Tuesday, November 22, 2011

"వీరనారి ఝాన్సీ ఝల్కారీ బాయి" సౌదా అరుణ వ్యాసం


...
మన దేశం లో అగ్ర కుల రచయితలూ, చరిత్ర కారులూ రాజుల మెప్పుకోసం పాకులాడారే తప్ప ప్రజా జీవితాన్నీ, ప్రజా చరిత్రనూ వాస్తవిక రీతిలో చిత్రించేందుకు ఎన్నడూ ప్రయత్నించలేదు. దళిత వీరుల వీరనారీమనుల వైపు కన్నెత్తి చూసిన పాపాన కూడా పోలేదు. అందుకే బుందేల్ ఖండ్ (ఉత్తర ప్రదేశ్ కు ) చెందిన దళిత వీరనారి ఝాన్సీ ఝల్కారీ బాయి (1830 -1890 ) సాహస గాధ చరిత్ర పుటలకెక్కకుండా పోయింది.

దళిత అంశాలపై హిందీలో విస్తృతంగా రచనలు చేస్తున్న మోహన్ దాస్ నైమిష్ రాయ్ ఇటీవల ఎంతో పరిశోధించి ఆమె జీవిత చరిత్రను గ్రంధస్తం చేసారు. డా. జీ. వీ. రత్నాకర్ అనువదించిన పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ "వీరనారి ఝాన్సీ ఝల్కారీ బాయి" పేరిట ప్రచురించిన విషయం విదితమే.

ఈ పుస్తకం తెలుగు పాఠకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. మరుగునపడ్డ ఝల్కారీ బాయి జీవిత చరిత్ర పై దేశ వ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోంది.

ఈ క్రమంలో " సమాంతర వాయిస్ " మాస పత్రిక నవంబర్ 2011 సంచికలో సౌదా అరుణ గారు ఒక వ్యాసం రాసారు.
సమాంతర సౌజన్యంతో ఆ వ్యాసం పీ డీ ఎఫ్ ఫైలు రూపం లో ఇక్కడ పొందు పరుస్తున్నాము.
దిగువ టైటిల్ పై క్లిక్ చేయండి.
:

సమాంతర పత్రిక కోసం ఈ కింది చిరునామాలో సంప్రదించవచ్చు :
Samaantara Voice, 11-6-868/10, First Floor, Lakdikapool, Hyderabad - 500004
Phone: 040 23303397

వీరనారి ఝాన్సీ ఝల్‌కారీ బాయి
రచన: మోహన్‌ దాస్‌ నైమిశ్‌ రాయ్‌

తెలుగు: డా. జి.వి. రత్నాకర్‌

బొమ్మలు: పైడిరాజు
24 పేజీలు, వెల: రూ.30/-

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500067
ఫోన్‌ నెం. 040 2352 1849

ఇమెయిల్‌: hyderabadbooktrust@gmail.com

..


Monday, November 21, 2011

టి.ఎన్‌.సదాలక్ష్మి జీవిత చరిత్ర - - కె.పి.అశోక్‌ కుమార్‌



...
ప్రజాసేవ కోసం రంగంలోకి దిగిన నాయకులంతా పదవులు దక్కగానే ప్రజలను మరిచిపోవడం మామూలే. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు, ఉన్నట్టుండి ఆస్తులు, అంతస్తులు పెరుగుతాయి. నెల తిరిగేసరికి బంజారాహిల్స్‌కు వెళ్లిపోవడం చూస్తూనే వున్నాం. పదవులు చేపట్టగానే తమ కులం నుండి, తమ సమాజం నుండి దూరమవుతారు. కాని సదాలక్ష్మి జీవితం ఇందుకు పూర్తిగా భిన్నమైంది.

ఆమె ఎమ్మెల్యే నుండి డిప్యూటీ స్పీకర్‌ స్థాయికి వచ్చినా, రాజకీయాల్లో వున్నా లేకపోయినా, ఎప్పుడూ ప్రజా సమస్యల వైపు, దళితుల అభివృద్ధి వైపే దృష్టి సారించేవారు. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న అరుదైన వ్యక్తిత్వం సదాలక్ష్మిది. నిబద్ధత కలిగి అనేక అస్తిత్వాలకు, వివిధ తరాలకు చెందిన ప్రజానీకాన్ని తన వెంట నడిపించుకున్న రాజకీయ నాయకురాలు ఆమె. అవినీతికి దూరంగా నిస్వార్థంగా, నిజాయితీగా, నిరాడంబరంగా జీవించిన సదాలక్ష్మి జీవితం నేటి యువతరానికి ఆదర్శప్రాయం.

విషయసేకరణ వేరు, దాన్ని విశ్లేషించుకుని, నింగడించుకుని సరిగ్గా ప్రజెంట్‌ చేయడం వేరని రచయిత్రి గుర్తించలేకపోయారని తెలుస్తుంది. పుస్తకం నిండా బోలెడంత రిపిటేషన్‌, అనవసర, అసందర్భ వ్యాఖ్యానాలు కోకొల్లలు. పదే పదే సదాలక్ష్మి కులాన్ని పనిగట్టుకుని తెలియజేయడం చిరాకనిపిస్తుంది. తెలంగాణ చరిత్ర, భాష, సమానత్వంల గురించిన అధ్యాయాలు అనవసరం. ఇది పుస్తకం నిడివిని పెంచడానికే తప్ప సదాలక్ష్మి జీవిత చరిత్రను, ఆమె గొప్పదనాన్ని తెలియజేయడానికి

ఏమాత్రం ఉపకరించవు. సరిగ్గా ఎడిట్‌ చేసి ఈ పుస్తకాన్ని సగానికి కుదించి, పాఠకునికి తక్కువ ధరకు మరింత ఆసక్తికరంగా వుండేట్టు అంజేసే అవకాశాన్ని ప్రచురణకర్తలు ఎందుకు పట్టించుకోలేదో అర్థం కాదు.

- కె.పి.అశోక్‌ కుమార్‌
(వార్త, ఆదివారం 20 నవంబర్‌ 2011 సౌజన్యంతో)

నేనే బలాన్ని - టి.ఎన్‌. సదాలక్ష్మి బతుకు కథ
రచన: గోగు శ్యామల
పేజీలు: 338, వెల: రూ.180/-

ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడి మల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌ నెం. 040 2352 1849
ఇ మెయిల్‌: hyderabadbooktrust@gmail.com

Saturday, November 19, 2011

Hyderabad Book Trust Catalog

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన పుస్తకాల జాబితా కోసం దిగువ కేటలాగ్ పై క్లిక్ చేయండి.
పునర్ముద్రణ పొందినప్పుడు వాటి ధరల్లో స్వల్పంగా మార్పు ఉంటుందని గమనించ గలరు.


ఇటీవల ప్రచురించిన (2010 -2011 ) మరికొన్ని పుస్తకాల వివరాలు :




....


