Wednesday, September 30, 2015

బాలగోపాల్‌ సైన్స్ వ్యాసాలు


బాలగోపాల్‌
 సైన్స్ వ్యాసాలు

'వాడు లెక్కల మనిషిరా.
లెక్క ప్రకారమే నడుచుకుంటాడు' అని ఒకసారి కాళోజీ అన్నారు బాలగోపాల్‌ గురించి.

లెక్కల్లో బాలగోపాల్‌ చేసిన పి.హెచ్‌.డి. గుర్తుండడం వల్లే ఆయన బహుశా అలా అని ఉంటారు.

అయితే ఎన్నో విషయాల మీద వందలాది వ్యాసాలు రాసిన బాలగోపాల్‌ ఎందుచేతో తను చదువుకున్న గణితం మీద (ఇంగ్లీషులో అకడమిక్‌ వ్యాసాలు ఎన్నో రాసినప్పటికీ) మాత్రం తెలుగులో దాదాపుగా ఏమీ రాయలేదు. ఒకే ఒక చిన్న వ్యాసం, అదీ పుస్తక సమీక్షగా మాత్రమే రాశారు.

అలాగే  సైన్స్  గురించి రాసింది కూడా తక్కువే. మూడే వ్యాసాలు. అందులో ఒకటి ఉపన్యాసం, ఒకటి సమీక్ష, ఒకటి కొ.కు.  సైన్స్  వ్యాసాల పుస్తకానికి రాసిన ముందుమాట. అన్నీ కలిపి 30 పేజీలకు మించని నాలుగే వ్యాసాలైనా వాటిలోనే బాలగోపాల్‌ అనేక చర్చించదగ్గ ఆలోచనాత్మక విషయాలను చెప్పారు.
ముఖ్యంగా -
మన దేశంలో వైజ్ఞానిక శాస్త్రం పురోగమించకపోవడానికి వర్ణ వ్యవస్థ ఎలా ఆటంకమైందో పలు ఉదాహరణలతో వివరించారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే - 'మన దేశ 'ఆధునిక' వైజ్ఞానిక సంప్రదాయం మధ్యయుగాల బ్రాహ్మణ సంప్రదాయానికి కొనసాగింపు మాత్రమే' నన్నారు. 'సైంటిస్టులలో అధిక శాతం కులంరీత్యానూ, ఆలోచనల్లోనూ బ్రాహ్మణులు కాగా, కులంరీత్యా బ్రాహ్మణులు కానివారు కూడా ఆలోచనలలో బ్రాహ్మణులే' నన్నారు. 'విజ్ఞానానికి భౌతిక పునాది వుందనీ, ఆ విజ్ఞానాన్ని మానవులు సామాజిక ఆచరణలో భాగంగా సంపాదించుకున్నారనీ బ్రాహ్మణ సంప్రదాయం ఒప్పుకోదు' అన్నారు.

 సైన్స్ ను కూడా ఒక భావజాలంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని చెపుతూ  'దీని ప్రభావం తమను తాము సామ్రాజ్యవాద వ్యతిరేక అభ్యుదయవాదులుగా భావించుకునే వారి మీద కూడా బలంగా ఉంద'ని ఎత్తి చూపారు. ' సైన్స్ ను ఇటు వంటి వ్యక్తులు కూడా సామాజిక ఆచరణకూ, వర్గ ప్రయోజనాలకూ అతీతమైన పరమ సత్యంగా - తెలిసో తెలియకో - భావించబట్టే అణు విద్యుత్‌ కేంద్రాలు మానవ మనుగడకు ప్రమాదం అని తెలిసినా వ్యతిరేకించడానికి భయపడతార'ని అన్నారు. ' సైన్స్  అనే దాని గర్భంలో వున్న నిజమైన  సైన్స్ ను వెతికి పట్టుకోవడానికి... బ్రాహ్మణ భావజాలంతోనూ తలపడాలి, సామ్రాజ్యవాదపు 'సైన్స్‌' అనే భావజాలం తోనూ తలపడాలి' అని సూచించారు.



బాలగోపాల్‌
సైన్స్ వ్యాసాలు

ధర : రూ. 25/- 
తొలి ముద్రణ:సెప్టెంబర్‌ 2015

ప్రతులకు, వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006.

ఫోన్‌ : 23521849
Email ID: hyderabadbooktrust@gmail.com

Sunday, September 20, 2015

'1984 and 2002 riots will get repeated : Asaduddin Owaisi, Member of Parliament



Sep 20 2015 : The Times of India (Hyderabad)

'84, 2002 will get repeated: Owaisi
Hyderabad:
TIMES NEWS NETWORK


MIM president Asaduddin Owaisi on Saturday feared that major riots would rock the country as what happened in “1984 and 2002“.

Owaisi was referring to the anti-Sikh riots which shook the country in 1984 and the 2002 postGodhra riots which claimed hundreds of lives, most of them Muslim, in Gujarat, at a time when current Prime Minister served as state's CM. What has happened in'84 and 2002 can happen again because of pressure from the media and NGOs.

He was speaking at the launch of the Dilli 1984 Nundi Gujarat 2002 Varaku: Vyavasthala Vaiphalyam pao Panchnama at La Makaan. Emphasizing that the police must be independent of the executive, Owaisi said that no amount of media pressure or criticism from non-governmental organisations could prevent such incidents from happening.


“But believe me this can happen again. Unless the police force is detached from the executive and is made independent and accountable, believe me it is going to happen again. It takes a small incident to fire up a whole issue and it is very unfortunate,“ he said.

Courtesy : The Times of India Hyderabad, 20 Sept 2015

----------------------------------------------------------------------------------------------------------------------


Courtesy : Deccan Chronicle, 20 Sept 2015

--------------------------------------------------------------------------------------------------------------------



ఆనాటి మత కలహాలు పునరావృత మయ్యే పరిస్థితులు - ఎంపి అసదుద్దీన్ ధ్వజం

నిన్న (19-09-2015) లామకాన్ లో జరిగిన
"1984 దిల్లీ నుండి 2002 గుజరాత్ వరకు - వ్యవస్థల వైఫల్యం పై పంచనామా "
పుస్తకావిష్కరణ సభ గురించి
ఈనాడు, ఆంధ్ర జ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ  పత్రికలలో వచ్చిన వార్తల కత్తిరింపులు:










ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ  పత్రికల సౌజన్యంతో 








Wednesday, September 16, 2015

1984 దిల్లీ నుండి 2002 గుజరాత్‌ వరకు... వ్యవస్థల వైఫల్యంపై పంచనామా రచన : మనోజ్‌ మిట్ట & హెచ్‌.ఎస్‌ . ఫూల్కా

1984 దిల్లీ నుండి 2002 గుజరాత్‌ వరకు... వ్యవస్థల వైఫల్యంపై పంచనామా
రచన : మనోజ్‌  మిట్ట  &  హెచ్‌.ఎస్‌ . ఫూల్కా


1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం దేశ రాజధాని దిల్లీలో సిక్కులపై జరిగిన జాతి హననకాండలో దాదాపు మూడువేల మంది బలయ్యారు. 2002లో గోద్రా సంఘటన అనంతరం గుజరాత్‌లో ముస్లింలపై జరిగిన జాతి హననకాండలో దాదాపు రెండువేల మంది బలయ్యారు. భారతదేశ చరిత్రలోనే అత్యంత కిరాతకమైన మారణహోమాలివి.

