Tuesday, December 23, 2008

బషాయి టుడు (నవల) ... రచన: మహాశ్వేతా దేవి ... అనువాదం: ప్రభంజన్‌, సహవాసి ...



1967 మే-జూన్‌ మాసాల్లో ఉత్తర బెంగాల్‌ లోని నక్సల్‌బరి ప్రాంత రైతాంగ ఉద్యమం ఈ బషాయ్‌ టుడు, ద్రౌపది రచనల నేపథ్యం.
....

మొట్టమొదట, నక్సల్‌బరీలో ఉద్యమం తేయాకు తోటల యజమాన్ల ఎస్టేట్లలో మొదలయింది. ...
టీ తోటల ఆక్రమణలో వున్న మిగులు భూమిని ప్రభుత్వం స్వాధీనపర్చుకొని తమకు పంపిణీ చేయాలని 50వ దశకం నుంచీ అధియార్లు తోట యజమానులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఆ యజమానులు వాళ్లను భూములనుంచి గెంటివేసి, ఏనుగుల చేత వాళ్ల గుడిసెల్ని నేలమట్టం చేయించడంతో నక్సల్‌బరీ రైతాంగం ఆ పీడనకు హింసకు వ్యతిరేకంగా ఒక్కటై ఒక్కుమ్మడిగా తిరగబడింది. ఆ తిరుగుబాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించి పీడిత తాడిత రైతాంగానికి ప్రేరణ ఇచ్చింది. నక్సల్‌బరీ ఉద్యమం మీద రకరకాల ముద్రలు వేశారు.
...

సాధారణంగా పరిశోధకులు జనం తిరుగుబాట్ల వెనకగల కారణాలేమిటో శోధించి లిఖిత రూపంలో పెట్టడంలో నిమగ్నమవుతారు. కానీ నక్సల్‌బరీకి సంబంధించి పరిశోధకులు ఆ ఉద్యమ కారణాలమీద కన్నా దాని స్వభావం పైనా, ధోరణులపైనా ఎక్కువగా బుర్ర చించుకున్నారు.... మరో వైపు పాలనా యంత్రాంగం ఆ ఉద్యమాన్ని అణచివేయడంలో నిర్ణయాత్మకమైన చాకచ్యం ప్రదర్శించింది.
....

నా కథలలో వాటన్నిటి ప్రత్యక్ష సంబంధాన్ని మించి, నక్సల్‌బరీలో జరిగినవి, వాటి నేపథ్యం దేశ చరిత్రలో గడచిన కొద్ది దశాబ్దాల కాలంలో జరిగిన అత్యంత ముఖ్యమైన సంఘటనలను ప్రతిబింబిస్తాయి.
బషాయి టుడు గానీ, ద్రౌపది గానీ, వారి సహచరులుగానీ ఆ సంఘటనల సృష్టే.
...
పశ్చిమ బెంగాల్‌లో వామపక్ష సంఘటన తొలిసారి అధికారంలో కొచ్చిన కాలంలో (1977-82) ''బషాయి టుడు'' నవలికను రాశాను.
...

నా రచనలో ఏ నిర్దిష్ట రాజకీయాల జాడల కోసమో వెతకడం వృధా.
పీడిత తాడిత జన విముక్తి కోంసం నడుంకట్టిన వ్యక్తులు నా రచనల్లో కీలక పాత్రదారులుగా కనిపిస్తారు.
నేను రాసిన 'జాల్‌' కథలో ఉపాధ్యాయుడు నిజాయితీపరుడైన ఓ కాంగ్రెస్‌వాది.
మరోకథ 'లిఖిండా'లో వ్యవసాయ కూలీ ఉద్యమానికి సారథ్యం వహించిన సిపిఐ దర్శనమిస్తుంది.
'బషాయి టుడు'లో కాళీ సంత్రా సిపిఎమ్‌ పార్టీకి చెందినవాడు.
బషాయి టుడు నక్సలైట్లను సైతం మించిపోయి ఎక్కడో ఇంకా ఎత్తున నిలబడి కన్పిస్తాడు.
'ద్రౌపది' కథానాయిక ఓ చురుకైన నక్సలైట్‌ కార్యకర్త. మానసికంగా వాళ్లందరూ ఒక ఉమ్మడి ఆశయానికి బద్ధులైన వాళ్లు.
...

పార్టీ ప్రయోజనాల పెంపుదలకు మాత్రమే పరిమితమైన రాజకీయాలు వర్తమాన సామాజిక వ్యవస్థను మార్చగలవంటే నేను నమ్మను.

స్వాతంత్య్రం సిద్ధించి ఇన్నేళ్లయిన తరువాత కూడా తిండికి, నీళ్లకు, భూమికి నోచుకోక అప్పుల్లో, కట్టుబానిసత్వంలో నా దేశ ప్రజలు అ ల్లాడిపోవడం నా కళ్లతో చూస్తున్నాను.

ఈ అమానుష నిర్బంధాల నుంచి నా ప్రజల్ని విముక్తుల్ని చెయ్యలేని వ్యవస్థకు వ్యతిరేకంగా జాజ్వలమానంగా ప్రజ్వరిల్లుతున్న ఆగ్రహమే నా రచనలన్నిటికీ ప్రేరణ, స్ఫూర్తి. ... అనాధలు, అభాగ్యుల పఢాన నిలబడి నా శాయశక్తులా కలంతో పోరాటం సాగిస్తున్నాను.
ఆవిధంగా నాకు నేను సంజాయిషీ చెప్పుకోవలసివస్తే తలదించుకోవాల్సిన ఆగత్యం ఎన్నడూ కలగబోదు. ఎందుకంటే అందరు రచయితలూ తమ తరానికి జవాబుదారులు, తమకు తాము జవాబు చెప్పుకోవాల్సినవాళ్లు.

- మహాశ్వేతా దేవి (నా మాట నుంచి)

బషాయి టుడు (నవల)
రచన : మహాశ్వేతా దేవి

తెలుగు అనువాదం: ప్రభంజన్‌, సహవాసి

151 పేజీలు, వెల: రూ.25

............................

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