Tuesday, November 15, 2011

కంచ ఐలయ్య 'నేను హిందువునెట్లయిత?' ఏడో ముద్రణ !



...

కంచ ఐలయ్య 'వై ఐ యామ్‌ నాట్‌ ఎ హిందూ' (Why I Am Not A Hindu?, Published by Samya, Kolkata) యావత్‌ భారత దేశంలో గొప్ప సంచలనం సృష్టించిన అద్భుత గ్రంథం. ఆంగ్లంలో తొలి ముద్రణ పొందిన 1996లోనేనాన్‌ ఫిక్షన్‌ విభాగంలో బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచింది. చాలా దేశాలలోని విశ్వవిద్యాలయాలలో పాఠ్య గ్రంథంగా ఎంపికయింది.

2000 సంవత్సరం ది పయనీర్‌ పత్రిక ఈ పుస్తకాన్ని ఈ సహస్రాబ్దపు ఐదు గొప్ప పుస్తకాల్లో ఒకటని ప్రకటించింది. (మిగతా నాలుగు పుస్తకాలు: బి.ఆర్‌.అంబేడ్కర్‌ ''కుల నిర్మూలన''; నామ్‌ దేవ్‌ దసాల్‌ ''గోల్‌ పిథా''; గుర్రం జాషువా ''గబ్బిలం''; ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ ''అన్‌టచబుల్‌'').

2000 సంవత్సరంలోనే హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ఈ పుస్తకాన్ని ''నేను హిందువునెట్లయిత?'' పేరిట తెలుగులో వెలువరించింది. ప్రచురించిన కొద్ది మాసాల్లోనే ప్రతులన్నీ అమ్ముడుపోయాయి. తెలుగునాట కూడా ఈ పుస్తకంపై విస్తృతమైన చర్చ జరిగింది. జరుగుతోంది. గత పదేళ్లలో ఈ పుస్తకం ఆరు ముద్రణలు పొందింది.

ఇప్పుడు
'నేను హిందువునెట్లయిత?' ఏడో ముద్రణ - మరో కొత్త అధ్యాయంతో, ఆకర్షణీయమైన సరికొత్త ముఖచిత్రంతో వెలువడింది.

తప్పక చదవండి... చదివించండి... చదివి, చదివించి చర్చించండి...!


నేను హిందువు నెట్లయిత?
హిందూ తత్వం, సంస్కృతి, రాజకీయ అర్థశాస్త్రంపై సూద్ర విమర్శ
కంచ ఐలయ్య
188 పేజీలు, వెల: రూ.80

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌

ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,

గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌-500 067

ఫోన్‌: 040-23521849
ఇమెయిల్‌ : hyderabadbooktrust@gmail.com


..



Wednesday, November 9, 2011

Ear to the Ground: Writings on Class and Caste by K. BALAGOPAL


...

As a human rights worker active since 1981, and slightly older than Balagopal, I remember him as a magical figure. The writings in this volume help interpret the often chaotic developments in Andhra Pradesh, and provide a model tool for understanding other regional realities of India.’

BINAYAK SEN

Balagopal’s writings, from the early 1980s till he died in 2009, offer us a rare insight into the making of modern India. Civil rights work provided Balagopal the cause and context to engage with history, the public sphere and political change. He wrote through nearly three tumultuous decades: on encounter deaths; struggles of agricultural labourers; the shifting dynamics of class and caste in the 1980s and thereafter in Andhra Pradesh; the venality and tyranny of the Indian state; on the importance of re-figuring the caste order as one that denied the right of civil existence to vast numbers of its constituents; the centrality one ought to grant patriarchy in considerations of social injustice; the destructive logic of development that emerged in the India of the 1990s, dishonouring its citizens’ right to life, liberty and livelihood. This volume comprises essays—largely drawn from Economic & Political Weekly to which he was a regular contributor—that deal with representations and practices of class power as they exist in tandem with state authority and caste identities.

Inspired by naxalism in the late 1970s, intellectually indebted to D.D. Kosambi’s writings on Indian history and society, and politically and ethically attentive to the politics of feminist and dalit assertion in the 1990s, Balagopal refused dogma and shrill polemics just as he refused theory that did not heed the mess of history and practice.

Balagopal was too self-effacing to put together his writings into a volume. But it is through his writings that his legacy lives on, giving us a roadmap for future struggles.

Excerpt:

‘There is perhaps no issue on which we are such hypocrites as caste; nor any other which brings out all that is worst in us with such shameful ease. The moment V.P. Singh announces the decision to implement the Mandal Commission recommendations… an avalanche of obscenity hits the country. Caste will undoubtedly be the last of the iniquitous institutions to die out in this country. It will outlast everything else.’

Economic & Political Weekly, 6 October 1990

About the Author:

Kandala Balagopal (1952–2009) did not start out as a writer or commentator on contemporary politics. Like that other great modern Indian thinker, D.D. Kosambi, whom he read avidly, admired and wrote about, his training was in mathematics, a subject he taught at Kakatiya University, Warangal, from 1981 to 1985. The political culture of Warangal—home to the naxalite left and resonant with debates around questions of class, justice and revolution—proved decisive in Balagopal turning away from an introspective life of the mind. Instead, he came to train his acute intellect to identify, comprehend and critically examine key political and social concerns. He joined the Andhra Pradesh Civil Liberties Committee in 1981, and became active in civil rights work centred at that time around extra-judicial killings of militant left cadres. Arrested under TADA in 1985 on trumped-up charges relating to the murder of a police sub-inspector, he spent three months in Warangal prison. In 1989, Balagopal was kidnapped by a vigilante group called ‘Praja Bandhu’—believed to be a front of the police, and in 1992 was beaten up badly by the police in Kothagudem.

Balagopal trained to be a lawyer late in his life and enrolled in the Bar Council of Andhra Pradesh in 1998, representing a wide variety of litigants whose lives, lands, status and employment were threatened. In fellow-traveller K.G. Kannabiran’s words, ‘Balagopal showed himself as the only lawyer of the poor of his generation with a reputation for competence.’ Owing to differences of opinion on the use of violence by naxalites, Balagopal left APCLC in 1998. He was one of the founder-members of Human Rights Forum in which he was active till his death.

Ear to the Ground: Writings on Class and Caste

K. Balagopal

Paperback | 488 pages
6 x 9.25 inches (royal octavo) with gatefold cover | Rs 550


For Copies:

Hyderabad Book Trust

Plot No. 85, Balaji Nagar, GudiMalkaPur, HYDERABAD - 500 067

Phone: 040 2352 1849

Email: hyderabadbooktrust@gmail.com



...


Tuesday, November 8, 2011

ధైర్యే సాహసే ‘సదాలక్ష్మీ’ - అబ్బూరి ఛాయాదేవి - (భూమిక November 2011)

ధైర్యే సాహసే "సదా లక్ష్మీ"


మన రాష్ట్రరాజకీయాల్లో తనదైన ముద్రవేసిన శ్రీమతి టి.ఎన్‌.సదాలక్ష్మి గురించి శ్రీమతి గోగు శ్యామల రాసిన సదాలక్ష్మి గారి మొట్టమొదటి జీవితచరిత్ర.