బాధితులకు కనీస న్యాయాన్ని అందించడంలో, నేరస్తులకు శిక్షలు విధించడంలో, భవిష్యత్తులో ఇలాంటి అమానుష సంఘటనలు జరగవని ప్రజలకు భరోసా కల్పించడంలో అన్ని వ్యవస్థలూ దారుణంగా విఫలమయ్యాయి.

ఆస్తినీ, ఆప్తులనూ కోల్పోయిన బాధితులు తలవంచుకుని భయం భయంగా బతుకీడుస్తుంటే ... ఈ దారుణాలకు పాల్పడిన నేరస్తులూ, గూండాలూ, రాజకీయనాయకులూ తాము ఏం చేసినా చెల్లుతుందనే ధీమాతో బోరవిరుచుకుని తిరుగుతున్నారు.

దిల్లీ అల్లర్లను ప్రస్తావిస్తూ అప్పటి ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ ''ఒక మహావృక్షం కూలిపోయినప్పుడు దాని చుట్టూ వున్న భూమి కంపించడం సహజమే'' అని వ్యాఖ్యానించారు.

గుజరాత్‌ అల్లర్లను దృష్టిలో పెట్టుకుని అప్పటి ముఖ్యమంత్రి నరేంద్రమోదీ ''ప్రతి చర్యకూ ప్రతి చర్య వుంటుంది'' అని వ్యాఖ్యానించారు.

దిల్లీ అల్లర్లను విచారించేందుకు నియమించబడ్డ జస్టిస్‌ మిశ్రా కమిషన్‌ అతకతవకగా వ్యవహరించి ఘోరంగా విఫలమయింది. ఇక గుజరాత్‌ విషయంలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ మోదీకి ''క్లీన్‌ చిట్‌''ను ప్రసాదించింది.

ఈ రెండు మారణహోమాలు జరిగి సంవత్సరాలు గడిచినా వాటి ప్రాసంగికత మాత్రం నేటికీ చెక్కుచెదరలేదు. పైగా మొన్న దిల్లీ, నిన్న గుజరాత్‌ ... రేపు ఎక్కడో అని భయపడేలా మతోన్మాదం రోజురోజుకూ మరింతగా విజృంభిస్తోంది. చాపకింద నీరులా అన్ని వ్యవస్థలకూ విస్తరిస్తోంది. ఎప్పుడు ఎక్కడ ఈ అగ్నిపర్వతం పేలుతుందో, మరెంతమందిని అది బలితీసుకుంటుందో అన్న ఆందోళనను కలిగిస్తోంది.

పత్రికా రచయిత మనోజ్‌మిట్టా, సీనియర్‌ న్యాయవాది హెచ్‌.ఎస్‌.ఫూల్కా దిల్లీ ఊచకోత బాధితులకు న్యాయం జరిగేలా ఏళ్లతరబడి తమ శక్తిమేరా  ప్రయత్నించడమే కాకుండా - ఎంతో నిబద్ధతతో ఈ రెండు మారణహోమాలపై పరిశోధనలు జరిపి ''వెన్‌ ఎ ట్రీ షుక్‌ దిల్లీ : ద 1984 కార్నేజ్‌ అండ్‌ ఇట్స్‌ ఆఫ్టర్‌మాత్‌'' (రోలీ బుక్స్‌); ''ది ఫిక్షన్‌ ఆఫ్‌ ఫాక్ట్‌ ఫైండింగ్‌ : మోదీ అండ్‌ గోద్రా'' (హార్పర్‌ కాలిన్స్‌) అనే పుస్తకాలను వెలువరించారు.

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ఆ రెండు పుస్తకాలనూ ''1984 దిల్లీ నుండి 2002 గుజరాత్‌ వరకు : వ్యవస్థల వైఫల్యాలపై పంచనామా'' పేరుతో ఒకే పుస్తకంగా తెలుగు పాఠకులకు అందిస్తోంది.

మంచి భవిష్యత్తును ఆకాంక్షించే, లౌకికవాదాన్నీ మానవ విలువలనీ  కోరుకునే ప్రతి ఒక్కరికీ ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది.
..............

పై రెండు పుస్తకాలపై వివిధ పత్రికల్లో వచ్చిన కొన్ని సమీక్షలు:

సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో కాంగ్రెస్‌ పార్టీ కౌన్సెలర్లు, పార్లమెంట్‌ సభ్యులు, కేంద్ర మంత్రులు ఏవిధంగా పాలుపంచుకున్నారో మనోజ్‌ మిట్ట, హెచ్‌ఎస్‌ ఫూల్కా ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా వివరించారు. ఆ సమయంలో కొందరు కాంగ్రెస్‌ వాదులు గుడ్లప్పగించి చూస్తుంటే, మరికొందరు వేటగాళ్లలాంటి గుంపులకు స్వయంగా నాయకత్వం వహించారు. ఇంకొందరు పోలీసులకు ఏ చర్యలూ తీసుకోవద్దంటూ ఆదేశాలను జారీ చేశారు.
- అశీష్‌ నందీ, ఔట్‌లుక్‌

ఈ పుస్తకాన్ని గొప్ప నిజాయితీతో రాశారు. ఎక్కడా రాజీపడకుండా కఠిన వార్తలను నివేదించే విలేఖరి దృక్పథంతో రాశారు. తిరుగులేని విస్పష్టమైన దృక్పథం అది. ఎవరినీ వదలకుండా, ఎంతటివారి పేరును ప్రస్తావించడానికైనా  వెనుకాడకుండా, కుండబద్దలు కొట్టినట్టు వారి బండారాన్ని బట్టబయలు చేసే దృక్పథం.  రంగుల మీడియా రాజ్యమేలుతున్న ఈరోజుల్లో దురదృష్టవశాత్తూ ఇలాంటి విలక్షణమైన దృక్పథం చాలా అరుదుగా కనిపిస్తుంది.
- రామచంద్ర గుహ, ది టెలిగ్రాఫ్‌

