
ప్రాచీన మానవ చరిత్రను పరిచయం చేసే పుస్తకాల్లో గార్డెన్ చైల్డ్ రాసిన ఈ పుస్తకాన్ని క్లాసిక్గా పరిగణిస్తారు.
మూడు లక్షల నలభైవేల యేళ్ల నుంచీ, నిప్పును పుట్టించి, రాళ్లను పనిముట్లుగా, ఆయుధాలుగా మలచుకొని మానవులు క్రూరమృగాల నడుమ ఎలా నిలదొక్కుకున్నారో ఈ పుస్తకం తెలియజేస్తుంది.
ఆహారాన్ని ఉత్పత్తి చేయడం, నగరాల నిర్మాణం, రాజ్యం పుట్టుక, సదూర ప్రాంతాలలో వర్తకం, నగర విప్లవం వంటి దశలూ, మలుపులూ ఎలా వచ్చాయో వివరిస్తుంది ఈ పుస్తకం.
ప్రొఫెసర్ గార్డన్ చైల్డ్ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జన్మించారు. ప్రాక్ పురాతత్వ చరిత్ర శాస్త్రజ్ఞుడైన ఈయన అనేక ప్రముఖ పుస్తకాలను రచించారు.
వాటిలో చరిత్రలో ఏం జరిగింది?, ఉదయించిన ఐరోపా నాగరికత, అతిప్రాచీన తూర్పు నాగరికత, సామాజిక పరిణామం అనేవి ప్రముఖమైనవి.
ఈ పుస్తక అనువాదకులైన హెచ్చార్కె తెలుగు పాఠకులకు కవిగా, రచయితగా, పత్రికా విలేఖరిగా సుపరిచితులు. స్వయంగా అనేక రచనలు చేయడంతో పాటు ఎన్నో ఇతర పుస్తకాలను తెలుగులోకి అనువదించారు.
మానవుడే చరిత్ర నిర్మాత
- గర్డన్ చైల్డ్
తెలుగు అనువాదం: హెచ్చార్కె
169 పేజీలు, వెల: రూ.50
No comments:
Post a Comment