాలనూ రెండింటినీ చవిచూసింది. ఉద్యమ విజయాల విషయానికి వస్తే దళిత్‌ పాంథర్‌ ఉద్యమం చెప్పుకోతగ్గది. ఈ ఉద్యమకాలంలో సామాజికంగా, విద్యాపరంగా, సాంస్కృతిక పరంగా ఎంతో పరిపక్వతను సాధించడం జరిగింది. సాహిత్య, కళా రంగాలలో ఉద్యమం శిఖరాగ్రాలకు చేరుకుంది. ముఖ్యంగా ఆనాటి అంబేడ్కరిస్ట్‌ సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇవాళ కూడా ఆ సాహిత్యానికి ఎంతో గౌరవం, ఆమోదం లభిస్తున్నాయి. వాస్తవికతపై ఆధారపడి రూపుదిద్దుకున్నది కాబట్టే ఆ సాహిత్యానికి అంతటి ప్రాముఖ్యత వుంది. నిన్నమొన్నటి వరకూ ఆ రచనలను దళిత సాహిత్యంగా పరిగణించిన వాళ్లు ఇవాళ అంబేడ్కరిస్ట్‌ సాహిత్యంగా గౌరవిస్తున్నారు. అంబేడ్కర్‌కు ముందరి పరిస్థితులకూ ఈనాటి సామాజిక పరిస్థితులకూ మధ్య ఎంతో తేడా వుంది. 'చదువు, సంఘటితమవు, పోరాడు' అంటూ డా. అంబేడ్కర్‌ ఇచ్చిన గొప్ప పిలుపే ఇందుకు మూలకారణం.

అంబేడ్కర్‌ జీవించివున్న కాలంలో నేను కార్యకర్తగా గానీ, రచయితగా గానీ లేను. అంబేడ్కర్‌ సంపాదకత్వం వహించిన 'మూక్‌ నాయక్‌', 'ప్రబుద్ధ భారత్‌' వంటి పత్రికలకు అనేకమంది తమ రచనలను అందించేవారు. అయితే వాళ్లంతా ఆకాలపు వార్తలను నమోదు చేసిన వాళ్లు మాత్రమే. వారిలో సి.బి.ఖైర్మోడ్‌ రచనా విధానం ఎంతో అమూల్యమైనది. నేను ఈ పుస్తకంలో అంబేడ్కర్‌ అనంతర ఉద్యమాన్ని కేవలం నమోదు చేయాలనికాకుండా విశ్లేషించాలని భావిస్తున్నాను. ఈ ఉద్యమంలో నేను స్వయంగా పాలుపంచుకున్నాను. ఏదో మూలన కుర్చుని ఉద్యమాన్ని చూసిన మౌన ప్రేక్షకుడిని కాదు నేను. అందువల్ల ఉద్యమ చరిత్రను నా రచన సమగ్రంగా విశ్లేషిస్తుంది. నేను 1972 నుంచి ఉద్యమ అగ్రభాగాన నిలవడమే కాకుండా అంతకుముందు 1964లో సుప్రసిద్ధ భూపోరాట ఉద్యమాన్ని నడిపిన దాదాసాహెబ్‌ గైక్వాడ్‌ విద్యార్థి విభాగానికి కూడా నాయకత్వం వహించివున్నాను.

నేనూ, నా కవిమిత్రుడు నామ్‌దేవ్‌ దసాల్‌ కలిసి 1972లో దళిత్‌ పాంథర్‌ని నెలకొల్పాం. అది స్వల్ప కాలమే జీవించివున్నప్పటికీ అమెరికాలో బ్లాక్‌ పాంథర్‌ ఉద్యమం మాదిరిగా అంబేడ్కర్‌ మరణానంతర ఉద్యమాలన్నింటికీ గొప్ప స్ఫూర్తి ప్రదాతగా నిలిచింది.

నాటి పోరాటకాలంలో అనేక కష్ట నష్టాలకు గురైన దళిత పాంథర్లు సమాజంలో విశ్వసనీయతనూ, గౌరవాన్ని సంపాదించుకున్నారు. డా.బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్‌.పి.ఐ.)కి నిర్దేశించిన లక్ష్యాలను ఆ పార్టీ సాధించలేకపోయింది. ఆ పార్టీ నాయకుల స్వార్థం, స్వప్రయోజనాల మూలంగా 1960లలో అంబేడ్కర్‌ అనంతర ఉద్యమం బలహీనపడటం మొదలయింది.

రిపబ్లికన్‌ పార్టీ ఎదుగుదల మీద కాకుండా కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడం మీద ఆ నాయకులు ఎక్కువ దృష్టిని కేంద్రీకరించారు. దాంతో కాంగ్రెస్‌ పార్టీ మరింత అహంకారపూరిత, దోపిడీ పార్టీగా తయారైంది.

గ్రామీణ ప్రాంతాల్లో దళితులపై జరిగే అత్యాచారాలను రూపుమాపేందుకు దళిత్‌ పాంథర్‌ చిత్తశుద్ధితో కృషిచేసింది. తమను కాపాడేందుకు ఒక సంస్థ, ఒక బృందం వున్నాయన్న స్పృహను అది దళితులలో పెంపొందిచగలిగింది. ఇప్పటికీ గ్రామాల్లో దళితుల మీద అత్యాచారాలు జరిగినప్పుడు జనం దళిత్‌ పాంథర్‌ వంటి ఉద్యమ సంస్థ వుంటే ఎంత బాగుండేదో అని తలచుకోవడం కనిపిస్తుంది.