ఇప్పటికీ మనకు అత్యంత అవమానకరంగా అనిపించే దారుణాన్ని గుర్తుచేసుకునేందుకు మీరు ఈ పుస్తకాన్ని చదవాలి. ఎన్నో దారుణాలలో ఇది మొట్టమొదటిది. దిల్లీ తరువాత ముంబైలో, గుజరాత్‌లో ఇలాంటి దారుణాలే జరిగాయి. రేపు ఎక్కడ జరుగుతాయో ఎవరికి తెలుసు?
- సాగరిక ఘోష్‌, బిబ్లియో

స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వ ప్రమేయంతో జరిగిన ఒక గగుర్పొడిచే మారణహోమం గురించిన వాస్తవాలను ఈ పుస్తక రచయితలు ఎంతో శ్రమించి సమగ్రంగా ఆవిష్కరించారు. తమ రాజకీయ యజమానుల ఆదేశాలకు అనుగుణంగా దిల్లీ పోలీసులు పోషించిన అభిశంశనీయమైన పాత్రను ఈ పుస్తకం తూర్పారబట్టి ఎంతో సార్వజనిక సేవచేసింది. 
- లలిత పణికర్‌, హిందుస్థాన్‌ టైమ్స్‌.

న్యాయస్థానంచేత నిర్దోషులుగా విడుదల చేయబడ్డవారు పునీతులని అనుకోవాల్సినపనిలేదని మనోజ్‌ మిట్టా పుస్తకం మనకు మరోసారి గుర్తుచేస్తుంది... ముఖ్యంగా భారీ పరస్పర విరుద్ధ సాక్ష్యాల మధ్య! అందుకే వాటిని ప్రశ్నించడం మన కర్తవ్యం అని ప్రబోధిస్తుంది.
- శివ విశ్వనాధన్‌, దక్కన్‌ క్రానికల్

గుజరాత్‌ అల్లర్లలో తన పాత్ర గురించి నరేంద్ర మోదీని గనక సరైన ప్రశ్నలు అడిగివుంటే ఇవాళ ఆయన బోనులో వుండేవారు... ప్రధాన మంత్రి పదవికి ఆయనను వ్యతిరేకించేవారు.
- మను జోసెఫ్‌, ద న్యూయార్క్‌ టైమ్స్‌

మనోజ్‌ మిట్ట రాసిన ఉత్కంఠభరితమైన పరిశోధనాత్మక పుస్తకం ''ద ఫిక్షన్‌ ఆఫ్‌ ఫాక్ట్‌ ఫైండింగ్‌ - మోదీ అండ్‌ గోధ్రా'' చదివినప్పుడు మీకు భారతీయ మీడియా ప్రాధాన్యతలు ఏమిటా అని ఆశ్చర్యం కలుగుతుంది. మన ఘనత వహించిన ప్రజాస్వామ్యానికి బాకా ఊదడం విషయమై అది కించిత్తు కూడా సిగ్గుపడకపోవడం గురించి విస్మయం కలుగుతుంది.
    మిట్ట చాలా మంచి పుస్తకం రాశారని చెప్తే సరిపోదు. గుజరాత్‌లో మోదీ నెలకొల్పిన 'నమూనా న్యాయం'ను ఈ పుస్తకం తూర్పారబట్టింది. భారత ఉదారవాద ప్రజాస్వామ్యంపై చాలా కటువైన వ్యాఖ్యానాలు చేసింది.  పత్రికా విలేకర్లతో సహా తగిన న్యాయ ప్రక్రియ మీద నమ్మకంతో కళ్లు మూసుకుని కూచున్న వాళ్లందరినీ మిట్టా ఎద్దేవా చేస్తాడు. వారి మూలంగానే న్యాయ వ్యవస్థను తెలివిగా కుప్పకూల్చారనీ, అది మోదీకీ ఆయనకంటే ముందరి 1984 అల్లర్లలో పాలుపంచుకున్న పలుకుబడివున్న నేతలకీ ''క్లీన్‌ చిట్‌''ని ప్రసాదించిందని అంటారు.
- రాజ్‌దీప్‌ సర్‌దేశాయ్‌, హిందుస్థాన్‌ టైమ్స్‌


1984 దిల్లీ నుండి 2002 గుజరాత్‌ వరకు ... వ్యవస్థల వైఫల్యంపై పంచనామా

రచన : మనోజ్‌  మిట్ట  &  హెచ్‌.ఎస్‌ . ఫూల్కా


ఆంగ్లమూలం: When A Tree Shook Delhi, The 1984 Carnage and its Aftermath by Manoj Mitta and H.S. Phoolka, Lotus Collection, Roli Books, New Delhi, © Manoj Mitta and H.S. Phoolka                        
The Fiction of Fact-finding: Modi and Godhra, HarperCollins Publishers India, 2014                     © Manoj Mitta 2014

తెలుగు అనువాదం :  ప్రభాకర్‌ మందార, రివేరా

ప్రధమ ముద్రణ : సెప్టెంబర్ 2015 

441 పేజీలు, వెల : రూ. 250/-

ప్రతులకు వివరాలకు:  
 హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, 
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500006
ఫోన్‌ : 040 2352 1849
ఇమెయిల్‌ : hyderabadbooktrust@gmail.com
 

Tuesday, September 15, 2015

పురాణాలు - మరోచూపు - బి. విజయభారతి

పురాణాలు - మరోచూపు - బి. విజయభారతి

ఆధునిక సమాజంలో సమస్యలెన్నో ఉండగా పురాణ కథల గురించి ఇంకా రాయ వలసిన అవసరం ఏమిటీ అని చాలామంది అనుకోవచ్చు. స్వశక్తినీ స్వయంకృషినీ పక్కకు పెట్టి దేవుళ్ళను మొక్కుకోవటాలూ దేవుళ్ళమీద ఆధారపడటాలూ రోజురోజుకూ ఎక్కువవటం గమనించాక మహాత్మా జోతిరావ్‌ ఫూలే (1827-1890), డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ (1891- 1956), శ్రీ మాదరి భాగ్యరెడ్డి వర్మ (1888-1939) గార్ల భావజాలాన్ని వర్తమాన సమాజానికి అందించవలసిన అవసరం ఉన్నదనిపించింది.

    భారతదేశంలో మతమే ప్రజల జీవన విధానాన్ని నిర్దేశిస్తున్నది. ముఖ్యంగా కింది కులాల ప్రజలకు పురాణ పాత్రలు, రామాయణ, మహాభారతాలలోని పాత్రలూ ఆదర్శం. ఆ పాత్రల గురించి వారికి తెలియజెప్పవలసి ఉంది.

