Saturday, April 25, 2009

పురాణాలకూ, కులవ్యవస్థకూ, దశావతారాలకూ మధ్య వున్న సంబంధం - డాక్టర్ విజయ భారతి గారి విశ్లేషణ


పురాణాలు - కుల వ్యవస్థ - 2
దశావతారాలు


''పరిత్రాణాయ సాధూనాం
వినాశాయచ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ
సంభవామి యుగేయుగే''


'సాధువులను రక్షించి, దుష్కర్ములను నశింపజేయటానికి , ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలోనూ పుడుతున్నాను'.

భిన్న యుగాలలోని అవతార మూర్తుల కథలనూ వారి చుట్టూ అ ల్లిన భావజాలాన్నీ పరిశీలిస్తే వర్ణవ్యవస్థ విధించే ఆంక్షలను పటిష్టంగా సామాన్యుని జీవితంలో చొప్పించడానికే ఈ ప్రయత్నమంతా జరిగిందని అర్థమవుతుంది.

ధర్మసంస్థాపనం అంటే వర్ణ ధర్మ సంస్థాపనమే!

''మత్స్య కూర్మో వరాహశ్చ నరసింహో థ వామనః
రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధః కల్కీ చతేదశ''


హిందూ మతంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలవారు మాత్రమే చదువు నేర్చుకోవచ్చు, వేదాలను చదవవచ్చు. మళ్లీ అందులో బ్రాహ్మణులకు మాత్రమే వేదాలను బోధించే అధికారం వుంటుంది.

శూద్రుల విషయానికి వస్తే వాళ్లు వేదాలను చదవడమే కాదు. ఎవరైనా చదువుతుంటే వినడానికి కూడా వీలు లేదు. దొంగచాటుగా ఏ శూద్రుడైనా విన్నాడంటే వాడి చెవుల్లో సీసం కరిగించిపోయాలి, వాణ్ణి భౌతికంగా చంపేయాలి అంటుంది మనుధర్మం!!

ఒకసారి బ్రహ్మ నిద్రలో వేదాలను పలవరిస్తుండగా హయగ్రీవుడనే దైత్య భటుడు విన్నాడట.
విని వేదాలను నేర్చుకున్నాడు. (అప్పుడు ఏదైనా విని నేర్చుకోవడమే కదా). ఆ తర్వాత అతనికి భయం పట్టుకుంది. ఆ సంగతి తెలిస్తే సురులు (అగ్రవర్ణాల వారు) తనని ప్రాణాలతో బతకనివ్వరు. అని గజగజ వణికిపోతూ సముద్రంలో దూకి (రసాతలంలో) దాక్కున్నాడు.

……''ఇట్లు వేదంబులు దొంగిలి దొంగ రక్కసుండు మున్నీట మునింగిన వారి జయింపవలసియు మ్రానుదీగెల యందు విత్తనంబుల పొత్తరులు పెన్నీట నాని చెడకుండ మనుపవలసియ నెల్ల కార్యంబులకు గావలియగు నా పురుషోత్తముండప్పెను రేయి చొరుదలయంచు...'' (భాగవతం)

హయగ్రీవుడు భయపడినంతా అయింది.
ఎవరో చూడనే చూశారు. చూసి
'అమ్మో... హయగ్రీవుడు వినడమే కాదు తనవాళ్లకి నేర్పించేస్తాడు.
క్రమంగా వేదాలు అసురులందరికీ (శూద్రులందరికీ) చేరతాయి.' అని బెంబేలెత్తిపోయారు.
హాహాకారాలు చేస్తూ ఆ వార్తని నారాయణుడి చెవిలో వేశారు సురులు.
అంతే. ఆయన మరి ఆలస్యం చేయకుండా మత్స్యావతారం (చేప రూపం) దాల్చి సముద్ర గర్భంలోకి వెళ్లి హయగ్రీవుడిని సంహరించేశాడు. సంభవామి యుగేయుగే ప్రారంభం…..
ఇది “మత్స్యావతారం” కథ.

అట్లాగే “కూర్మావతారం” (తాబేలు రూపం)లో అసురులతో చేతులు కలిపి సాగర మథనం చేసి అమృతం సాధించి అసురులను వంచించి సురులే దానిని చేజిక్కించుకున్నారు. ఎంత ధర్మాత్ములో సురులు.

ఇక “వరహావతారం” (పంది రూపం)లో భూ ఆక్రమణ వ్యవహారం,.... “నృసింహావతారం” (సగం మనిషి సగం జంతువు రూపం)లో వైష్ణవాన్ని కాదన్నవారిని చీల్చిచెండాడటం ... “వామనావతారం” (మరుగుజ్జు రూపం) లో - అసురులు ఎంత మంచివారైనా, ఎంత సమర్థులైనా వారిని రాజ్యాధికారం చేయన్వికూడదు అన్న కుతంత్రం కనిపిస్తుంది.