దీనినిబట్టి దళిత్‌ పాంథర్‌కు దళిత ప్రజల్లో ఎంత గుర్తింపు, అభిమానం వున్నాయో అర్థం చేసుకోవచ్చు. దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమం మహరాష్ట్ర నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నప్పుడు కూడా అది ఏనాడూ పలచబడలేదు. సామాజిక శాస్త్రవేత్తలు దళిత్‌ పాంథర్స్‌ ప్రాముఖ్యతను గుర్తించారు. ఇంకా ఈనాటికీ దేశ విదేశాల్లో దళిత్‌ పాంథర్ల చరిత్రను విశ్లేషించడం జరుగుతూనే వుంది. దళిత్‌ పాంథర్ల చరిత్రను చదివి పరిశోధకులు, విద్యార్థులు ఎంతగానో ఉత్తేజం పొందుతుంటారు. దళిత్‌ పాంథర్ల మిలిటెంట్‌ క్రియాశీలతను ఇవాళ తిరిగి పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈ దృష్టితోనే ఈ రచనను ముందుగా హిందీ, ఇంగ్లీషు భాషల్లో తీసుకురావడం జరిగింది. నేను దళిత్‌ పాంథర్‌ చరిత్రను 'దళిత్‌ పాంథర్స్‌' అన్న పేరుతో 2010 డిసెంబర్‌ 6 న మరాఠీలో వెలువరించాను. మరాఠీ పాఠకులు, కార్యకర్తలు దానిని విశేషంగా ఆదరించారు.

దళిత్‌ పాంథర్‌కు సంబంధించిన సమాచారం కోసం ప్రపంచం నలుమూలలనుంచీ పరిశోధకులు, విద్యార్థులు తరచూ అడుగుతుంటారు. అందువల్లే ఈ పుస్తకం హిందీ, ఇంగ్లీషు భాషల్లో వస్తే చాలా ఉపయోగంగా వుంటుందని నాకు అనిపించింది. అమెరికా బ్లాక్‌ పాంథర్స్‌కు చెందిన ఉద్యమకారిణి ఏంజెలా డేవిస్‌ 2016 డిసెంబర్‌ 16న భారతదేశానికి వచ్చినప్పుడు అమెరికాలో పోరాడుతున్న ఆఫ్రికన్‌-అమెరికన్‌ సోదరీ సోదరుల ప్రయోజనం కోసం ఈ పుస్తకాన్ని ఇంగ్లీషులో తీసుకొస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ పుస్తకాన్ని మరాఠీ నుంచి ఇంగ్లీషులోకి అనువదించిన నా సీనియర్‌ సహోద్యోగి రక్షిత్‌ సోనేవాడీకి నేను ఎంతగానో రుణపడివుంటాను. ....
...... - జే.వీ.పవార్

Thursday, September 19, 2019

ఇది రిజర్వేషన్ల దేశం

ఇది రిజర్వేషన్ల  దేశం 
రిజర్వేషన్ల గురించి భారతదేశంలో ఎప్పుడూ ఏదో ఒక మూల వివాదం నడుస్తూనే ఉంటుంది. రిజర్వేషన్ల అవసరాన్నీ లక్ష్యాన్నీ అర్థం చేసుకున్న మేధావులే తరచుగా ఆ వివాదాలను లేవదీసి సామాన్య ప్రజలను రెచ్చగొడుతూ ఉండటం పరిపాటి అయింది.
ప్రాచీన హిందూదేశంలో రిజర్వేషన్లు పొందిన వర్గాల సంగతి సరే. ఆధునిక భారతదేశంలో రిజర్వేషన్లు పొందుతున్నవారూ రిజర్వేషన్ల అమలు గురించి అసంతృప్తితోనే ఉన్నారు. రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాలంటున్నారు.
రాజ్యాంగ నిర్మాతల అసలు లక్ష్యాలను వెనక్కు నెట్టివేసి రిజర్వేషన్లను రాజకీయ అంశంగా మాత్రమే చూస్తున్న కొందరు చేస్తున్న వాదనలు విస్మయజనకంగా ఉన్నాయి.
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా దేశ జనాభాలో 13 శాతం కూడా లేని అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవలే భారత పార్లమెంటు చేసిన రాజ్యాంగ సవరణ పాలకవర్గాల ప్రయోజనాలకు అనువుగా రూపొందిందన్న విమర్శ వినవస్తున్నది. దేశ ప్రయోజనాలకు అవసరమైన ఎన్నెన్నో అంశాలు సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉండగా అగ్రవర్ణాల లోని పేదలకు రిజర్వేషన్ కల్పించే బిల్లు అత్యవసరంగా అతి తక్కువ వ్యవధిలో చట్టంగా తెచ్చారు. కేంద్ర మంత్రిమండలి 8-1-2019న బిల్లును ఆమోదించింది. మర్నాడే లోక్సభలో ప్రవేశపెట్టారు. మూడు నాలుగు గంటల చర్చతోనే ఆమోదించారు. మర్నాడు రాజ్యసభ దీనిని ఆమోదించింది. 103వ రాజ్యాంగ సవరణ అనంతరం ఈ బిల్లు 12-1-2019న ఆమోదం పొంది 14-1-2019 నుండి అమలులోకి వచ్చింది.
ఇది రిజర్వేషన్ల  దేశం 
బొజ్జా తారకం
208 పేజీలు, వెల: రూ.150/-
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ , బొజ్జా తారకం ట్రస్ట్
 ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
 ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com  