    శూద్ర కులాలనూ స్త్రీలనూ విద్యకు దూరం పెట్టినప్పటికీ పురాణాలలోనివిగా విన్న విషయాలను వారే బలంగా నమ్ముతున్నారు. ఆచరణలో పెడుతున్నారు. వాస్తవ విషయాలను స్వయంగా చదవకపోవడం వల్లనూ పురాణాలను ప్రశ్నించకూడదనే ఆంక్షలవల్లనూ ఈ పరిస్థితి ఏర్పడింది. పురాణాలలోని సంఘటనలనూ వాటి పూర్వాపరాలనూ తార్కికంగా పరిశీలించిన మహాత్మా జోతిరావ్‌ పూలే అసుర చక్రవర్తులను స్థానికులుగా పరిపాలనా దక్షులుగా, ధర్మ ప్రవర్తకులుగా, ప్రజలకు సమన్యాయం అందించిన మానవతావాదులుగా గుర్తించారు. పురాణాల పేరిట, ధర్మశాస్త్రాల పేరిట, ప్రజలను - ముఖ్యంగా రైతులనూ కింది వర్గాల వారినీ దోచుకుంటున్న పురోహిత వ్యవస్థను ప్రశ్నించారు. తాను కనుగొన్న వాస్తవాలను  రచనల ద్వారా, రాత్రి పాఠశాలల ద్వారా, దృశ్య కళారూపాల ద్వారా ప్రజలలో ప్రచారం చేశారు.

    జోతిరావ్‌ పూలే ఆలోచనా ధారను డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ మరింత ముందుకు తీసుకువెళ్ళారు. వైదిక మతం గురించీ వర్ణ ధర్మాల గురించీ, రాముని, కృష్ణుని రహస్యాల గురించీ చర్చించారు. ఎవరైతే మన స్థానిక వీరులైన అసురులను తుదముట్టించారో వారినే మనం పూజించటం తగనిపని అని భాగ్యరెడ్డి వర్మ చెప్పారు. ఆర్య - ఆర్యేతర ఘర్షణలలోని వాస్తవాలను చిన్న చిన్న నాటకాలుగా ప్రదర్శింపజేసి ప్రజలను చైతన్య పరచారు.

    వివేకానందుడు (1863-1902) తన చివరి రోజులలో మత సంస్కృతిలోని దోషాలను గురించి ఆందోళనపడ్డాడు. ''మతంలో ఏమీ దోషంలేదు. జనపీడన యంత్రాంగాన్ని ప్రవేశపెట్టిన కపట మతాచార్యులదే దోషం'' అన్నాడు. వేదాలు, రామాయణ, మహాభారతాలు, అష్టాదశ పురాణాలు అప్పటప్పటి సామాజిక రాజకీయ పరిస్థితులను మానవ మనస్తత్వాలను, ప్రతిబింబిస్తూ ఉన్న రచనలు  వాటిని ఉద్దేశపూర్వకంగా మత ధర్మాలతో ముడిపెట్టడం జరిగింది. అలా ముడిపెట్టడం వర్గ ప్రయోజనాల కోసమే.
.....    ...   ...
శంబూకుని పట్ల అమలు అయిన న్యాయమే దళితులపట్ల అమలవుతూ ఉంది. ఊచకోతలలో దళితులది అసుర వారసత్వమే. రామాయణాన్ని అందులోని విషయాలనూ ప్రామాణికంగా ఇప్పటికీ భావిస్తుంటారు. అందులోని మత ధార్మిక విషయాలను 21వ శతాబ్దపు దృష్టితో కాకపోయినా వాస్తవాల కోసమైనా తెలుసుకోవాలి. పురాణాలకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఈ వ్యాసాల అవసరం ఉన్నదని భావిస్తూ నా పరిశీలనను మీ ముందు ఉంచు తున్నాను. వర్తమానాన్ని అర్థం చేసుకోవటానికి గతాన్ని తెలుసుకోవటం అవసరం.

(ముందుమాట నుంచి )


పురాణాలు - మరోచూపు
బి. విజయభారతి

380 పేజీలు ; ధర : రూ. 200/-

అట్టమీద ఫోటో    : హరీష్‌ నాగరాజ్‌,  శ్రీ వినాయక తోలుబొమ్మల బృందం, నిమ్మలకుంట గ్రామం, అనంతపురం జిల్లా వారి నుంచి సేకరణ

మొదటి ముద్రణ : జూలై 2015

ప్రతులకు, వివరాలకు : హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,గుడిమల్కాపూర్‌, 

హైదరాబాద్‌ - 500 006.

ఫోన్‌ : 040 2352 1849

19 సెప్టెంబర్ 2015 శనివారం సాయంత్రం లామకాన్ లో "1984 దిల్లీ, గుజరాత్ 2002 - వ్యవస్థల వైఫల్యంపై పంచనామా" పుస్తకావిష్కరణ సభ




హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురిస్తున్న
"1984 దిల్లీ, గుజరాత్ 2002 - వ్యవస్థల వైఫల్యంపై పంచనామా" తెలుగు పుస్తకానికి
మనోజ్ మిట్టా ప్రత్యేకంగా రాసిన ముందుమాట నుంచి ...
....
1978లో నల్లకుంట పోలీసులు రమీజాబీపై అత్యాచారంచేసి, ఆమె భర్తను కొట్టి చంపిన సందర్భంగా రాజుకున్న గొడవలతో నాకు తొలిసారిగా మత హింస అంటే ఏమిటో తెలిసింది. మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పోలీసుల చర్యకు వత్తాసు పలుకుతూ రమీజాబీని వేశ్యగా చిత్రించింది. ఆమె రోడ్డు మీద విటుల కోసం ఎదురుచూసేదని ప్రచారం చేసింది.

అంతవరకు ప్రభుత్వ ఆస్తులను లక్ష్యం చేసుకుని సాగుతున్న విధ్వంసకాండ ఆ తరువాత మత హింసగా మారింది. ఆ తరువాత జస్టిస్‌ ముక్తదర్‌ కమిషన్‌ పోలీసుల వాదనను ఎంత ఎండగట్టినా 1978నాటి హింసాకాండ హైదరాబాద్‌ అంతటికీ మరీ ముఖ్యంగా పెద్ద ఎత్తున పాత బస్తీకి విస్తరించింది.

మేముండే మలక్‌పేట పాత బస్తీకి దగ్గర కాబట్టి అది తీవ్రస్థాయిలో మత హింస చెలరేగిన ప్రాంతాల్లో ఒకటిగా మారింది. తొమ్మిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకూ నా చదువు ఈ గొడవలతో తరచూ కుంటుపడుతుండేది. మా ఇరుగు పొరుగు ప్రాంతాలు తరచూ కర్ఫ్యూ నీడలో బిక్కుబిక్కుమంటుండేవి.

