
భగవద్గీతలో పరస్పరం విభిన్నమైన దృక్పథాలు కలగలిసి వున్నాయి.
అందువల్ల గీతపై ఇంతవరకు వచ్చిన వ్యాఖ్యానాలు, భాష్యాలు కాకుండా, ఈ కాలానికి తగిన కొత్త అర్థం చెప్పడం ఏమంత కష్టంకాదు.
కానీ, దాని ప్రయోజనం లేకపోగా, ప్రమాదకరం కూడా ...
దీన్ని ఉపయోగించుకుని అసలు సమస్యల నుండి జనం దృష్టి మళ్లించడానికి అవకాశం వుంది.
దీనివల్ల భక్తికి విపరీతమైన గౌరవం ఏర్పడుతుంది.
ఫాసిజాన్ని, వ్యక్తి పూజను సమర్థించడానికిది తోడ్పడుతుంది... అంటారు సుప్రసిద్ధ చారిత్రకులు డి.డి. కోశాంబి.
డి.డి.కోశాంబి భారతదేశ చరిత్ర రచనలో కొత్త పుంతలు తొక్కిన మహామేధావి.
గణిత శాస్త్రంలో, జన్యు శాస్త్రంలో, ఇతర రంగాలలో గొప్ప గొప్ప విషయాలు వెలికితీసిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
అన్నిటికన్న మిన్నగా ప్రతిపని, ప్రతి ఆలోచనా ప్రజల కోసం అనే ప్రగతి శీల మేధావి.
ఈ వ్యాసంలో కోశాంబి భారతీయ తత్వానికి మూల గ్రంథంగా పలువురు అభివర్ణించే గీత కున్న చారిత్రక పరిమితులను నిర్ద్వంద్వంగా బయటపెట్టారు.
గీత ను, గీత రచనా క్రమాన్ని అద్భుతమైన వర్గవిశ్లేషణకు గురిచేశారు.
విలువైన గుణపాఠాలు అందించారు.
భగవద్గీత చారిత్రక పరిణామం
డి.డి.కోశాంబి
ఇంక్వైరీ పత్రిక, 1959 సంచిక నుండి స్వీకరించబడిన వ్యాసం.
ప్రథమ ముద్రణ: 1985
పునర్ముద్రణలు: 1986, 1989, 1995, 1998, 2001
20 పేజీలు, వెల: రూ.5
No comments:
Post a Comment