టిపు సుల్తాన్

టిపు సుల్తాన్
మరణించిన 220 సంవత్సరా తర్వాత కూడా ఇప్పటికీ  తాజాగా వార్తల్లో ఉంటున్న వ్యక్తి టిపు సుల్తాన్‌. టిపు చరిత్ర 18వ శతాబ్దం ఉత్తరార్థపు భారతదేశ చరిత్ర. 1750లో జన్మించిన టిపు మే 4, 1799, అంటే 18వ శతాబ్దం ఇంకా ఎనిమిది నెల్లో ముగుస్తుందనగా మరణించాడు. టిపు మరణంతో 19వ శతాబ్దం మొదటి దశకంలో భారత దేశంలో ‘బ్రిటిష్‌ రాజ్‌’ నిరాఘాటంగా స్థాపించబడిరది. 1799లో టిపు మరణంతో  మైసూర్‌ రాజ్యం తన స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయి బ్రిటిష్‌ సామంత రాజ్యం అయ్యింది. తర్వాత, ఒకే ఒక  స్వతంత్ర రాజ్యంగా మిగిలిన మరాఠా రాజ్యం కూడా 1803లో అంటే టిపు మరణించిన నాలుగు సంవత్సలరాకు తన స్వాతంత్య్రాన్ని కోల్పోయి బ్రిటిష్‌ సామంత రాజ్యం అయ్యింది. 1818లో మరాఠాలు తమ స్వాతంత్రాన్ని తిరిగి పొందే ప్రయత్నం చేశారు. కానీ ఆ సంవత్సరం బ్రిటిష్‌ వారితో జరిగిన కోరేగావ్‌ యుద్ధంలో ఘోర పరాజయం పాలై తమ అస్తిత్వాన్నే కోల్పోయారు. మరాఠా రాజ్యం బ్రిటిష్‌ తూర్పు ఇండియా కంపెనీ సామ్రాజ్యంలో భాగమయ్యింది. పేష్వా బ్రిటిష్‌ వారి పింఛనుదారుడయ్యాడు.
  టిపు మరణవార్త తెలుసుకొని టిపుకు వ్యతిరేకంగా తరచూ ఆంగ్లేయుతో  సహకరించిన, అప్పుడు మరాఠా రాజ్యాన్ని నడిపిస్తున్న మరాఠా రాజకీయ దురంధరుడు నానా ఫడ్నవీస్‌ చెప్పిన భవిష్య వాణిని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ‘‘టిపు మరణించాడు. ఆంగ్లేయు బలం పెరుగుతుంది.ఇప్పటికే తూర్పు భారతమంతా వారి ఆధీనంలో ఉంది. తర్వాత పూనాయే వారి గురి. ముందు ముందు చెడ్డ రోజు రాబోతున్నాయి. తరాతను ఎవరూ తప్పించలేరు’’
టిపు సుల్తాన్
ఆంగ్లేయులకు తలవంచని వీరుడు
యర్లగడ్డ  నిర్మల 
160 పేజీలు, వెల: రూ.150/-
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ , బొజ్జా తారకం ట్రస్ట్
 ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
 ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com 

Monday, September 16, 2019

నరమేధాలూ నియోగాలూ మహా భారతం - ఆదిపర్వం పరిశీన

                 నరమేధాలూ నియోగాలూ మహా భారతం - ఆదిపర్వం పరిశీన  
మహాభారతంలోని సర్పయాగమూ, రాక్షసమేధమూ, ఖాండవ దహనమూ, శత్రువును మూక ఉమ్మడిగా హతమార్చిన సంఘటనుగా గుర్తించవచ్చునని ఈ పరిశీన చెబుతున్నది. పురోహిత వ్యవస్థ, పురుషస్వామ్యమూ రాజకీయ హత్యలూ, నియోగ పద్ధతులూ  కింది వర్గానూ స్త్రీనూ అణచిపెట్టి ఉంటే ధర్మసూక్ష్మాుగా రూపొందటాన్ని ఇక్కడ గమనించవచ్చు.
పురాణాలలోని కథను పరమ సత్యాలుగా పవిత్ర విషయాలుగా నమ్మేవారు. వాటిలోని అంతరార్థాను గ్రహించవసిన అవసరం - ఈనాడు - ఎక్కువగా కనిపిస్తున్నది. అరుంధతినీ వసిష్ఠుడినీ ఆదర్శదంపతులుగా చూసే సమాజం ఈనాడు వర్ణాంతర వివాహాను ఎందుకు అంగీకరించలేకపోతున్నది? గుణకర్మల వ్లనే వర్ణం నిర్ణయమవుతుందన్న గీతా బోధనను ఎందుకు మన్నించలేకపోతున్నది? జ్ఞాన సమాజం కులా సమాజంగా ఎందుకు మారింది? అని ప్రశ్నించుకుని పురోగమించవసిన తరుణంలో ఈ గ్రంథంలోని పరిశీన కొంతైనా పాఠకును ఆలోచింపజేస్తుంది.
పూర్వ సంస్కృతిని అర్థం చేసుకోవటంలో ఇదొక కోణం.