సదాలక్ష్మి గారి ఆఖరి దశలో ఆమెని ఇంటర్వ్యూ చేసి ఆమె ఆత్మచరిత్రని ఆధారంగా చేసుకుని, ‘నేనే బలాన్నిఅన్న శీర్షికతో, పరిశోధనాత్మకంగా సదాలక్ష్మిగారి సన్నిహిత బంధువుల్నీ, మిత్రుల్నీ, సమకాలీన రాజకీయ నాయకుల్నీ, ఉద్యమాలలో పాల్గొన్న ప్రముఖుల్నీ ఇంటర్వ్యూ చేసి ఆమె జీవితచరిత్రని అన్వేషిసంస్థ ఆధ్వర్యంలో రాయగా, హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టు వారు ఆకర్షణీయమైన ముఖచిత్రంతో ప్రచురించిన అపూర్వగ్రంథం ఇది.


ప్రధానంగా ఇంటర్వ్యూల మీద ఆధారపడిన గ్రంథం కాబట్టి, ఇందులో కాలక్రమానుసారంగా సదాలక్ష్మి జీవితాన్ని చిత్రించడంలో కొంత ముందు వెనకలయి నప్పటికీ, ప్రతి అధ్యాయం ఆసక్తికరమైన వివరాలను అందించింది.


ఆమెకు ఎవ్వరంటే భయం లేదు. స్వయంగ నేను చూసాను. అందరు మినిస్టర్లు వచ్చేవాల్లు. నేను ఆమె వెనుకనే వుండేవాన్ని. తను ఎవ్వర్నీ సర్‌అన్నదిగానీ, తలవంచి మాట్లాడిందిగానీ లేదు. సంజీవరెడ్డితో, పి.వి.నరసింహరావుతో, బ్రహ్మానందరెడ్డితో మాట్లాడినాఆమె ఎప్పుడూ గూడా వాళ్ళతో సమానంగా మాట్లాడింది. ఏదో వాల్లకంటే కిందికి తగ్గాలనే మాట ఆమెకు లేకుండె. అంత నిర్భయత్వంల ఆమె వుండేదిఅని సదాలక్ష్మి గారి గురించి ఆమె భర్త టి.వి.నారాయణగారే అన్న మాటలబట్టి సదాలక్ష్మిగారి వ్యక్తిత్వం తెలుస్తుంది.


నేనే బలాన్నిఅనడంలోనే సదాలక్ష్మిగారి ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటమవుతుంది. సదాలక్ష్మికి చిన్నప్పుడు ట్యూషన్‌ మాస్టర్‌ చెప్పేదిట - రాదు అనే మాటను మన లిస్టులో నుంచి తీసెయ్యాలఅని. ఎవరు ఏ పనిచేస్తే, ఎవరు ఏ పని మీద ధ్యాసపెడితే ఆ పనిలో ప్రావీణ్యత ఒచ్చేస్తది. ఏ పనైన మనం చేస్తూ పోవాలి. మేము చెయ్యమూ అనొద్దునన్నడిగితె నాకు రాదూ అని ఎవరైన అంటే అట్లనొద్దు! దేన్నిగూడ రాదని చెప్పొద్దు. గమ్మున వూర్కోవాలె, చేస్తున్నది చూడాలె. అది నేర్చుకోవాలె అని చెప్పుత. నేను అట్లనే చేస్తఅన్న సదాలక్ష్మిగారి ఉద్ఘాటన అన్ని తరాలవారూ అనుసరించవలసిన మార్గదర్శకసూత్రం.
నిండ మన్సుబెట్టకుండ నా జీవితంల నేనేదీ చెయ్యను. చిన్నదానికి పెద్దదానికి మన్సుబెట్టాల్సిందే. ఇది దినచర్యలాగ అలవాటైయింది నాకు. ఆ విధంగా మా నాయినే అన్నీ చెప్పేదిఅని చెప్పిన విశేషమే సదాలక్ష్మిగారి విజయరహస్యం.


హిందూసమాజంలోని అట్టడుగు కులాలన్నింటిలోకీ అడుగున ఉండే మాదిగ ఉపకులమైన, మరుగుదొడ్లు సాఫు జేసే మెహతర్‌వృత్తికులంలో పుట్టి, ఏటికి ఎదురీదుతూ మంత్రివర్గ సభ్యురాలిగా,” ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రిగా తన సత్తా నిరూపించుకుని, ”డిప్యూటీ స్పీకర్‌ స్థాయికి చేరుకున్న సదాలక్ష్మి జీవితాంతం కాంగ్రెస్‌, తెలుగుదేశం వంటి అధికారపార్టీ రాజకీయాల్లో కీలకంగా ఉంటూ,” దళిత, తెలంగాణా మొదలైన ఉద్యమాలలో నాయకురాలిగా తనదైన ముద్రవేసిన తెలుగు మహిళ.


సదాలక్ష్మి 1928 వ సంవత్సరంలో డిసెంబర్‌ 25న పుట్టింది. అగ్రవర్ణ స్త్రీలలోనే చదువు అంతగా లేని పరిస్థితిలో తల్లిదండ్రుల ప్రోద్బలంతో 1939లో వీరి వంశంలోనే తొలి తరంగా పాఠశాలలోకి, ప్రాథమిక విద్యలోకి ప్రవేశించింది,” ముందుగా బొల్లారంలో ప్రైవేటు పాఠశాలలోనూ, పై తరగతులు కీస్‌ హైస్కూల్లోనూ చదివింది. ఇంటర్‌మీడియట్‌ కోసం నిజాం కాలేజిలో చేరి, నాలుగు నెలలపాటు చదివింది. రజాకార్లను ఎదుర్కొనేందుకు ఆమె ఎంత ధైర్యంగా ఉండేదంటే, నిజాం కాలేజికి వచ్చినప్పుడల్లా ఎప్పుడూ ఒక కత్తి దగ్గర పెట్టుకొని ఉండేదిఅని సదాలక్ష్మిగారి భర్త గుర్తు చేసుకున్నారు. అది కో-ఎడ్యుకేషన్‌ కాలేజి అని ఆమె పెద్దన్న కాలేజి మాన్పించాడు. ఎక్కడన్నా ఆడపిల్లల కాలేజి ఉంటే అక్కడ చదివిస్తానని తల్లి ప్రోత్సహించిందిట. మద్రాసులోని క్వీన్‌ మేరీస్‌ విమెన్స్‌ కాలేజిలో యఫ్‌.ఏ. (ఫస్ట్‌ ఆర్ట్స్‌ కోర్సు)లో చేరింది.