హైదరాబాద్‌లో చదువుకుంటున్న రోజుల్లో 1984 ఆగస్ట్‌లో నేను చిట్టచివరి మత హింసాకాండను చూశాను. అత్యంత దారుణంగా జరిగిన మతోన్మాద హింసాకాండల్లో అదొకటి అని చెప్పవచ్చు. అప్పుడు మొత్తం 40 మంది బలయ్యారు.

అయితే, ఆ తరువాత కొద్ది నెలలకే దిల్లీలో చోటు చేసుకున్న దారుణ మారణకాండలో అధికారిక లెక్కల ప్రకారం 2,733 మంది బలైనట్టు తేలింది. హైదరాబాద్‌లోనే కాదు దేశంలోని మరే ఇతర ప్రాంతంలోనూ ఆ స్థాయిలో మతోన్మాద హింసకు చెలరేగిన దాఖలాలు లేవు.

దిల్లీలో జరిగిన మారణహోమం భారత దేశ చరిత్రనే ఒక మలుపు తిప్పింది. ఆ వెంటనే వచ్చిన లోక్‌సభ ఎన్నికలలో సిక్కు వ్యతిరేక ఉన్మాదాన్ని ఉపయోగించుకుని రాజీవ్‌ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

1984 నాటి రక్తపాతంపై విచారణ జరిపిన మిశ్రా కమిషన్‌ చాలా అవకతవకగా వ్యవహరించింది. దానికి తోడు రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం బాబ్రీ మసీదు ప్రాంగణంలో రామజన్మభూమి గుడికి తలుపులు తెరిచి మతోన్మాదులకు మరింత శక్తిని సమకూర్చింది.

షాబానో సమస్యపై ముస్లిలను సంతృప్తిపరిచేందుకు తీసుకున్న నిర్ణయానికి ప్రతిగా రామజన్మభూమి గుడికి తెరలేపినట్టు అనిపించినా ఆ చర్య హిందూ జాతీయవాదానికి అసలు ప్రతినిధిగా భావించబడే భారతీయ జనతా పార్టీకి ఒక వరంగా మారింది.

ఈ విధంగా మతపరంగా వేడెక్కి వున్న వాతావరణం మధ్య దిల్లీలో పత్రికా రచయితగా నా జీవితం ప్రారంభమయింది. నేను సహజంగానే 1984 నాటి హింసాకాండ బాధితులకు న్యాయం చేకూర్చాలన్న లక్ష్యానికి అంకితమయ్యాను.

హైదరాబాద్‌లో బాల్యం నుంచే నాలో లౌకికవాదం పట్ల ఏర్పడిన అభిమానమే ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకాడకుండా ముందుకు సాగేందుకు దోహదం చేసిందని నేను భావిస్తున్నాను.

- మనోజ్ మిట్టా

(19 సెప్టెంబర్ 2015 శనివారం సాయంత్రం లామకాన్ లో జరిగే పుస్తకావిష్కరణ సభలో, చర్చలో పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ, ప్రొఫెసర్ కోదండరాం, ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం లతో పాటు ఈ పుస్తక రచయితలు మనోజ్ మిట్టా, హెచ్ ఎస్ ఫూల్కాలు పాల్గొంటున్నారు)




Sunday, September 13, 2015

చరిత్ర రచనకు గీటురాయి - చందు (ఆదివారం ఆంధ్ర జ్యోతి)

చరిత్ర రచనకు గీటురాయి 

మార్క్సిస్టు మేధావిగా, మానవ హక్కుల ఉద్యమకారుడిగా ప్రసిద్ధులైన బాలగోపాల్ వివిధ సందర్భాల్లో చరిత్ర రచనా విధానంపై రాసిన వ్యాసాలను "చరిత్ర రచనపై బాలగోపాల్" పేరుతొ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ఇప్పుడు పుస్తక రూపంలో తీసుకొచ్చారు.
...
చరిత్ర పరిశోధకులకే కాక చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న పాటకులందరికీ ఈ వ్యాసాలు చరిత్రను ఎలా అర్ధం చేసుకోవాలనే విషయంలో గీటురాళ్ళుగా ఉపయోగపడతాయి. ఆయన అంచనాలు నేటి పరిస్థితులకు కూడా వర్తించడమే కాక నేటి సమస్యలకూ పరిష్కారాలు చూపిస్తున్నాయి.
- చందు
(ఆదివారం ఆంధ్రజ్యోతి 6-9-2015)
  


http://epaper.andhrajyothy.com/detailednews?box=aHR0cDovL2VjZG4uYW5kaHJhanlvdGh5LmNvbS9GaWxlcy8yMDE1MDkwNjA5MDUxMDQyMjU0NzMuanBn&day=20150906







Saturday, September 12, 2015

భారతదేశం ప్రజాస్వామ్యం - బి.ఆర్‌.అంబేడ్కర్‌

భారతదేశం ప్రజాస్వామ్యం 
- బి.ఆర్‌.అంబేడ్కర్‌

''ప్రజల ఆర్థిక, సామాజిక జీవితాల్లో విప్లవాత్మక మార్పులను ఏ రక్తపాతమూ లేకుండా తెచ్చే ప్రభుత్వరూపమే ప్రజాస్వామ్యం'' - అంబేడ్కర్‌

రాజ్యాంగం, ఓటు హక్కు, ఎన్నికలు ... ఈ మూడూ వుంటే చాలు ఆ దేశంలో ప్రజాస్వామ్యం వున్నట్లే అని భావించడం పొరపాటు. అవన్నీ పాలకవర్గానికే ఉపయోగపడుతున్నాయనీ, పైగా వారి పెత్తనానికి చట్టబద్ధత కల్పిస్తున్నాయనీ, సామాన్య జనానికి వాటివల్ల ఒరుగుతున్నదేమీ లేదనీ ఆవేదన చెందుతాడు అంబేడ్కర్‌.

ప్రజల మధ్య సామాజిక సమానత్వం, స్వేచ్ఛ లేనప్పుడు ఆ ప్రజాస్వామ్యానికి అర్థంలేదు.

సామాజిక సమానత్వానికి, ఆదర్శాలకు, సమైక్యతకు భారతదేశంలో కుల వ్యవస్థ పెద్ద అడ్డంకి. అది ప్రజాస్వామ్య మూలాలను తొలచివేస్తోంది.

ఒక కులం వారు ఒక వృత్తికే కట్టుబడివుండాలనడం ప్రజాస్వామ్య మూలసూత్రాలకే విరుద్ధం. దొంతరలతో కూడిన కులవ్యవస్థ వల్ల వెనుకబడిన, దళితకులాల్లో కూడా ఒకరు మరొకరికంటే ఎక్కువనో తక్కువనో భావిస్తున్నారు.

