
ఫూలే తర్వాత బ్రాహ్మణ వ్యతిరేకోద్యమాన్ని అంత సమర్థవంతంగా నిర్వహించిన నాయకుడు ఛత్రపతి సాహూ మహరాజ్.
ఆయన 1894 నుండి 1922 దాకా, మొత్తం ఇరవై ఎనిమిదేళ్లపాటు కొల్హాపూర్ సంస్థానాన్ని పాలించాడు.
దళిత, బహుజనులను బ్రాహ్మణుల పెత్తనం నుండి విముక్తి చెయ్యటానికి సైద్ధాంతికంగానూ, పాలనాపరంగానూ తీవ్రమైన కృషిచేశాడు.
అట్టడుగు కులాల, వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ఆర్థిక, విద్యా, వైద్య, వ్యవసాయ రంగాలన్నింటిలోనూ విప్లవాత్మకమైన చట్టాలను రూపొందించింది సాహూ ప్రభుత్వం. వెనకబడిన కులాల ప్రజలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన మొట్టమొదటి పాలకుడు ఆయన.
సాహూ పాలనలో కొల్హాపూర్ సంస్థానమే గాక, మొత్తం మహారాష్ట్ర ప్రాంతమే కొత్త జీవంతో తొణికిసలాడింది.
బ్రాహ్మణాదిక్యతలో మగ్గుతూ వుండిన మహారాష్ట్ర నుండి తర్వాత కాలంలో దళిత నాయకులూ, మేధావులూ ముందుకు రావటం వెనక సాహూ చేసిన కృషి ఎంతో వుంది.
సాహూ జీవితాన్నీ, ఉద్యమాన్నీ ఈ పుస్తకం మనకు పరిచయం చేస్తుంది. ఆయన సైద్ధాంతిక దృక్పథానికున్న పరిమితులపై వచ్చిన విమర్శలను కూడా చర్చిస్తుంది.
బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమ నిర్మాత
ఛత్రపతి హాహూ మహరాజ్
- కాత్యాయని
88 పేజీలు, వెల: రూ.25
No comments:
Post a Comment