అంతకుముందు పదవ తరగతి చదువుతూండగానే 1947లో తను ఇష్టపడిన టి.వి.నారాయణని పెళ్ళి చేసుకుంది. వాళ్ళది ఇంటర్‌కాస్ట్‌ మ్యారేజి”. ఆమెది మాదిగ సబ్‌కాస్ట్‌ పాకీ వృత్తి. ఆయనది చెప్పులు కుట్టే వృత్తి. ఆ కాస్త తేడాలోనే నరకం చూశానుఅని చెప్పారు సదాలక్ష్మి, గోగు శ్యామలకి ఇచ్చిన ఇంటర్వ్యూలో. సదాలక్ష్మిగారు రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఆమెని అత్త కొట్టేదిట. భర్త ఏమీ చెయ్యలేకపోయేవాడుట. నా మ్యారేజి లైఫ్‌ చాలా ఘోరమైన లైఫ్‌. ఇప్పటికీ ఎదురీదుతున్నాను…” అని ఆమె ఆఖరి రోజుల్లో కూడా చెప్పుకున్నారు.


మద్రాసుకీ హైదరాబాదుకీ మధ్య తిరగడంతో ఆమె చదువు సరిగ్గా సాగలేదు. అదే సమయంలో లేడీస్‌ కావాలని కాంగ్రెస్‌ పార్టీనుంచి స్వయంగా పిలుపు వచ్చిందిఎందుకంటే స్కూలు చదువులనుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉండేదని.


మొదటిసారి పార్లమెంటుకి ఎన్నికలలో కమ్యూనిస్ట్‌ పార్టీవల్ల ఓడిపోయినప్పటికీ, ”ఆమె జీవితంలో ఒక నూతన దశ మొదలయింది. తరవాత ఎం.ఎల్‌.ఎ.గా గెలిచింది.ఇక ఆమె స్వయం నిర్ణయాలుతీసుకోవడం మొదలుపెట్టింది. ఆమె ఇష్టంతో చేసిన మరొక పని వ్యవసాయం. ధైర్యం సాహసం వుంటే తమకు తాము రక్షించుకుంటారు. ఇంక కొంతమందిని రక్షిస్తారుఅంటూ, ఒకసారి పెద్దపులిని ఎలా ఎదుర్కొందో చెప్పారు సదాలక్ష్మి. ఆనాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌తో, ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూతో, రాష్ట్రంలో బ్రహ్మానంద రెడ్డితో, సంజీవరెడ్డితో, చెన్నారెడ్డి మొదలైన వారితో ఎలా వ్యవహరించారో సదాలక్ష్మి జీవితచరిత్ర చదివితే తెలుస్తుంది.


రకరకాల ఆధిపత్యాలు, పెత్తనాలు రాజ్యమేలుతుండే పార్టీల్లోనూ, సమాజంలోనూ మనుగడ సాగిస్తూ, అట్టడుగు కుల, తెగ, జండరు, ప్రాంత అంశాలపై పనిచేస్తున్నప్పుడు ఎదురయ్యే అడ్డంకులను, అనుభవాలను అర్థం చేసుకోవాలంటే సదాలక్ష్మి జీవితాన్ని చదవాల్సిందేఅని ఈ గ్రంథ రచయిత్రి గోగు శ్యామల అన్నది అక్షరాల నిజం. ఇది అందరూ చదవాల్సిన పుస్తకం.


- అబ్బూరి ఛాయాదేవి

భూమిక నవంబర్ 2011 సౌజన్యంతో

http://bhumika.org/archives/1997


...

Monday, November 7, 2011

చారిత్రక ప్రేమకావ్యం


...
సరిగ్గా 33 ఏళ్ల్ల క్రితం (నవంబర్‌, 1978) 'గాన్‌ విత్‌ ద విండ్‌' నవలని మాలతీ చందూర్‌ (స్వాతి మాసపత్రికలో) పరిచయం చేసినప్పుడు పాఠకులంతా అబ్బురపడి,

'ఇంత గొప్ప నవలని ఎవరైనా తెలుగులోకి పూర్తిగా తీసుకొస్తే బాగుండేది కదా' అని మధనపడ్డారు.

వాళ్ల బాధని అర్థం చేసుకున్నట్టుగా మూడు దశాబ్దాల తర్వాత పూర్తి అనువాదంతో తెలుగు పాఠకుల ముందుకు తీసుకొచ్చారు ఎం.వి.రమణారెడ్డి.

ప్రపంచ ప్రఖ్యామైన వంద నవలల్ని ఎంపిక చేస్తే అందులో తొలి పది నవలల్లో 'గాన్‌ విత్‌ ద విండ్‌' ఉంటుందన్న అనువాదకుడి మాటతో పాఠకులు పూర్తిగా ఏకీభవిస్తారు.

అయితే ఈ నవల చదవడానికి ముందు కొంత అమెరికా చరిత్ర, 1861 నుండి 1865 మధ్య కాలంలో అక్కడ జరిగిన సివిల్‌ వార్‌ గురించి తెలిసివుంటే మరింత ఆసక్తిగా చదివిస్తుంది.

యూరోపియన్లు అమెరికాను ఆక్రమించి స్థానిక 'రెడ్‌ ఇండియన్స్‌'ని తరిమేసి వందలాది ఎకరాల్ని ఆక్రమించి, పత్తి పండించే భూకామందులుగా చలామణి అయ్యారు. ఆ క్రమంలో ఆఫ్రికా ఖండం నుండి లక్షలాది నల్లజాతీయుల్ని బానిసలుగా తీసుకెళ్లి వారితో ఊడిగం చేయించుకున్న చరిత్ర ప్రపంచానికి తెలిసిందే.

బానిసత్వ నిర్మూలన పోరాటాల నేపథ్యంలో అప్పటి అమెరికన్‌ ప్రెసిడెంట్‌ అబ్రహాం లింకన్‌ నీగ్రోలకి పూర్తి స్వేచ్ఛనివ్వడం అమెరికా దక్షిణాది రాష్ట్రాలకు నచ్చలేదు.

అవి యునైటెడ్‌ స్టేట్స్‌తో విడిపోయి 'కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ స్టేట్స్‌'గా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ తిరుగుబాటుని అణిచివేసి, దేశాన్ని ఏకతాటిపై తెచ్చే ప్రయత్నంలో సాగిందే అమెరికా అంతర్యుద్ధం.

1900 సంవత్సరంలో పుట్టిన 'మార్గరెట్‌ మిచ్చెల్‌' తన 25-35 ఏళ్ల మధ్యకాలంలో ఈ నవల రాశారు. 65 ఏళ్ల క్రితం జరిగిన అంతర్యుద్ధ చరిత్రని శోధించి, మధించి ఒక అద్భుతమైన ప్రేమ కావ్యంగా మలిచారు.