బి.విజయభారతి 
380 పేజీలు, వెల: రూ.250/-
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ , బొజ్జా తారకం ట్రస్ట్
 ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
 ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com

Tuesday, September 10, 2019

తథాగతుని అడుగుజాడలు


తథాగతుని అడుగుజాడలు
విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న ప్రాచీన బౌద్ధ క్షేత్రాలతో మొదలుపెట్టి, బుద్ధుని జీవితగాథనూ, అతడు బోధించిన ధర్మ సూత్రాలనూ, దేశవిదేశాలలో బౌద్ధ ధర్మం విస్తరించిన క్రమాన్నీ, ఆరామ జీవనాన్నీ ఈ రచన పేర్కొంటుంది. ముఖ్యంగా బుద్ధుని బోధనల ఆధునికతనూ, సమకాలీనతనూ ఈ పుస్తకం పాఠకుల ముందుంచుతుంది. ఈ పుస్తకం బౌద్ధ క్షేత్రాలలో కనిపించే అవశేషాలపట్ల కుతూహలం కలిగిన సందర్శకులనూ, బౌద్ధంపట్ల ఆసక్తి ఉన్న పాఠకులనూ, తమ స్థానిక చరిత్రను తెలుసుకొనగోరే  ఔత్సాహికులనూ దృష్టిలో ఉంచుకొని వ్రాసినది. ఎంతో చారిత్రక విశిష్టతను కలిగిన బౌద్ధ అవశేషాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను పాఠకుల దృష్టికి తెస్తుంది.
తథాగతుని అడుగుజాడలు
రచన: 
రాణీ శర్మ ఈమని
ఉణుదుర్తి సుధాకర్

196 పేజీలు, వెల: రూ.200/-
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com 

Saturday, August 17, 2019

ఫెమినిస్ట్ అంబేడ్కర్ సమాజం - మహిళలపై అంబేడ్కర్

ఫెమినిస్ట్ అంబేడ్కర్
సమాజం - మహిళలపై అంబేడ్కర్
హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెడుతూ డా. అంబేడ్కర్ స్త్రీలు వివాహితులైతే ఒక చట్టం, అవివాహితులైతే ఒక చట్టం, వితంతువులైతే మరో చట్టం, ఇన్ని రకాలుగా ఉండటం సరైంది కాదని బలంగా వాదించారు. స్త్రీలకు ఆస్తి హక్కు ఉండాలని, ఆస్తి పంపకాల సందర్భంగా వితంతువుల పట్ల వివక్ష ఉండకూడదని మార్పులు సూచించారు. కులాంతర మతాంతర వివాహాలకు కూడా చెల్లుబాటు ఉండాలని, ధార్మిక పద్ధతులకి అతీతంగా రిజిస్టర్ పెళ్లిళ్లను ప్రవేశపెట్టి ఏ పద్దతిలో చేసుకునే పెళ్లిళ్లకైనా గుర్తింపు గౌరవం ఉండాలని హిందూ కోడ్ బిల్లులో సూచించారు. ఇంకా చాలా సందర్భాలలో చట్ట సభల్లో ఆయన స్త్రీల సమస్యల గురించి వాదించారు. స్త్రీలకు కుటుంబ నియంత్రణ పద్దతులను సులభంగా అందుబాటులో ఉంచవలిసిన బాధ్యత ప్రభుత్వానిదే అని గట్టిగా వాదించారు. అలాగే ముంబయ్ ఫ్యాక్టరీల్లో స్త్రీలకు ప్రసూతి ప్రయోజన బిల్లును ప్రవేశపెట్టాలని, ఆ భారం మొయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని నొక్కి చెప్పారు. స్త్రీల చేతిలో అక్షరాస్యత ఒక ఆయుధంగా పనిచేస్తుందన్నారు. అన్ని వర్గాల స్త్రీలకు ఓటు హక్కు కావాలన్నారు. ముఖ్యంగా ఆయన ఈ వాదనలు చేసిన కాలాన్ని కనక దృష్టిలో పెట్టుకుంటే (1930 లు, 50 ల మధ్య కాలం) ఆ కాలంలోనే స్త్రీల విషయంలో ఇంత ప్రగతిశీలంగా ఆలోచించడం డా. అంబేడ్కర్ లోని ఒక ఫెమినిస్టు కోణాన్ని చూపిస్తుంది. ప్రత్యేకంగా స్త్రీలకు సంబంధించి డా.అంబేడ్కర్ గురించి తెలుసుకోవాలనుకొనేవారికి ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది.
ఫెమినిస్ట్ అంబేడ్కర్
తెలుగు అనువాదం : 
బి. అనురాధ
బొజ్జా తారకం
బి. విజయభారతి
జి. భార్గవ

120 పేజీలు, వెల: రూ.100/-
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com 

