Sunday, November 23, 2008

దళితులు - రాజ్యం ... బొజ్జా తారకం







ఒకే చోట నివసిస్తూ,
ఒకే భాష మాట్లాడుతూ,
ఒకే దేవుణ్ణి పూజిస్తూ,
ఒకే జీవన విధానాన్ని పాటిస్తూ వున్న ప్రజలలో...
కొందరిని ముట్టుకోవడానికి కూడా వీలులేని మనుషుల్ని చేసిన దేశం భారతదేశం తప్ప మరొకటి ఎక్కడా కనపడదు.
కలిసి కూర్చుని మాట్లాడుకోకుండా,
కలిసి ప్రయాణం చేయటానికి వీలు లేకుండా,
కలిసి మంచినీళ్లు త్రాగడానికి గానీ
కలిసి భోజనం చేయడానికి గానీ వీలులేకుండా
పెళ్లి చేసుకుని జీవనాన్ని సాగించటానికి వీలులేకుండా
కోట్లాది ప్రజలను ఊరవతలకు తరిమేసి అంటరానివారిగానే కాక
చూడరానివారుగా కూడా చేసిన దేశం
భారతదేశం తప్ప మరొకటి ఎక్కడా కనపడదు.

దళితులు అని ప్రస్తుతం ఎవరినయితే అంటున్నామో
వారిని దళితులుగానే ఉంచటం కోసం,
కేవలం ఉంచటమేకాదు అదిమిపట్టి ఉంచటం కోసం,
తొక్కిపెట్టి ఉంచటంకోసం
ప్రస్తుత రాజ్యం వ్యవహరిస్తున్న తీరును విశ్లేషించిన పుస్తకమిది.

ఈ పుస్తక రచయిత బొజ్జా తారకం వృత్తిరీత్యా న్యాయవాది. కారంచేడులో అగ్రవర్ణాలవారు దళితులపై సాగించిన అమానుష మారణకాండకు నిరసనగా 1984లోనే ఆయన
హైకోర్టులో గవర్నమెంట్‌ ప్లీడర్‌ ఉద్యోగానికి రాజీనామా చేశారు.
ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ సహ వ్యవస్థాపకుడిగా దళితుల నిరసనోద్యమానికి దశాబ్దకాలంపాటు వెన్నుదన్నుగా నిలిచారు.
అగ్రకుల దౌష్ట్యానికీ, వర్గ దోపిడీకీ గురయ్యే ప్రజల పక్షాన రాజీలేని పోరాటం సాగించే బొజ్జా తారకం ఇప్పటికీ దళితులను సంఘటితపరిచే కార్యక్రమాలకే తన పూర్తికాలాన్ని
వెచ్చిస్తున్నారు.
మానవ హక్కుల, పౌర హక్కుల ఉద్యమాల్లో ఎంతో క్రియాశీలంగా పాల్గొంటున్నారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా రచయితగా కూడా ఆయనకు మంచి పేరుంది.
బొజ్జా తారకం రచనల్లో ... పోలీసులు అరెస్టు చేస్తే (1981), ... కులం-వర్గం (1996), ... నది పుట్టిన గొంతుక (1983) ప్రముఖమైనవి.

దళితులు - రాజ్యం

- బొజ్జా తారకం

78 పేజీలు, వెల: రూ.25

...

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