ఈ నవలలో ప్రధాన పాత్ర స్కార్లెట్‌. తను అనుకున్నది సాధించే అసమాన స్త్రీగా స్కార్లెట్‌ పాత్రని మలిచిన తీరు పాఠకుల్ని అడుగడుక్కీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. స్వార్థం మూర్తీభవించిన స్కార్లెట్‌కి సమాన స్థాయిలో సృష్టించిన మరో పాత్ర 'రెట్‌ బట్లర్‌'. ఈ రెండు పాత్రలు ఒకే జాతి పక్షులు. వాళ్ల సుఖం కోసం ఎదుటివారు ఏమైపోయినా పర్వాలేదనుకునే మనస్తత్వం వీరిది. వీరిద్దర్నీ ఇష్టపడకుండానూ, ఏవగించుకోకుండానూ ఉండలేరు పాఠకులు.
మొదట్నుంచి 'యాష్లీ' ప్రేమ కోసం పరితపించిన స్కార్లెట్‌, అతని ప్రేమ అందకపోవడం లోంచి పుట్టిన కసితో ఛార్లెస్‌, కెనడి, రెట్‌ బట్లర్‌లను ఒకరి తర్వాత ఒకర్ని పెళ్లాడి ... ఎవరికీ స్వంతం కాలేక చివరికి ఒంటరిగా మిగిలిపోతుంది. 'నిజానికి యాష్లీ అర్థమయ్యి ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని ప్రేమించేది కాదని, రెట్‌ బట్లర్‌ అర్థమై ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని వదులుకునేది కాదనే' స్కార్లెట్‌ అంతర్మథనంతో నవల ముగించడం గొప్పగా అన్పిస్తుంది.

'గాన్‌ విత్‌ ద విండ్‌' నవల 1940-50 దశకాల మధ్య ఇతర ప్రపంచ రచయితల మీద కూడా గాఢమైన ప్రభావం చూపించివుండాలి. గమనిస్తే పి.శ్రీదేవి 'కాలాతీత

వ్యక్తులు' నవలలోని ఇందిర, కృష్ణమూర్తి, కళ్యాణి, ప్రకాశం పాత్రలు స్కార్లెట్‌, రెట్‌ బట్లర్‌, మెలనీ, యాష్లేల మనస్తత్వాలకు అతి దగ్గరగా అనిపిస్తాయి. అ లాగే మట్టిమనిషి (వాసిరెడ్డి సీతాదేవి) వరూధినిలోనూ స్కార్లెట్‌ లక్షణాలు కనిపిస్తాయి.

'గాన్‌ విత్‌ ద విండ్‌' నవల 1939లో సినిమాగా విడుదలై పది ఆస్కార్‌ అవార్డులు సాధించడం గమనార్హం. ముఖ్యంగా స్కార్లెట్‌ పాత్రతో ఆస్కార్‌ స్వంతం చేసుకున్న నటి వివియన్‌ లీహ్‌ ఇండియాలోని డార్జీలింగ్‌లో పుట్టి ఊటీలో బాల్యం
గడపడం ఆసక్తి కలిగించే విషయం.

నవల సాంతం ఏకబిగిన చదివించే చక్కటి అనువాదం చేసిన రమణారెడ్డి ఇంత గొప్ప నవల రాసిన మూల
రచయిత్రి 'మార్గరెట్‌ మిచ్చెల్‌' పేరుని ముఖచిత్రంపై వేయకపోవడం, ఆమె ఛాయాచిత్రం పుస్తకంలో ఎక్కడా ప్రచురించకపోవడం పాఠకుల మనసును చివుక్కు మనిపిస్తుంది.

- గొరుసు
(ఆదివారం ఆంధ్రజ్యోతి 6-11-2011 సౌజన్యంతో)

చివరకు మిగిలింది?
మూలం : మార్గరెట్‌ మిచ్చెల్‌
అనువాదం : ఎం.వి.రమణారెడ్డి,
పేజీలు : 512, వెల : రూ.200

ప్రతులకు
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌

Thursday, November 3, 2011

నిష్కల్మతను నిద్రలేపే బషీర్‌ కథలు - వాడ్రేవు చినవీరభద్రుడు


...
నా మళయాల మిత్రురాలొకామెను వైకం మహమ్మద్‌ బషీర్‌ కథలమీద సమీక్ష రాయాలి, ఏవైనా నాలుగు మాటలు చెప్పమని అడిగాను. ఆమె రెండు మాటలు చెప్పింది:

'మొదటిమాట బషీర్‌లో నాకు నచ్చేదేమిటంటే ఆయన రాసిన పుస్తకాలు చిన్న పిల్లలకు కూడా అర్థం అవుతాయి. కానీ ప్రతి వాక్యంలోనూ ఎంత దార్శనికత ఉంటుందంటే, దాన్ని పండితులు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. అ లాగని ఆ రచనలు చదివి ఆనందించడానికి ఆ దార్శనకిత తెలియాల్సిన పనిలేదు' అని.
ఆమె వెంటనే ఓ ఉదాహరణ కూడా ఇచ్చింది: ''బాల్యకాల సఖి'' కథలో ఒక చిన్నపిల్లవాడు ఒకటి ఒకటి కలిస్తే పెద్ద ఒకటి అవుతుంది అంటాడు. ఈ మాట వినగానే మనకు నవ్వొస్తుంది. రచయిత చిన్న పిల్లల మనస్తత్వాన్ని భలే పట్టుకున్నాడనిపిస్తుంది. కానీ కొద్దిగా ఆలోచిస్తే ఈ వాక్యం తాత్వికంగా చాలా లోతైన వాక్యమని అర్థమవుతుంది. ఒక నది మరొక నదితో కలిసిందనుకో, అప్పుడవి రెండు నదులు కావు కదా, పెద్ద నదిగా మారతాయంతే'' అంది.

ఆమె మాటలు వింటుంటే నాకో ఆలోచన వచ్చింది. కొందరు రచయితలు కొన్ని భాషా సాహిత్యాలకు మాత్రమే ప్రత్యేకంగా ఉంటారేమోనని. ఉదాహరణకి చలం లాంటి రచయిత మనకి భారతదేశంలో మరే సాహిత్యంలోనూ కనబడడు. గాంధీజీ లాంటి రచయిత ఒక్క గుజరాతీకి మాత్రమే ప్రత్యేకం.
ఏ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో గిరిజన తెగలు నివసిస్తుంటారో, అక్కణ్ణుంచి మాత్రమే గోపీనాథ మొహంతి లాంటి రచయిత ప్రభవిస్తాడు. అ లాగే, వైకం మహమ్మద్‌ బషీర్‌ (1908-1994) ఒక్క మళయాళ సాహిత్యానికి మాత్రమే ప్రత్యేకం, ఆ ప్రాంతానికి చెందిన మొక్కల్లాగా, పూలల్లాగా.