Wednesday, July 31, 2019

సన్నిహితుల జ్ఞాపకాలలో అంబేడ్కర్

సన్నిహితుల జ్ఞాపకాలలో అంబేడ్కర్
ఈ పుస్తకం, పత్రికాశీర్షికలకూ, చారిత్రక ఘట్టాలకూ అతీతమైన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి సన్నిహిత స్వరూపాన్ని పాఠకుల ఎదట పెట్టడానికి చేసిన ప్రయత్నం. అంబేద్కర్ జీవితాన్ని వెలుగులతో నింపుతూ, ఆయన మరణంతోనే అంతరించిన కొన్ని యథార్థాలను పునర్దర్శించుకోవడం దీని లక్ష్యం – పుస్తకాల సేకరణలో, గ్రంథాలయ నిర్మాణంలో ఆయన తపన, పట్టుదల, చురుక్కుమనిపించే ఆయన హాస్యకుశలత, తొలిసారి ఆయన్ని దర్శించడంలో అభిమానులలో కలిగిన భావోద్వేగాలు, వేసవి తుఫాను బీభత్సం నుంచి ఇంట్లోకి అడుగుపెడుతూ ఆయన వయొలిన్ వాదనను విన్నప్పుడు కలిగిన గొప్ప అనుభూతి – వీటన్నిటినీ మీ ముందుకు తెస్తుంది ఈ పుస్తకం.  ఇక్కడ మీకు ఆయన సహాయకులు, అభిమానులు, అనుచరుల మాటల్లో షేర్వాణీ, కుర్తాలు, లుంగీ, ధోవతులు, చివరకు ఎలాస్టిక్ చెడ్డీల పట్ల ఆయన మోహం గురించి తెలుస్తుంది. కుక్కల్ని ప్రేమించే అంబేద్కర్, ఫౌంటెన్ పెన్నులను సేకరించే అంబేద్కర్, గర్భనిరోధాన్ని, లైంగిక విద్యను సమర్థించిన అంబేద్కర్, మద్యపాన నిషేధాన్ని కోరిన అంబేద్కర్, మద్యాన్ని ముట్టని అంబేద్కర్, అపుడపుడూ వంట కూడా చేసిన అంబేద్కర్ ఇక్కడ మనకు దర్శనమిస్తారు.
          ఈ సంకలనంలోని వేర్వేరు అంశాలన్నీ కలిపి చూసినపుడు ఆయన వ్యక్తిత్వంలోని భిన్న పార్శ్వాలు మనకు కనిపిస్తాయి. ఆయన జీవిత చరిత్రాన్వేషణలో మనకు ఎంతో సంతృప్తిని కలిగించే రచన ఇది. 


సన్నిహితుల జ్ఞాపకాలలో అంబేడ్కర్

వ్యాసాల ఎంపిక, సంపాదకత్వం : సలీమ్ యూసఫ్‌జీ
ముందుమాట : ఊర్మిళా పవార్
ఉపోద్ఘాతం : బామా
ఫోటోల సేకరణ : విజయ్ సుర్వాడే
తెలుగు అనువాదం :  సి. మృణాళిని

168 పేజీలు, వెల: రూ.200/-
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com  

Saturday, July 20, 2019

తెలుగులో 'దళిత్‌ పాంథర్స్‌' చరిత్ర



తెలుగులో 'దళిత్‌ పాంథర్స్‌' చరిత్ర

మొన్న జులై 16న ముంబయిలో మరణించిన రాజా దాలే (78) దళిత్‌ పాంథర్స్‌ వ్యవస్థాపకులైన ముగ్గురిలో ఒకరు. మిగతా ఇద్దరు నామ్‌దేవ్‌ దసాల్‌, జె.వి.పవార్‌లు. రాజా దాలే అద్భుతమైన వక్త. ఆయన ప్రసంగాలు దళిత యువతను ఉర్రూతలూగించేవి.

దళితులపై జరుగుతున్న అత్యాచారాలను చూసి సహించలేక వాటిని అరికట్టేందుకు మిలిటెంట్‌ పోరాటాలు అనివార్యంగా భావించి వాళ్లు నడుంబిగించారు. అమెరికాలోని ఆఫ్రో అమెరికన్ల 'బ్లాక్‌ పాంథర్స్‌' సంస్థ ప్రేరణతో తమ సంస్థకు దళిత్‌ పాంథర్స్‌ అని పేరు పెట్టుకున్నారు. దళిత్‌ పాంథర్స్‌ సంస్థ ఉనికిలో వున్నది ఐదేళ్లే (1972-77). అందులోనూ చురుకుగా పనిచేసింది కేవలం మూడేళ్లే. 1975లో ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించిన కారణంగా చివరి రెండేళ్లూ తీవ్ర నిర్బంధాలకు గురికావలసి వచ్చింది.