ఏ కులంవాడూ తనకంటే తక్కువ కులం వాడి హక్కులకోసం పోరాడేందుకు ముందుకురాడు. భారతీయులు కుల ప్రాతిపదికనే ఓటు వేస్తారు. చివరికి పార్టీలు కూడా ఆ నియోజకవర్గంలో ఏ కులం ఓటర్లు ఎక్కువగా వుంటే ఆ కులం అభ్యర్థినే పోటీకి నిలబెడుతున్నాయి.

భారతీయు ఆలోచనలు అడుగడుగునా తప్పుడు విలువలతో, తప్పుడు దృక్పథాలతో పక్కదార్లు పడుతున్నాయి. ప్రస్తుత విద్యావిధానం కూడా కులవ్యవస్థను పెంచి పోషిస్తోందే తప్ప కుల నిర్మూలనకు ఏమాత్రం దోహదం చేయటంలేదు.

చదువుకున్న వ్యక్తుల్లో కూడా సామాన్యులకంటే ఎక్కువగా స్వార్థం, కుల పిచ్చి పెరిగిపోవడం గమనించవచ్చు.

ఇలాంటి పరిస్థితుల్లో మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం భవిష్యత్తు ఏమైపోతుంది?
మన జ్రాస్వామ్యానికి దిక్కెవరు?
దీనిని ఎలా రక్షించుకోవాలి?
అనే అంశాలపై డా. అంబేడ్కర్‌ ఆలోచనల సమాహారమే ఈ పుస్తకం.



భారతదేశం ప్రజాస్వామ్యం
- బి.ఆర్‌.అంబేడ్కర్‌


ఆంగ్లమూలం: Dr.Bahasaheb Ambedkar Writings and Speeches
తెలుగు అనువాదం :  ప్రభాకర్‌ మందార


36 `పేజీలు , వెల : రూ . 20 /-

ప్రధమ ముద్రణ: మార్చ్ 2005
పునర్ముద్రణ : 2014, 2015
ప్రతులకు వివరాలకు:

: హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, 

ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500006
ఫోన్‌ : 040 2352 1849
ఇమెయిల్‌ : hyderabadbooktrust@gmail.com

: సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌,
ఇం. నెం. 3-4-142/6,
ఫస్ట్‌ ఫ్లోర్‌, బర్కత్‌పుర,
హైదరాబాద్‌ - 500027
ఫోన్‌: 040 23449192

Friday, September 4, 2015

మానవతామూర్తి సీకే (ఆంధ్రజ్యోతి 4 సెప్టెంబర్ 2015 ఎడిటోరియల్ పేజి)

మానవతామూర్తి సీకే

(ఆంధ్రజ్యోతి 4 సెప్టెంబర్ 2015 ఎడిటోరియల్ పేజి)

సీకే చాలా తక్కువగా మాట్లాడేవాడు. ఎల్లప్పుడూ ఎదుటివాళ్ళు చెప్పేదాన్ని వినేవాడు. ఆయన తరానికి చెందిన ఏ కమ్యూనిస్టులోనూ అంతగా కనపడని అరుదైన లక్షణం ఇది. తప్పులు దిద్దుకోవటానికి సిద్ధంగా ఉండేవాడు. నాకు తెలిసి చాలామంది కమ్యూనిస్టులకు భిన్నంగా - సీకే మహిళలు, పేద ప్రజల పట్ల ఎంతో సున్నితంగా, ఆర్తితో వ్యవహరించేవాడు. దీనితో పోలిస్తే ధనవంతుల పట్ల మాత్రం కొంత కఠినంగా వుండేవాడని చెప్పుకోవచ్చు. విరాళాలు సేకరించటం కోసం మేం ఎవరివద్దకన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు- కొత్త ఇల్లు కట్టుకున్నామనీ లేదా కూతురి పెళ్ళి చేశామనీ, అందువల్ల విరాళం ఇవ్వలేమనీ అన్నారనుకోండి, సీకే వాళ్ళను అస్సలు వదిలేవాడు కాదు. ‘‘ఆహా! సరిగ్గా అందుకోసమే నీ దగ్గరికి వచ్చాం. ఆ పనులన్నింటికీ నువ్వు బాగానే ఖర్చుపెట్టావని విన్నాం. అందుకే అసలు నిన్ను మొదట్లో అడగాలనుకున్న మొత్తానికి ఇప్పుడు రెట్టింపు అడుగుతున్నాం’’ అనేవాడు. పేదల పెన్నిధిగా పేరున్న ప్రముఖ ఐఏఎస్‌ అధికారి ఎస్‌.ఆర్‌. శంకరన్‌, సీకే గురించి కొంత సరదాగా మాట్లాడుతూ ‘‘నేను భయపడే కొద్దిమంది వ్యక్తుల్లో సీకే కూడా ఒకడు. ఆయన మనకేదైనా పని అప్పగిస్తే, దాన్ని చెయ్యకుండా తప్పించుకోవడం సాధ్యమయ్యేదే కాదు’’ అనేవాడు.

మిగతా కమ్యూనిస్టులకంటే సీకేను భిన్నంగా నిలబెట్టిన అంశాలేమిటి? సీకే ఎక్కడికి వెళ్లినా ప్రజల్ని ఇబ్బందులపాలు చేస్తున్న రోజువారీ సమస్యలను, వారి వ్యక్తిగత సమస్యలను పట్టించుకునేవారు. ఏ ఇంటికి వెళ్లినా- తనకు పని ఉన్నది ఆ ఇంట్లో మగమనిషితోనే కావచ్చు, అయినా ఇంట్లో ఆడమనిషిని కచ్చితంగా పలకరించేవాడు సీకే. ఎలా వున్నావు, పిల్లలు బాగున్నారా, వాళ్ళ ఆరోగ్యం, చదువులు ఎలా వున్నాయని అడిగి మరీ తెలుసుకునేవాడు. ఎవరికన్నా వ్యక్తిగత సమస్యలున్నట్టు తన దృష్టికొస్తే, వాటిని పరిష్కరించేందుకు వాళ్ళకి సహాయపడేవాడు. అందుకోసం, ఎంత సమయం పట్టినా శ్రద్ధ వీడే వాడు కాదు. తరచూ ఆరోగ్య సమస్యలు ఆయన దృష్టికి వచ్చేవి. కాల క్రమంలో ఆయనకు ఎంతోమంది డాక్టర్లతో, వివిధ వైద్య విభాగాలకు చెందిన స్పెషలిస్టులతో పరిచయాలు పెరిగాయి. డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకోలేని ఎంతోమంది రోగులకు ఆయన తన పరిచయాల ద్వారా ఉచితంగా వైద్యం చేయించేవాడు. డాక్టర్లు డబ్బులు చెల్లించగలిగిన సామర్థ్యం వున్న రోగులను చూసినంత శ్రద్ధగా పేదవారిని కూడా చూడాలని, వీలైతే ఇంకొంచెం ఎక్కువగానే చూడాలని ఆయన ఆశించేవాడు. ఈ మాట పైకి అనకపోయినా ఆయన ఉద్దేశం అదే, ఆయన తీసుకొచ్చిన రోగుల పట్ల వైద్యులు కూడా అలాగే వుండేవారు. ఎవరినైనా వైద్యం కోసం ఆసుపత్రిలో చేర్పించాక ఆయన క్రమం తప్పకుండా వెళ్ళి వాళ్ళను చూసేవాడు, మందులు కొనిచ్చేవాడు, అలాగే వైద్య పరీక్షలకీ, డాక్టర్లు, సర్జన్లు వచ్చి వాళ్ళని చూసేందుకు అన్ని ఏర్పాట్లూ చేసి, వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరుకునేంత వరకూ భరోసాగా వెంటవుండే వాడు. దీని గురించి వల్లంపాటి వెంకట సుబ్బయ్య ఇలా గుర్తు చేసుకున్నాడు...