పరశురాముడు పైకిలేపాడని చెప్పుకునే భూభాగం మీద హిందువులు ప్రధాన స్రవంతిగా కొనసాగే సమాజంలో అ ల్పసంఖ్యాక ముస్లిం జీవితం నుండి పుట్టి పెరిగిన రచయిత - ఆయన భాషలో ఎనభై శాతానికి పైగా పదజాలం సంస్కృతం మీద ఆధారపడే మళయాళంలో ఒక గురజాడ లాగా పూర్తి మట్టి వాసన కొట్టే సాధారణ వాడుక భాషలో రచనలు చేసినవాడు. దాదాపు అర్థ శతాబ్దపు సాహిత్య కృషిలో ఆయన రాసింది మొత్తం 13 నవలలు, 13 కథా సంపుటాలు. 2,200 పేజీలకు మించని రచనా సర్వస్వం.

కానీ, ఇరవయ్యవ శతాబ్దపు భారతదేశ రచయితల్లో ఒక సుబ్రహ్మణ్య భారతి, ఒక టాగోర్‌, ఒక ప్రేమ్‌ చంద్‌, ఒక గురజాడతో సమానమైన స్థానాన్ని పొందాడు. ఎందుకని?
ఇప్పుడు హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ తెలుగులోకి అనువదింపచేసి తీసుకువచ్చిన ''బహీర్‌ కథలు'' చదివితే ఆ ప్రశ్నకు జవాబు చాలా సులభంగా దొరుకుతుంది.

బషీర్‌ కథలు ఒట్టి కథలు కావు.
అవి ఒక రకంగా ఆయన అనుభవాలు. ఆయన కుటుంబ కథలు. ఆయన పుట్టి పెరిగిన సమాజం కథలు.

ఈ సంపుటంలోని 21 కథలూ చదవడం పూర్తి చేయగానే మనమొక నిజమైన మానవుణ్ణి కలుసుకున్నట్టనిపిస్తుంది. ఆగ్రహం, దు:ఖం, జీవిత పరిమళాలతోపాటు మనకెందుకో ఒకటే నవ్వొస్తూంటుంది. ఆ నవ్వు మళ్లా ఎక్కడో తీవ్రమైన విచారంలోకి తీసుకుపోయి పడేస్తుంది మనని.

బషీర్‌ కథల్ని ఇంగ్లీషులోకి అనువదించిన అబ్దుల్లా ఒక మాట రాస్తాడు: ''మీరు ఈ కథల్ని మళ్లీ మళ్లీ చదవకుండా ఉండలేరు. ఆ కథలు చదువుతూ మీ కళ్లమ్మట నీళ్లొచ్చేంతగా నవ్వుకుంటారు. ఇంతలో మీకు తెలియకుండానే రచయిత మిమ్మల్నేడిపిస్తున్నాడనే సంగతి మీకు తడుతుంది. మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.

''పాతుమ్మా మేక'' కథనే తీసుకోండి, ఆ కథ చదువుతున్నంతసేపూ మీరు గడియారం పెండ్యులంలాగా నవ్వులకీ, కన్నీళ్లకీ మధ్య, మళ్లీ కన్నీళ్లకీ, నవ్వులకీ మధ్య ఊగుతూనే ఉంటారు.' (పూవన్‌ బనానా అండ్‌ అదర్‌ స్టోరీస్‌, ఓరియంట్‌ లాంగ్మన్‌, 2009, పే.11).

బషీర్‌ను చదువుతున్నప్పుడు, మనం మర్చిపోయిన మనలోని మానవత్వం, నిజాయితీ, నిష్కల్మషత్వం లాంటి గుణాలన్నీ నెమ్మదిగా బయటికి రావడం మొదలెడతాయి. ఆ మనిషి ఓ వరుసవేది. ఎటువంటి మనిషి కాకపోతే, వైకంలో ఇంగ్లీషు మీడియం స్కూల్లో చదువుకోమని పంపిస్తే, 16 సంవత్సరాల వయసులో వైకం సత్యాగ్రహం (1924) కోసం వచ్చిన గాంధీజీని ఒక్కసారి తాకి చూడాలని అంతగా ఉవ్విళ్లూరతాడు!

తాకి ఊరకున్నాడా? ఆ క్షణమే సమస్తం వదిలేసాడు. స్కూలుకు పోవడం కన్నా సత్యాగ్రాహ ఆశ్రమానికి పోయిరావడాన్నే ఎక్కువ ప్రేమించాడు. పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నాడు. తిరువాన్కూరు సంస్థానంలో సత్యాగ్రహం చేయాలనుకున్నాడు. జైలుకి వెళ్లాడు. జైలు నుంచి బయటికొచ్చి ఎనిమిదేళ్లపాటు హిమాలయాల నుంచి ఆఫ్రికాదాకా తిరిగిన చోటు తిరక్కుండా తిరిగాడు. చేనేతకారుడిగా, జ్యోతిష్కుడిగా, వంటమనిషిగా, కాపలాదారుగా, సేవకుడిగా, గొర్రెలు కాచుకునేవాడిగా, సూఫీ సాధువుగా, సన్యాసిగా ఆయన ఎత్తని అవతారం లేదు. చెయ్యని ఉద్యోగం లేదు. తిరిగి ఇంటికి రాగానే అరెస్టువారంటు. మళ్లీ మరొకసారి జైలు. జైలు నుంచి బయటపడేటప్పటికి, మానసిక ఉన్మాదం. ఈ సారి పిచ్చాసుపత్రికి.

తుపాను పట్టిన సముద్రంలాగా ఘూర్ణిల్లిన ఆ యవ్వన దినాలన్నీ అయిపోయాక, ఏభైయ్యోపడిలో పడ్డాక, పెళ్లి. ఇద్దరు పిల్లలు. భర్తగా, తండ్రిగా కొత్త పాత్రలు. ''బేపూర్‌ సుల్తాన్‌''గా మూడున్నర దశాబ్దాలు ప్రశాంతమైన గృహజీవితం.

నా మిత్రురాలు చెప్పిన రెండో మాట ఏమిటంటే ''బషీర్‌ రచనలు కాలంతో పాటు కొత్తగా అనిపిస్తాయి. ఆయన మొట్టమొదటి కథ ''ప్రేమ లేఖనం'' (1943) ఇప్పుడు మళ్లీ చదివితే, అందులో స్త్రీపురుష సహజీవనం గురించీ, ఎవరూ మరొకరి మీద పెత్తనం నెరపని ఆదర్శ జీవితం గురించీ, స్త్రీల సాధికారత గురించీ ఎన్నో కొత్త ఆలోచనలు కలుగుతాయి' అని.

నిజమే. ఆ కథలో ఇవి చాలా మామూలు వాక్యాలే కాని, చూడండి: ''అ లా రైలు మూడు స్టేషన్లు దాటి ఆగింది. పెట్టెలో వాళ్లిద్దరే ఉన్నారు. నాలుగో స్టేషను దగ్గర ఆగినప్పుడు కేశవన్‌ నాయర్‌ టీకోసం చూసాడు. సారమ్మ కాఫీ కావాలంది. కేశవన్‌ నాయర్‌ టీయే కావాలన్నాడు. మాటా మాటా పెరిగింది. చివరకి సారమ్మ టీ, కేశవన్‌ నాయర్‌ కాఫీ తాగారు. తెల్లారింది. రైలు ఒక వంతెన దాటుతోంది. వంతెనకింద బంగారు నది ప్రవహిస్తూంది. కాఫీ, టీ గొడవను మరిచిపోయారు వాళ్లు.''