ఆ మూడేళ్ల కాలం లోనే  దళిత్‌ పాంథర్స్‌ ముంబయినీ, మహరాష్ట్రనీ ఒక ఊపు ఊపింది. దళిత సమస్యపై యావద్దేశం దృష్టి సారించేట్టు చేసింది. సామాజిక, రాజకీయ రంగాలలో తనదైన ప్రభావాన్ని చూపింది. దళిత యువతలో పోరాట స్ఫూర్తిని నింపింది. దళిత్‌ పాంథర్స్‌ రద్దయిపోయి ముఫ్పై నాలుగేళ్లు గడచినా ఈనాటికీ అది  చేసిన వీరోచిత పోరాటాలు, సాధించిన విజయాలు, రచనలు ఎందరికో ఉత్తేజాన్ని ఇస్తూనే వున్నాయి.
సంస్థ నిర్మాతల్లో ఒకరైన జె.వి.పవార్‌ రాసిన ''దళిత్‌ పాంథర్స్‌ - ఏన్‌ అథారిటేటివ్‌ హిస్టరీ'' అన్న పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ త్వరలో తెలుగులో వెలువరించనుంది. ఈ సందర్భంగా పుస్తక రచయిత రాసిన ముందుమాట నుంచి కొన్ని భాగాలు మీకోసం.



... ... ...

డా.బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ మరణించిన తరువాత అంబేడ్కరిస్ట్‌ ఉద్యమంలో  స్వర్ణ యుగం వంటిది ఏదైనా వుందంటే అది దళిత్‌ పాంథర్స్‌కే చెందుతుంది. ఈ మిలిటెంట్‌ సంస్థ 1972 మే 29న ఏర్పడింది. ఐదు సంవత్సరాల అనంతరం 1977 మార్చి 7న ముంబయిలో నిర్వాహకులు చేసిన ఒక పత్రికా ప్రకటనతో దళిత్ పాంథర్స్ రద్దు అయిపోయింది.

అంతకుముందు నాయకుల మధ్య తలెత్తిన సైద్ధాంతిక విభేదాల కారణంగా రాజా దాలేను , జె.వి. పవార్‌ను సంస్థనుంచి బహిష్కరిస్తున్నట్టు నామ్‌దేవ్‌ దసాల్‌ 1974 సెప్టెంబర్‌ 30న ముంబయిలో ఒక ప్రకటన విడుదల చేశారు. అది రాజుకుని 1974 అక్టోబర్‌ 23, 24 తేదీల్లో నాగపూర్‌లో జరిగిన దళిత్‌ పాంథర్స్‌ తొలి సదస్సులో నామ్‌దేవ్‌ దశాల్‌నే సంస్థ నుంచి బహిష్కరిస్తున్నట్టు తీర్మానం చేసే వరకు వెళ్లింది.

ఆ తదనంతరం 1975 జూన్‌లో ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా ఆత్యయిక పరిస్థితిని విధించారు. వార్తా పత్రికల మీదా, ప్రజా సంస్థల మీదా తీవ్రమైన ఆంక్షలు అమలుయ్యాయి. అందువల్ల దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమంలో 1972 మే- 1975 జూన్‌ మధ్యకాలమే అత్యంత కీలకమైనదని చెప్పవచ్చు.

ఈ కాలంలో దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమం ఒక తుఫాన్‌ను సృష్టించింది. సమకాలీన సామాజిక, రాజకీయ రంగాలను ఒక కుదుపు కుదిపింది. దళితులపై రోజురోజుకూ పెరిగిపోతున్న అన్యాయాలను, అత్యాచారాలను దీటుగా ఎదుర్కొనేవిధంగా అంబేడ్కర్‌ అనుచరులకు నూతనోత్తేజాన్ని అందించింది. నిబద్ధత తో వీధుల్లోకి వచ్చిన యువతీయువకులను వ్యవస్థను ఎదిరించే వీర సైనికుల్లా తీర్చిదిద్దింది. బాధితులకు చేయూతనిచ్చింది.
దళిత్‌ పాంథర్స్‌ మనుగడ సాగించింది కొద్దికాలమే అయినా మొద్దు నిద్ర పోతున్న వ్యవస్థను తట్టిలేపి అణగారిన వర్గాలపై దృష్టిని సారించేట్టు చేసింది. దళిత్‌ పాంథర్స్‌ లక్ష్యం కేవలం దళితుల ఆర్థికాభ్యున్నతి మాత్రమే కాదు, వారికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు సక్రమంగా అమలు జరిగేలా, సమాజంలో వారికి స్వేచ్ఛా సమానత్వం, సౌభ్రాతృత్వం దక్కేలా చేయడం కూడా.
... ... ...

1956 డిసెంబర్‌ 6న అంబేడ్కర్‌ చనిపోయిన తరువాత అంబేడ్కరిస్ట్‌ ఉద్యమం ఇటు విజయాలనూ అటు అపజయాలనూ రెండింటినీ చవిచూసింది. ఉద్యమ విజయాల విషయానికి వస్తే దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమం చెప్పుకోతగ్గది. ఈ ఉద్యమకాలంలో సామాజికంగా, విద్యాపరంగా, సాంస్కృతిక పరంగా ఎంతో పరిపక్వతను సాధించడం జరిగింది. సాహిత్య, కళా రంగాలలో ఉద్యమం శిఖరాగ్రాలకు చేరుకుంది. ముఖ్యంగా ఆనాటి అంబేడ్కరిస్ట్‌ సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇవాళ కూడా ఆ సాహిత్యానికి ఎంతో గౌరవం, ఆమోదం లభిస్తున్నాయి. వాస్తవికతపై ఆధారపడి రూపుదిద్దుకున్నది కాబట్టే ఆ సాహిత్యానికి అంతటి ప్రాముఖ్యత వుంది. నిన్నమొన్నటి వరకూ ఆ రచనలను దళిత సాహిత్యంగా పరిగణించిన వాళ్లు ఇవాళ అంబేడ్కరిస్ట్‌ సాహిత్యంగా గౌరవిస్తున్నారు. అంబేడ్కర్‌కు ముందరి పరిస్థితులకూ ఈనాటి సామాజిక పరిస్థితులకూ మధ్య ఎంతో తేడా వుంది. 'చదువు, సంఘటితమవు, పోరాడు' అంటూ డా. అంబేడ్కర్‌ ఇచ్చిన గొప్ప పిలుపే ఇందుకు మూలకారణం.
... ... ...

