
భగవద్గీత చారిత్రిక పరిణామం పుస్తకాన్ని ప్రవీణ్ శర్మ గారు తన బ్లాగు "సాహిత్య అవలోకనం" లో సమీక్షించారు. మాబ్లాగు సందర్శకులకు సదా అందుబాటులో ఉండేలా ఆ సమీక్షను ఇక్కడ తిరిగి పొందుపరుస్తున్నాము. ఈ మెయిల్ ద్వారా స్వయంగా ఈ సమీక్ష గురించి మాకు తెలియజేసిన ప్రవీణ్ శర్మ గారికి ధన్యవాదాలు. ఇదే విధంగా ఎవరైనా తమ బ్లాగుల్లో మా పుస్తకాలను సమీక్షించి నప్పుడు దయచేసి మాకు తెలుపవలసినదిగా కోరుతున్నాము.
భగవద్గీత చారిత్రిక పరిణామం
వేదాలు వ్రాస్తున్న కాలంలో హిందువులు ఇంద్రుడిని ప్రధాన దేవుడిగా పూజించారు.
సంస్కృత బాషలో ఇంద్ర అంటే రాజు అని అర్థం. ఇంద్రుడు ఆర్యులకి రాజు.
విష్ణువుకి నారాయణుడు అని ఇంకో పేరు ఉంది.
నారాయణ అనే పదం సంస్కృత పదం కాదు. అది సింధు లోయ నాగరికత కాలంలో వాడిన బాష పదం. నారాయణ అంటే నీటి మీద నివాసం ఉండేవాడు అని అర్థం. నారా అంటే నీరు. ఆయణ అంటే నివాసం. విష్ణువు నీటి మీద పాము మీద పడుకుంటున్నట్టు హిందూ పురాణాలలో కథలు ఉన్నాయి.
మెసోపొటేమియా (ఇరాక్) నాగరికతలో కూడా నీటి పైన ఇంటిలో నివసించే దేవుడి కథ ఉంది. అప్పట్లో ప్రజలకి వ్యవసాయమే ప్రాధాన జీవనాధారం. ప్రజలు ఎక్కువగా నదీ తీర ప్రాంతాలలో నివసించేవారు కనుక ప్రజలు నీటి పై నివసించే దేవుడి గురించి కథలు అల్లుకోవడం సహజం.
కృష్ణ అంటే నల్లని వాడు అని అర్థం. మహాభారతం, శ్రీమత్భాగవతం, భగవత్ గీత వ్రాయకముందు ద్రవిడులు (నల్లని వారు) మాత్రమే కృష్ణుడిని పూజించేవారు. వేదాలలో కృష్ణుడికీ, ఇంద్రుడికీ మధ్య యుద్ధాలు జరిగినట్టు కథలు ఉన్నాయి.
హిందూ మతం ఒకప్పుడు ఆర్యుల మతంగా ఉండేది. హిందూ మతాన్ని ద్రవిడులకి కూడా వర్తింపచెయ్యాలంటే ఇంద్రుడి ప్రాధాన్యం తగ్గించాలి. నల్లని దేవుడైన కృష్ణుడి ప్రాధాన్యం పెంచాలి.
అప్పట్లో ప్రజలలో ఆత్మ పరకాయ ప్రవేశం పై అనేక కథలు ఉండేవి. ఆత్మ పరకాయ ప్రవేశం కథలు ఆధారంగా దశావతారాల కథలు వ్రాయడం జరిగింది.
భగవత్ గీత ఆత్మవాదాన్ని ఎక్కువగా ప్రబోధిస్తుంది. ప్రజలకి మరణానంతర మోక్షం, పునర్జన్మ లాంటి వాటి పై విశ్వాసం కలిగించడానికే భగవత్ గీత వ్రాయడం జరిగిందని అర్థమవుతోంది.
ఈ వ్యాసాన్ని కొశాంబి గారు 1959లో ఇంక్వైరీ పత్రికలో వ్రాసారు. 1985లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు దీన్ని తెలుగులోకి అనువదించి పుస్తక రూపంలో ప్రచురించారు.
..................................
..
No comments:
Post a Comment