బషీర్‌ ముస్లిం మలబారు ముస్లిం జీవితం గురించి రాసాడు. అరబిక్‌లో ఖొరాన్‌ అధ్యయనం చేసాడు. కానీ ఆయన ముస్లిం మాత్రమే కాదు, పదహారేళ్ల తొలి యవ్వనంలో యువకులు యువతుల ప్రేమకోసం పరితపించే వేళ, ఆయన గాంధీజీతో ప్రేమలో పడ్డాడు. సత్యాగ్రహం చేసాడు. జైలుకు వెళ్లాడు. కానీ కాంగ్రెస్‌ వాది కాదు. భగత్‌సింగ్‌లో తన పోలికలు చూసుకున్నాడు. భావాల్లో, భాషలో సమూల విప్లవం అనుభవించాడు. కానీ రివల్యూషనరీ కాదు. బీదరికం, ప్రేమ, తనకు కలిగినది నలుగురితో కలిసి పంచుకోవడం కోసమే జీవించాడు. దాన్నే రాసాడు. కానీ మ్యూనిస్టు కాదు. స్త్రీ పరిమళాన్ని ప్రాణప్రదంగా ఆస్వాదించాడు. కానీ పూవన్‌ బనానా కథ చదివితే, ఆడవాళ్లను ద్వేషిస్తున్నాడా అనిపిస్తుంది. ఆయన ఫెమినస్టూ కాడు. యాంటీ ఫెమినిస్టూ కాడు. పైకి విరుద్ధంగా కనిపించే ఈ అంశాలన్నిటినీ, ఈ జిగ్‌సా పజిల్‌ని జాగ్రత్తగా పేర్చుకుంటూ పోతే అత్యంత విశ్వసనీయుడైన, అత్యంత ప్రేమాస్పదుడైన ఒక మనిషి ముఖచిత్రం సాక్షాత్కరిస్తుంది. ఆయన్ని కేరళ సమాజమెలా ప్రేమించిందో మనం కూడా అ లాగే ప్రేమించడం మొదలు పెడతాం.

ఇంతకుముందే చెప్పినట్టుగా, ఆయన మనలో నిద్రపోతున్న నిష్కపట మానవుణ్ణి మేల్కొలుపుతాడు. అవును, మనం కూడా ఒకప్పుడు, మన బాల్యంలోనో, తొలియవ్వనంలోనో ఇంత నిర్మలంగా ఉండేవాళ్లం. ఇప్పుడెందుకిలా అయిపోయాం? మనకి ఏడుపొస్తుంది.

''అమ్మ కథ (అది కథ కాదు, ఆయన జీవితమే) చదవడం ముగించగానే నాకు నిజంగానే ఏడుపొచ్చేసింది.
బషీర్‌ నేను కూడా నీలా బతకాలంటే, నీలా రాయాలంటే, చెప్పు నేను ఏం కావాలి? ఏం వదులుకోవాలి?

నాలాంటివాళ్లు అసంఖ్యాకంగా ఉన్న తెలుగు సమాజం, తెలుగు సాహిత్య సమాజం తప్పనిసరిగా చదవాల్సిన కథలివి. అనువాదాలు కూడా బాగున్నాయి.

-వాడ్రేవు చినవీరభద్రుడు
( ఆదివారం ఆంద్ర జ్యోతి తేదీ 02 అక్టోబర్ 2011 సౌజన్యంతో )

పేజీలు 200, వెల: రూ.100



...

MUHAMMAD PRAVAKTHA JEEVITHAM - The Hindu Book Review


MUHAMMAD PRAVAKTHA JEEVITHAM:

Translation by P. Satyavathi;

Hyderabad Book Trust, Flat No 8J, Balaji Nagar, Gudimalkapur, Hyderabad-500067. Rs. 80.


THIS IS a translation of Karen Armstrong's Muhammad: A Biography of the Prophet, which earned for him the Muslim Public Affairs Council Media Award. Armstrong's is no mean achievement, because writing on religious heads and thinkers is no easy task; it calls for scholarship, research orientation, and an unflappable commitment to authenticity.

In her comprehensive work on the life and times of the Prophet, Armstrong brings into focus the ideological differences between the Islamic and Western worlds. The Prophet's life is one of philanthropy, compassion, and empathy. He constantly went on pilgrimage.

The renovation of Kaaba; the installation of the sacred black stone under the guidance of Muhammad; his divine vision of Gabriel on the 17 {+t} {+h} day of Ramdan and the revelations he received; and how he came to be acclaimed the messenger of Allah — all these are told in detail and in an absorbing manner.

Armstrong quotes many ‘Suras' from the Koran. The oft-quoted one among the ‘Suras' is, according to her, that which says “God does not change the condition of any people unless they themselves make a decision to change.” The translation is commendable and smooth-flowing.

- AMBIKA ANANTH


Wednesday, November 2, 2011

ఘంటారావం, అజేయుడు : ఆంధ్రజ్యోతి సమీక్ష


...
రెండూ రెండు ప్రపంచ ప్రఖ్యాత నవలలు.

ఒకటి విక్టర్‌ హ్యూగో 1831లో రాసిన "The Hunchback of Notre Dame" నవలకు తెలుగు అయిన ''ఘంటారావం''.

రెండోది ''అజేయుడు'' 1844లో అ లెగ్జాండర్‌ డ్యుమా రాసిన "The Count of Monte Cristo" నవలకు తెలుగు

అన్ని భాషల్లోకి అనువదించబడ్డ ఈ రచనల గొప్పతనం గురించి కొత్తగా చెప్పుకోవలసిన అవసరం ఎలా లేదో వీటిని తెలుగు చేసిన సూరంపూడి సీతారాం అనువాద శైలి గురించి కూడా అంతే.

కౌంట్‌ ఆఫ్‌ మాంటి క్రిస్టో నవల చాలా పెద్దది కాబట్టి ఈ కాలం పాఠకులను దృష్టిలో పెట్టుకుని కాస్త సంక్షిప్తం చేశారు హెచ్‌బీటీ వాళ్లు.

మనుషుల పేర్లూ, ప్రాంతాల పేర్లు, వ్యవస్థల పేర్లు పరాయిగా అనిపించవచ్చునేమో గాని మానవ స్వభావాల రీత్యా ఈ రెండు కాల్పనిక నవలలలోని ఇతివృత్తం మనకు సుపరిచతంగా అనిపిస్తుంది.