నాటి పోరాటకాలంలో అనేక కష్ట నష్టాలకు గురైన దళిత పాంథర్లు సమాజంలో విశ్వసనీయతనూ, గౌరవాన్ని సంపాదించుకున్నారు. రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్‌.పి.ఐ.)కి డా.అంబేడ్కర్‌ నిర్దేశించిన లక్ష్యాలను ఆ పార్టీ సాధించలేకపోయింది. ఆ పార్టీ నాయకుల స్వార్థం, స్వప్రయోజనాల మూలంగా 1960లలో అంబేడ్కర్‌ అనంతర ఉద్యమం బలహీనపడటం మొదలయింది.

ఆ నాయకులు రిపబ్లికన్‌ పార్టీ ఎదుగుదల మీద కాకుండా కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడం మీద ఎక్కువ దృష్టిని కేంద్రీకరించారు. దాంతో కాంగ్రెస్‌ పార్టీ మరింత అహంకారపూరిత, దోపిడీ పార్టీగా తయారైంది. గ్రామీణ ప్రాంతాల్లో దళితులపై జరిగే అత్యాచారాలను రూపుమాపేందుకు దళిత్‌ పాంథర్స్‌ చిత్తశుద్ధితో కృషిచేసింది. తమను కాపాడేందుకు ఒక సంస్థ, ఒక బృందం వున్నాయన్న స్పృహను అది దళితులలో పెంపొందిచగలిగింది. ఇప్పటికీ గ్రామాల్లో దళితుల మీద అత్యాచారాలు జరిగినప్పుడు జనం దళిత్‌ పాంథర్స్‌ వంటి ఉద్యమ సంస్థ వుంటే ఎంత బాగుండేదో అని తలచుకోవడం కనిపిస్తుంది.

దీనినిబట్టి దళిత్‌ పాంథర్స్‌కు దళిత ప్రజల్లో ఎంత గుర్తింపు, అభిమానం వున్నాయో అర్థం చేసుకోవచ్చు. దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమం మహరాష్ట్ర నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నప్పుడు కూడా అది ఏనాడూ పలచబడలేదు. సామాజిక శాస్త్రవేత్తలు దళిత్‌ పాంథర్స్‌ ప్రాముఖ్యతను గుర్తించారు. ఇంకా ఈనాటికీ దేశ విదేశాల్లో దళిత్‌ పాంథర్ల చరిత్రను విశ్లేషించడం జరుగుతూనే వుంది. దళిత్‌ పాంథర్ల చరిత్రను చదివి పరిశోధకులు, విద్యార్థులు ఎంతగానో ఉత్తేజం పొందుతుంటారు. దళిత్‌ పాంథర్ల మిలిటెంట్‌ క్రియాశీలతను ఇవాళ తిరిగి పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.

-జే.వీ. పవార్


Monday, July 8, 2019

వామపక్ష పార్టీలు నేటి పరిస్థితులకు అనుగుణంగా తమ పని విధానాన్ని మార్చుకోవాలి - మల్లు స్వరాజ్యం

" వామపక్ష పార్టీలు నేటి పరిస్థితులకు అనుగుణంగా  
తమ పని విధానాన్ని మార్చుకోవాలి  ! "
 ..................................................................- మల్లు స్వరాజ్యం 

నిన్న(7-7-2019) హైదరాబాద్ లో జరిగిన 
మల్లు స్వరాజ్యం ఆత్మకథ "నా గొంతే తుపాకి తూటా" 
ఆవిష్కరణ సభ పై ఆంధ్ర జ్యోతి వార్తా కధనం :

ఇక్కడ క్లిక్ చేయండి :

ఆంధ్ర జ్యోతి 8-7-2019





ఇవాళ్టి ఈనాడు లో వచ్చిన వార్త










Saturday, July 6, 2019

తెలంగాణా ఝాన్సీ రాణి


ఆదర్శ ప్రాయమైన ఉద్యమ జీవితం, రాజకీయ జీవితం ఎలా ఉండాలో తెలుసుకోడానికి మల్లు స్వరాజ్యం జీవన గమనాన్ని గమనిస్తే చాలు!
ఆమె జీవితం గురించీ, ఆమె జీవన కృషి గురించీ పంచుకోవడం కోసం ఎన్ఎఫ్ ఐడబ్ల్యూ , పి ఓ డబ్ల్యూ, ఐద్వా, దళిత స్త్రీ విముక్తి సంఘటన తదితర పలు సంఘాలు , సంస్థలు ఆదివారం (7-7-2019) ఉదయం 10 -30 కి సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో నిర్వహిస్తున్న కార్యక్రమం లో మల్లు స్వరాజ్యం ఆత్మకథ "నా మాటే తుపాకి తూటా" ఆవిష్కరణ సభ జరగనుంది.
ఆ పుస్తకం లోనుంచి కొన్ని భాగాలు '
ఈరోజు ఆంద్ర జ్యోతి నవ్య పేజీలో