“పరశురామావతారం” ఈ భూమి మొత్తం బ్రాహ్మణుల అధీనంలోనిదేననీ, క్షత్రియులు బ్రాహ్మల అధికారానికి లోబడి వుండాలని చాటుతుంది. “రామావతారం” క్ష్రత్రియులకూ బ్రాహ్మణులకూ మధ్య రాజీ కుదిర్చి వర్ణధర్మాన్ని పటిష్ట పరుస్తుంది. “కృష్ణావతారం” శూద్ర కులాలు విద్యా రాజకీయ రంగాలలో ఎదగటం, వారిని అణచే ప్రయత్నాలు, కర్మసిద్దాంతం ... గీతా రహస్యం.

ఇక “బుద్ధావతారం” వైదిక కర్మకాండకు వ్యతిరేకంగా ప్రబలుతున్న ఉద్యమాలను అణచలేక బుద్ధుడూ విష్ణువు అవతారమే అని ప్రజలను తప్పుదారి పట్టించే కుట్ర. కాగా ''కల్కి'' అవతారం ఇంకా అవతరించాల్సి వుంది. (ఇప్పటికే అక్కడా ఇక్కడా నేనే కల్కి అవతారాన్ని అని కొందరు చాటుకుంటున్నా వారు సర్వామోదాన్ని మాత్రం పొందలేకపోతున్నారు).

దశావతారాలు సామాజిక నియంత్రణ విధానాల అమలుకు ఉద్దేశించినవే అంటూ డా. విజయ భారతి గారు ఈ పుస్తకంలో విశ్లేషిస్తున్నారు.
………………………………………………………………………….

''జన సామాన్యాన్ని విద్యావంతులను చేయటంలో వైఫల్యానికి
ప్రాచీన ప్రపంచాన్ని మొత్తంగా తప్పుపట్టవచ్చు.
కానీ ఏ సమాజం కూడా దాని మతానికి సంబంధించిన గ్రంథాలను
ఆ సమాజంలోని ప్రజలు చదవకుండా చేసే నేరానికి పాల్పడలేదు.
సామాన్యుడు జ్ఞాన సముపార్జన చేయటం అనేది శిక్షించదగిన నేరం
అని ప్రకటించడానికి ప్రయత్నించిన సమాజం ఏదీ లేదు.
హిందూ మతానికే ఆ కీర్తి దక్కుతుంది.
చదవటం, రాయటం అనేవి అగ్రవర్యాల వారి హక్కుగానూ,
నిరక్షరాస్యత నిమ్న కులాల వారి తలరాతగానూ
మనుధర్మ సూత్రాలు నిర్దేశించాయి.''
-బాబా సాహెబ్‌ భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌

………………………………………………………………………….


డాక్టర్‌ విజయభారతి గారు తెలుగు అకాడమీ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు. వారు అనేక పుస్తకాలు రచించారు. వాటిలో అంబేడ్కర్‌, ఫూలే రచనలు ప్రముఖమైనవి. లోగడ వీరు రచించిన ''వ్యవస్థను కాపాడిన రాముడు'', ''షట్చక్రవర్తులు'' పుస్తకాలను ఈ బ్లాగులో పరిచయం చేయడం జరిగింది.




పురాణాలు కుల వ్యవస్థ - 2 ''దశావతారాలు''
- డాక్టర్‌ విజయ భారతి

76 పేజీలు, వెల: రూ.25



ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500085
ఫోన్‌ నెం. 040 - 2352 1849

ఇ మెయిల్‌:
hyderabadbooktrust@gmail.com

4 comments:

  1. వింటుంటే చదవాల్సిన పుస్తకంలా ఉందే! చదువుతాను.

    ReplyDelete
  2. "అసురులు" అ౦టే "రాక్షసులు" అని అర్థ౦. "శూద్రులు" అని నేను ఎప్పుడూ వినలేదు. మేరు చెప్పినదాన్ని బట్టి శూద్రు౦దరూ రాక్షసులు అని అర్థ౦ వస్తు౦ది. దీనికి మీ వివరన ఏమిటి? దయచేసి మీ ఇష్ట౦ వచ్చిన అర్థ౦తో వ్రాసి విద్వేశాలను పెన్చక౦డి.

    ReplyDelete
  3. దశావతారాళ్ళో డార్విన్ సిద్దా౦తాన్ని వెతికినవారిని చూశాను కానీ ఇలా కులతత్వాన్ని వెతికిన వారిని చూడట౦ ఇదే మొదటిసారి. విజయభారతి గారి నూతన కోనానికి వ౦దనాలు.

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