
ఎవరో వచ్చి తమను ఏదో ఉద్ధరిస్తారనే పగటి కలలకు దూరంగా - సుఖదుఃఖాలను పెనవేసుకుని, ఆప్యాయం అనురాగంతో ఒకరి కొకరు తోడుగా నీడగా బతుకంతా సాగించే దళితుల, నిరుపేదల బతుకుల ప్రతిబింబింబం ఈ 'బతుకంతా...' కథ.
అష్టకష్టాలతో జీవనం సాగిస్తూ అర్థాకలితో అ లమటిస్తూ బతుకు బండిలాగే నిరుపేద కుటుంబాలు సాంఘికంగా ఏ స్థితికి నెట్టబడ్డాయో సజీవంగా చిత్రిస్తూ, వారిపై ''పైవారి'' దౌష్ట్యం ఏవిధంగా సాగుతోందో తెలియజేస్తుంది మనకీ కథ.
దేవనూర మహదేవ కర్ణాటక ప్రాంతంలో సుపరిచితులైన ప్రఖ్యాత దళిత రచయిత. ''వ్యాపనూర్ కథలు'' ఈయన మొదటి కథా సంకలనం. ''ఒడళాల'' (బతుకంతా ...) రెండవ రచన.
ప్రఖ్యాత సాహితీ విమర్శకుడు, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత స్వర్గీయ వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు ఈ కథను తెలుగులోకి అనువదించారు.
బతుకంతా ...
రచన: దేవనూర మహదేవ
కన్నడ మూలం: ఒడళాల
తెలుగు అనువాదం : వల్లంపాటి వెంకటసుబ్బయ్య
ముఖచిత్రం : సూరిబాబు
ప్రథమ ముద్రణ : 1984
ద్వితీయ ముద్రణ : 2000
24 పేజీలు, వెల : రూ.7
.......
No comments:
Post a Comment