ఇక్కడ క్లిక్ చేయండి :

Telangana Jhansi Rani







Wednesday, July 3, 2019

"నా మాటే తుపాకీ తూటా" కామ్రేడ్ మల్లు స్వరాజ్యం ఆత్మకథ \ పుస్తకావిష్కరణ సభ,

"నా మాటే తుపాకీ తూటా" కామ్రేడ్ మల్లు స్వరాజ్యం ఆత్మకథ \
పుస్తకావిష్కరణ సభ, సమీక్ష, చర్చ ఇష్టాగోష్టి ... 
వచ్చే ఆదివారం జూలై 7 ఉదయం 10 -30 కి సుందరయ్య విజ్ఞాన కేంద్రం, 
బాగ్ లింగంపల్లి 3 వ అంతస్తులోని కాట్రగడ్డ హాల్ లో 


Saturday, June 29, 2019

బొజ్జా తారకం నీలిజెండా వ్యాసాలు

బొజ్జా తారకం నీలిజెండా వ్యాసాలు

అరవై ఏళ్ళలో దళిత సామాజిక ప్రగతి

          ఒకప్పుడు అరవై ఏళ్ళంటే అది నిండు జీవితం. ఒక మనిషి అరవై ఏళ్ళు బ్రతికాడంటే అది గొప్ప. ఒక అదృష్టం. అందుకే దానిని డబ్బున్నవాళ్ళు పండగ చేసుకొనేవారు. ఒక జాతి జీవితంలో అరవై ఏళ్ళు ఏమంత కాం కాదు. అందులోనూ అన్నీ అందుతున్న జాతికి అరవై ఏళ్ళు నిజంగానే పెద్దకాం కాదు. కాని ఏమీ అందని జాతికి, ఏ వికాసానికీ నోచుకోని జాతికి, ఏ అవకాశాలూ లేని జాతికి, ఏ ఆధారాలు, వనయీ లేని జాతికి, విద్య ఉపాధి ఐశ్వర్యం అందని జాతికి వీటన్నిటికోసం ఎదురుచూస్తున్న జాతికిమాత్రం అరవై ఏళ్ళు పెద్ద సమయమే! తినటానికి తిండి, ఉండటానికి గుడిసె లేని జాతికి అరవై ఏళ్ళుగా ఎదురు చూడటం దుర్భర సమయమే!
          స్వతంత్రం వచ్చి అరవై ఏళ్ళు అవుతున్నది కాబట్టి ఆ పరిమితిలో దళిత సామాజిక ప్రగతి ఎంతవరకూ వెళ్ళిందో చూడానుకుంటున్నారు. అరవై ఏళ్ళ స్వతంత్రంలో ఏమంత చెప్పుకోలేని భాగస్వామ్యం ఉన్న దళితు ప్రగతి గురించి మాట్లాడుకోవటం కొంత బాధాకరమే! అయితే ఈ బాధ వెనుక జరుగుతున్న మార్పు కనబడటం లేదని కాదు. సాగుతున్న జీవన ప్రవాహంలో మార్పు సహజమే! మార్పు కూడా స్వహస్తాతో తెచ్చుకున్నదా లేక ఎవరో తెచ్చి ఇస్తున్నదా! అనే దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. కబీర్‌ అన్నట్టు ‘‘అడగకుండా వచ్చేది నీళ్ళ వంటిది, అడిగితే వచ్చేది పా వంటిది, కొట్లాడి తెచ్చుకొనేది రక్తం వంటిది’’. అరవై ఏళ్ళ దళిత సామాజిక ప్రగతి నీళ్ళ వంటిదా, పా వంటిదా లేక రక్తం వంటిదా చూద్దాం!
           మనిషి పెరుగుద కోరుకుంటాడు, మానవ సమాజం వికాసం కేసి పయనిస్తుంది, దేశం అభివృద్ధికోసం అడుగు వేస్తుంది. ఈ ప్రయత్నంలో దేశానికి గాని, సమాజానికిగాని, మనిషికిగాని కొన్ని శక్తు సహకరిస్తాయి, కొన్ని అడ్డుకుంటాయి, కొన్ని నిరాకరిస్తాయి. ఈ శక్తు కొన్ని అంతర్గతంగా ఉంటాయి, కొన్ని బాహ్యంగా ఉంటాయి. మానవ ప్రయత్నాు, ఈ అంతర్భాహ్య శక్తు పరస్పరం సంఘర్షించుకుంటాయి. ఆ సంఘర్షణలో నుంచి వస్తున్నదే పెరుగుద, అభివృద్ధి, ప్రగతి మీరేదైనా అనండి! ఈ నేపథ్యంలో దళిత సామాజిక ప్రగతిని విశ్లేషించాలి.


బొజ్జా తారకం నీలిజెండా వ్యాసాలు
440 పేజీలు, వెల: రూ.250/-

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ , బొజ్జా తారకం ట్రస్ట్
 ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
 ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