అన్యాయాలు, అక్రమాలు, అవహేళనలకు గురైన చాలామంది శక్తిలేక, పరిస్థితులకు తలొగ్గి చరిత్రలో కనుమరుగైపోవచ్చు. కానీ వాళ్లందరికీ ప్రతినిధిగా ఎవరో ఒకరు ఎదురుతిరిగి తమ బాధలకు ప్రతీకారం తీర్చుకుంటారు. మిగతా బాధితులందరూ వారిలో తమను తాము చూసుకుంటారు.
కనుకే అటువంటి పాత్రలకు అంత ప్రజాదరణ లభిస్తుంది. ఆ ప్రతీకారం తీర్చుకోవడంలో వారు ఉదాత్తులుగా కూడా వ్యవహరిస్తే సాహిత్యంలో వారి స్థానం సుస్థిరమవుతుంది.

ఈ ఇతివృత్తాలు సినిమా పరిభాషలో ఫార్ములా కథలుగా మారిపోయాయి నిజానికి.
కానీ అవి నిజ జీవిత ప్రతీకలే.
చాలా ఏళ్ల తర్వాత తెలుగులో లభ్యమవుతున్న ఈ పుస్తకాలను మిస్‌ కాకండి.

- వసంత
(ఆదివారం ఆంధ్రజ్యోతి సౌజన్యంతో)

ఘంటారావం, పేజీలు, 186, వెల: రూ.100
అజేయుడు, పేజీలు, 404, వెల: రూ.160
అనువాదం: సూరం పూడి సీతారాం.

For EBooks. Pl Click : KINIGE.COM


...

సత్యానికీ, మిథ్యకీ మధ్య ...



సత్యానికీ, మిథ్యకీ మధ్య ...
...
చరిత్రపుటలకు ఎక్కని చరితార్థులకు మన దేశంలో లోటు లేదు.
జనం నోళ్లలో (నిజానికి హృదయాలలో) పాటల రూపంలో, గాథల రూపంలో వారి చరిత్ర మౌఖికంగా వినిపిస్తూనే ఉంటుంది.

అ లాంటి వీరులు, వీరవనితల గురించిన కథలు మనకూ ఉన్నాయి.
ద్వారబంధాల చంద్రారెడ్డి, అ ల్లూరి సీతారామరాజు, చిన్నపరెడ్డి వంటి వారిపైనా, బీర్సా ముండా వంటి వారి చుట్టూ అనేక కట్టు కథలు చుట్టుముట్టి ఉంటాయి.
శాస్త్రీయంగా జరిగే చరిత్ర రచనలో స్థల పురాణాల పాత్ర వాస్తవాల నడుమ చెదిరిన లంకెను కూర్చడానికి మాత్రమే పరిమితం.
అంతేగానీ స్థలపురాణమే చరిత్ర కాదు.

కానీ హెచ్‌బీటీ వెలువరించిన ''వీరనారి ఝాన్సీ ఝల్‌కారీబాయి'' స్థలపురాణానికి సమీపంగానే ఉంది తప్ప, చరిత్ర లక్షణాలను పూర్తిగా సంతరించుకోలేకపోయింది.
ఝాన్సీ లక్ష్మీబాయికి సమకాలీనురాలైన ఝల్‌కారీ యుద్ధవేళ తానే రాణినని కంపెనీ సేనను ముప్పు తిప్పలు పెట్టిందని ఇందులో కనిపిస్తుంది. చిరుతను చంపడం, ఆవు దూడ ఉదంతం, కోట ఆక్రమణ వేళ కనిపించిన ప్రతి తెల్ల సైనికుడి తలను నరకడం వంటి ఘట్టాలు స్థలపురాణాల స్థాయివే తప్ప చారిత్రక వాస్తవాలు అనిపించుకోలేవు. చరిత్ర రచనలో దినుసులు కాలేవు.

ఝల్‌కారీ గురించిన ప్రస్తావన చాలా పుస్తకాలలో ఉన్నదని ఒక పక్క చెబుతూనే ఆమె చరిత్ర మరుగున పడిందని ప్రచురణకర్తలు భావించడం వింతగా ఉంది. ఝాన్సీ ప్రాంతంలో దొరుకుతున్న ఝల్‌కారీ చారిత్రక విశేషాలను సరిగా మథించకుండా ఇలాంటి పుస్తకం రాయడం వల్ల అంతటి చారిత్రక మహిళను ఈ తరానికి పరిచయం చేయాలన్న లక్ష్యం నెరవేరదు.

పుస్తక ముఖచిత్రం రమణీయంగా ఉంది. కానీ ఝల్‌కారీభాయి అంటూ అట్ట శీర్షికలో కనిపించే తప్పు మీద దృష్టి పడితే ఆ ఆనందం కూడా మిగలదు. హిందీలో మోహన్‌దాస్‌ నైమిశ్‌ రాయ్‌ రాసిన ఈ పుస్తకాన్ని డాక్టర్‌ జీ.వీ. రత్నాకర్‌ తెలుగులోకి అనువదించారు.

- కల్హణ
(సాక్షి దినపత్రిక తేది31-10-2011 సౌజన్యంతో)

Tuesday, November 1, 2011

అ లనాటి ఫ్రెంచి సమాజం





...
కొన్ని రచనలకు కాలదోషం వుండదు.
అ లెగ్జాండర్‌ ద్యుమా నూటయాభై ఏళ్లనాడు రచించన 'అజేయుడు' ఇప్పటికీ అజేయంగా పాఠకుల్ని
అ లరిస్తూనే వుంది.
కథానాయకుడి వీరోచిత వ్యక్తిత్వం హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ దాకా అనేకానేక పాత్రలకు స్ఫూర్తినిచ్చింది.
అ లనాటి ఫ్రెంచి సమాజాన్నీ, రాజకీయాల్నీ కళ్లకు కట్టే రచన ఇది. అరవై అయిదేళ్ల క్రితం సూరంపూడి సీతారాం

తెలుగులోకి అనువదించారు.
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారు క్లుప్తీకరించి అందిస్తున్నారు.

పదిహేనవ శతాబ్దపు 'పారిస్‌ నగరాన్ని పునరుజ్జీవింపచేసిన మరో నవల ''హంచ్‌బాక్‌ ఆఫ్‌ నోత్రెదామ్‌''.
దీన్ని 'ఘంటారావం' పేరుతో సీతారాం తెలుగు చేశారు.
ఈ రెండు పుస్తకాలనీ చదవడం గొప్ప అనుభూతి.

- స్వామి (ఈనాడు ఆదివారం 30 అక్టోబర్‌ 2011 సౌజన్యంతో)

ఘంటారావం- రచన: విక్టర్‌ హ్యూగో, పేజీలు:186 వెల: రూ. 100
అజేయుడు - రచన: అ లెగ్జాండర్‌ ద్యుమా, పేజీలు: 404, వెల: రూ.160
తెలుగు అనువాదం: సూరంపూడి సీతారాం

For EBooks Pl Click: KINIGE.COM

...

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