ఏప్రిల్ 26 ఈనాడు ఆదివారం సంచికలో ఇట్లు ఒక రైతు పై వెలువడిన సమీక్ష:
ఒక రైతు కథ
"నాగలి పట్టిన ప్రతి రైతూ నా కళ్ళకు శిలువ మోస్తున్న జీసస్ లాగే కనిపిస్తాడు " అంటాడు శేషేంద్ర .
నిజమే.
దేశ ప్రజల ఆకలి శిలువ భారమంతా రైతన్నే మోస్తున్నాడు.
అయినా అతని శ్రమకు గుర్తింపు లేదు.
పంటకు గిట్టుబాటు ధర లేదు.
వ్యవసాయమంటేనే దండగ వ్యవహారం అన్నంత అపప్రద వచ్చింది.
దాన్ని పోగొట్టడానికే అన్నట్టు ఉన్నత విద్యావంతుడైన నరేంద్ర నాథ్ లక్షణమైన ఉద్యోగాన్ని వదులుకుని
సొంతూరుకి చేరుకున్నాడు.
అక్కడినుంచి మొదలవుతాయి ఆ రైతు ప్రయోగాలు.
ఆ అనుభవ సారాన్నంతా రంగరించి
ఇట్లు ఒక రైతు
అంటూ ఆత్మీయ శైలిలో చెప్పుకున్నారు.
..................
No comments:
Post a Comment