‘‘నా సమస్య వెంటనే ఆయన సమస్యగా మారిపోతుంది. జేఎన్‌టీయూ హాస్టల్‌లో నా కొడుకు వున్నప్పుడు టైఫాడ్‌ జ్వరం వచ్చి జబ్బు పడ్డాడు. సీకే వాడిని అపోలో ఆసుపత్రిలో చేర్పించి, వైద్య ఖర్చులన్నీ చెల్లించి వాడు బాగయ్యాక తన ఇంటికి తీసుకొచ్చి, కోలుకునేంత వరకూ తనతోపాటే వుంచుకున్నాడు. ఆ తర్వాత పిల్లాడిని మదనపల్లికి పంపించేప్పుడు... అప్పుడు చెప్పాడు నాకు.. ‘అబ్బాయు జబ్బుపడ్డాడు. ఇప్పుడు చాలా వరకు ఫర్వాలేదు. ఉదయం బస్సుకు వస్తున్నాడు. ఇంటికి తీసుకువెళ్ళు’ అన్నాడు. సీకే ఎడంచేత్తో చేసిన మంచి పనులేమిటో కుడి చేతికి కూడా తెలిసేది కాదన్న మాట. అట్లా వుండేది ఆయన వ్యవహార శైలి.’’5,

2013 సెప్టెంబర్‌లో జరిగిన సీకే సంస్మరణ సభలో సీపీఐ(ఎం) నాయకుడు రాఘవులు మాట్లాడుతూ ‘‘కమ్యూనిస్టు పార్టీల్లో దీర్ఘకాలిక లక్ష్యాలతో పాటు, మనం ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలను కూడా పట్టించుకోవాలని సీకే నాతో చెప్పేవాడు. పాలకవర్గ పార్టీలు ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలను... అది రేషన్‌ కార్డులు కావచ్చు, బడి, ఆసుపత్రి ఇలా అన్నింటినీ పట్టించుకుంటాయి. ఇలాంటి వాటన్నింటినీ మరి కమ్యూనిస్టులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారని తరచూ ప్రశ్నించేవాడు’’ అని గుర్తు చేసుకున్నాడు.

ప్రచురణ కోసం ఏదైనా పుస్తకాన్ని సిఫార్సు చేస్తే, వేర్వేరు వృత్తుల్లో, రకరకాల వ్యాపకాల్లో ఉన్న భిన్న నేపథ్యాల వ్యక్తుల నుంచి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే దానిపై ఒక దృక్పథాన్ని ఏర్పరచుకునేవాడు సీకే. అంత సున్నితమైన వ్యక్తి కూడా పుస్తకాల ఎంపిక విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా నిక్కచ్చిగా ఉండేవాడు. ఈ విషయంలో ఒక్కోసారి రాజీనామా చేస్తానని కూడా బెదిరించే వాడు. చాలాకాలం పాటు ఆయన ‘స్టాలినిస్టు’గా వుండి పోయాడు. వీరాభిమానం కాదుగానీ, స్టాలిన్‌ పట్ల గౌరవంతో, ఆయన అందించిన సేవలను విలువైనవిగా పరిగణంచేవాడు సీకే. మానవ హక్కుల విషయంలో స్టాలిన్‌పై వున్న విమర్శలను ఆయన చాలా చిన్న అంశాలుగా కొట్టిపారేసేవాడు. అందుకని ఏ పుస్తకంలోనైనా స్టాలిన్‌ పట్ల విమర్శ ఉందని ఆయన దృష్టికి వస్తే, చికాకు పడటమే కాదు, ఆ పేరా ఏదో తొలగించే వరకూ ఊరుకునేవాడు కాదు.

అలాగని సీకే పిడివాదిలా, మారని మనిషేం కాదు. ‘నేనీ విషయంలో తప్పుచేశాను’ అని నిజాయితీగా ఒప్పుకోగలిగిన అతి కొద్దిమంది వ్యక్తుల్లో ఆయనా ఒకడు. ఈ సందర్భంగా నాకు అరుంధతీ రాయ్‌ రాసిన ‘ద గాడ్‌ ఆఫ్‌ ద స్మాల్‌ థింగ్స్‌’ పుస్తకం విషయంలో జరిగిన వాదోపవాదాలు గుర్తుకొస్తున్నాయి. ఆ పుస్తకాన్ని నేను చదివాను, నాకు చాలా నచ్చింది. అనువదించి, తెలుగులో తెస్తే బాగుంటుందని అనుకున్నాను. కానీ ఆ పుస్తకంలో ఒక పాత్ర ద్వారా కేరళకు చెందిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు ఇ.ఎమ్‌.ఎస్‌. నంబూద్రిపాద్‌ మీద చేసిన వ్యాఖ్యానాలను చూసి, సీకే తీవ్రంగా బాధపడి ఆ పుస్తకాన్ని అనువదించాల్సిన అవసరం లేదని చెప్పేశాడు. మరుసటి సంవత్సరం, అభివృద్ధి గురించి, భారీ డ్యాముల పేరుతో జరుగుతున్న మానవ హక్కుల హననం గురించీ తీవ్ర నిరసన స్వరంలో అరుంధతీ రాయ్‌ రాసిన ‘ఫర్‌ ద గ్రేటర్‌ కామన్‌ గుడ్‌’ వచ్చింది. దాన్ని చదివిన తర్వాత సీకే ఆమె రచనలన్నింటినీ చదవటమే కాదు, మొదటి పుస్తకంపై తాను గతంలో వెల్లడించిన అభిప్రాయాలు సరైనవి కావంటూ తనను తానే సరిచేసుకున్నాడు. ఇదంతా ఎనభై ఏళ్ల వయసులో!’’

(స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు, హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన సీకే నారాయణరెడ్డి జీవిత చరిత్ర ‘నేను కమ్యూనిస్టుని’ నుంచి కొన్ని భాగాలు ఇవి. 
రేపు ఆయన ద్వితీయ వర్థంతి)

http://epaper.andhrajyothy.com/detailednews?box=aHR0cDovL2VjZG4uYW5kaHJhanlvdGh5LmNvbS9GaWxlcy8yMDE1MDkwNDA5MDQwMjE5MDQ2NDEuanBn&day=20150904



Thursday, September 3, 2015

'బహుళత్వ భారతంలో కలుపుకుపోయే రాజకీయాల'పై చర్చ 19 సెప్టెంబర్ 2015 శనివారం సాయంత్రం 5-30 కు లామకాన్ లో

చర్చకు ఆహ్వానం

'బహుళత్వ భారతంలో కలుపుకుపోయే రాజకీయాల' పై
ఆసక్తికరమైన చర్చ నిర్వహిస్తున్నాం

ఇందులో-
పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ,
ప్రొఫెసర్ కోదండరాం
సీనియర్ అడ్వొకేట్ బొజ్జా తారకం

మరికొంతమంది ప్రముఖులు
పాల్గొంటున్నారు.

సందర్భం:
మనోజ్ మిట్టా, హెచ్.ఎస్.ఫూల్కా రాసిన
"దిల్లీ 1984 నుండి గుజరాత్ 2002 వరకు : రాజకీయ వైఫల్యం పై పంచనామా " పుస్తకావిష్కరణ.
("వెన్ ఎ ట్రీ షుక్ దిల్లీ",  "ది ఫిక్షన్ ఆఫ్ ఫాక్ట్ ఫైండింగ్ : మోది అండ్ గోద్రా" అనే రెండు పుస్తకాల అనువాదం)

సమయం: 19 సెప్టెంబర్ 2015 శనివారం సాయంత్రం 5-30 కు

వేదిక : బంజారా హిల్స్, రోడ్ నెం 1లో జీవీకే మాల్ ఎదురుగా వున్నలామకాన్


మీకిదే ఆహ్వానం

- హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ఫోన్: 040 2352 1849



 





Tuesday, September 1, 2015

నేను కమ్యూనిస్టుని - అతిసాధారణుడు సీకే జ్ఞాపకాలు - గీతా రామస్వామి



నేను కమ్యూనిస్టుని - అతిసాధారణుడు సీకే జ్ఞాపకాలు

సీకే నారాయణరెడ్డి (1925-2013) నిశ్శబ్దంగా పనిచేసుకుటూపోయే గొప్ప పనిమంతుడు. స్వాతంత్య్ర సమరయోధుడు,తలకెత్తుకున్న విలువలను తనువు చాలించేదాకా నిలబెట్టుకున్న కమ్యూనిస్టు. హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకుల్లో ఒకరు. అతిసాధారణంగా కనిపిస్తూనే గొప్ప మార్పు కోసం జీవితపర్యంతం శ్రమించిన ఇటువంటి మౌన ఋషుల, మానవతా మూర్తుల చరిత్ర బయటకు రావటం అవసరమని భావించి ఈ పుస్తకాన్ని మీ ముందుకు తెస్తోంది హెచ్‌బీటీ

.... ... ...

రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఎదురుగా ఎక్కడన్నా అరటిపండు తొక్క కనబడితే పనిగట్టుకుని అక్కడి వరకూ వెళ్లి.. వంగి, దాన్ని చేత్తో తీసి దూరంగా చెత్తకుప్పలో పడేసే నిండు వృద్ధుడిని చూస్తే మనకు ఏమనిపిస్తుంది?

అసలు అలాంటి వారు ఉంటారా అనిపించటం సహజం.

ఎందుకింత, అవసరమా అంటే 'జనం జారి పడిపోరూ' అనేవాడాయన.

ఇదొక్కటే కాదు.

స్వాతంత్య్ర సమరయోధుడు, జీవిత పర్యంతం కమ్యూనిస్టుగా జీవించినవాడు, హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన సి.కె.నారాయణరెడ్డి  (చల్లా కృష్ణ నారాయణరెడ్డి) గురించి చెప్పటం మొదలుపెడితే ఇలాంటి విషయాలు ఇంకెన్నెన్ని ప్రస్తావనకు వస్తాయో లెక్కలేదు.

పట్టణాల్లో పేదలు ఎదుర్కొంటున్న పిచ్చి కుక్కల బెడద, గ్రామాల్లో పేదలను వేధిస్తున్న ఫ్లోరోసిస్‌ వ్యాధి, శివారు ప్రాంతాల్లో పారిశ్రామిక వ్యర్థాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందుల వంటి ఎవరికీ పట్టని, ఎవరి దృష్టికీ రాని అనేకానేక 'చిన్న చిన్న' విషయాలను ఆయన ఎంతో శ్రద్ధగా పట్టిరచుకునేవాడు.

ఆసుపత్రుల్లో, పాఠశాలల్లో దళితులకు ప్రవేశాన్ని నిరాకరిస్తుండటం, శాసన సభ్యులు, మాజీ శాసనసభ్యులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తమకు తామే జీతభత్యాలను, ఇతర సదుపాయాలను పెంచుకోవడం వంటి - కమ్యూనిస్టులు తమకు సాంప్రదాయేతరమైన విషయాలుగా భావించే - ఎన్నో సమస్యలపై ఆయన నిబద్ధతతో పోరాడాడు. వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా తప్పనిసరై ఇంటికి పరిమితమవ్వాల్సి వచ్చేంత వరకూ కూడా ఆయన సామాజిక కార్యకర్తలందరికీ చిరపరిచితుడు. నిత్యం ఏదో ఒక సహాయం కోరుతూ ఎందరో ఆయన్ని కలిసేవారు. ఆయన కూడా న్యాయమైన ప్రతి సమస్యనీ ఎంతో శ్రద్ధగా కడదాకా పట్టించుకుని, ఆ పని పూర్తయ్యే వరకూ విశ్రమించేవాడు కాదు. ....









నేను కమ్యూనిస్టుని  - అతిసాధారణుడు సీకే జ్ఞాపకాలు

- గీతా రామస్వామి

వెల: రూ. 30


పతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006

ఫోన్‌ : 040 23521849
ఇ మెయిల్ ఐ డి : hyderabadbooktrust@gmail.com

 








హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