Monday, August 24, 2009

2009 ఎన్నికలు ప్రాంతీయ, బడుగు పార్టీలకు హెచ్చరిక - టంకశాల అశోక్‌ ...


2009 లో జరిగిన 15వ లోకసభ ఎన్నికలు దేశ రాజకీయాలను కొత్త మలుపు తిప్పనున్నాయా?

కాంగ్రేస్‌ పార్టీ తాను సైతం ఊహించని విధంగా పుంజుకుంది.
బిజెపి ఎవరూ అనుకోనట్లు దెబ్బతిన్నది.
వామపక్షాలు తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొన్నాయి.
ప్రాంతీయ పార్టీలు, బడుగు వర్గాల పార్టీలలో కొన్ని బలపడగా, కొన్ని పరాజయం పాలయ్యాయి.

దేశం మొత్తం మీద బేరీజు వేసినప్పుడు సెంట్రలిస్ట్‌ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీల ఉమ్మడి సీట్లు పెరిగాయి. కానీ ఉమ్మడి ఓట్ల శాతం
తగ్గింది.
వామపక్షాల సీట్లూ ఓట్లూ కూడా పడిపోయాయి.
ప్రాంతీయ పార్టీలు, బడుగు పార్టీల ఉమ్మడి సీట్లు పెరిగాయి, ఓట్ల శాతంలో తేడా లేదు.

ఈ పుస్తకంలోని ప్రధానాంశం సెంట్రలిస్టు పార్టీలను, ప్రాంతీయ, బడుగు పార్టీలను ప్రస్తుత ఎన్నికల సందర్భంగా పోల్చి చూడటం.
ఆ విధంగా పరిశీలించినపుడు సెంట్రలిస్టులకు సీట్లు పెరిగినా ఓట్లు తగ్గటం, ఫెడరలిస్టులు - బడుగులకు సీట్లు కొద్దిగా పెరిగి ఓట్లు

తగ్గక పోవటాన్ని బట్టి, ఉభయ శిబిరాల బలాబలాలలో పెద్ద మార్పులు లేనట్లు కనిపిస్తుంది.
కానీ ఈ అంకెల ఫిజిక్సును పక్కన ఉంచి రాజకీయ వాతావరణపు కెమిస్ట్రీలోకి వెళ్లి చూస్తే, ప్రజల ఆలోచనలో కొత్త మార్పు
వస్తున్నదేమోననే సందేహం కలగకమానదు.

- టంకశాల అశోక్‌ (ముందుమాట అర్థ శోధన నుంచి)

2009 ఎన్నికల సందర్భంగా వార్త దినపత్రిక సంపాదకులు టంకశాల అశోక్‌ రాసిన వివిధ వ్యాసాల, సంపాదకీయాల
సంకలనమే ఈ పుస్తకం.

ఇందులోని శీర్షికలు:

1) అర్థ శోధన 2) ఫెడరలిస్ట్‌ బడుగు పార్టీలకు మేల్కొలుపు 3) సెంట్రలిస్ట్‌ పార్టీలు మళ్లీ పుంజుకుంటే 4) మళ్లీ సుస్థిరత దిశగా
5) జాతీయ పార్టీలకు ఎందుకీ దుస్థితి 6) ఫెడరల్‌ డార్వినిజం 7) మార్గం మూసుకున్న బీజేపీ 8) వామపక్షాల స్వయంకృతం
9) చేతులు కాలిన లెఫ్ట్‌ 10) పల్లకీ బోయీలు కాదా? 11) పరణితి లేని మాయావతి 12) కూటమి బలమైనదే కానీ 13)
కూటమి వైరుధ్యాలు 14) ప్రాంతీయ పార్టీల రుగ్మతలు 15) తెలుగుదేశం అర్థ సమీక్ష 16) కేసీఆర్‌కు తగని ధోరణి 17) లెఫ్ట్‌
స్వయంకృతం 18) మాయావతి ఇందిరాగాంధీ కూతురా? 19) నగదు బదిలీ కొట్టివేయదగ్గదేం కాదు 20) మనకు తెలియని
ఒక రహస్యం 21) చంద్రబాబు పొరపాటు 22) స్థానికేతరులపై వ్యతిరేకత ఎందుకు?

టంకశాల అశోక్‌ గురించి ...

స్వగ్రామం మడిగొండ, వరంగల్‌ జిల్లా.
హైదరాబాద్‌, ఢిల్లీలలో చరిత్ర, రాజకీయ శాస్త్రం, అంతర్జాతీయ వ్యవహరాల్లో విద్యాభ్యాసం.
వార్తలు రాయటం ఆరంభించింది 1966 వరంగల్‌ జిల్లా వారపత్రిక జనధర్మకు.
అదే పత్రికలో 1967-72 మధ్య పూర్తిస్థాయి పని.

1972 నుంచి 77 వరకు ఆధ్ర జనత , నవ్యాంధ్ర ఈనాడు, ఆంధ్రభూమి దినపత్రికలలో హైదరాబాద్‌లో ఉద్యోగాలు, 1979-
80లో ఆంధ్రప్రభకు ఢిల్లీ నుండి అంతర్జాతీయ వ్యవహారాల కాలమిస్ట్‌. 1984-94 నుండి 96 వరకు హైదరాబాద్‌లో అసిస్టెట్‌
ఎడిటర్‌. తర్వాత వార్త దినపత్రికలో ఉద్యోగం. 2002 వరకు అసిస్టెంట్‌ ఎడిటర్‌ తర్వాత నుండి ఎడిటర్‌.
పంజాబ్‌, కాశ్మీర్‌, కార్గిల్‌ యుద్ధం, శ్రీలంక, ఉత్తర భారత రాష్ట్రాల ఎన్నికలు, పాకిస్థాన్‌, ఇరాన్‌లపై ఆయా ప్రాంతాల నుంచి
ప్రత్యేక రిపోర్టింగ్‌లు.

ఎబికెతో కలిసి నాలుగు సంపాదకీయ సంపుటాల ప్రచురణ.
సముద్రం, ఒబామా జీవితం-ఆలోచనలు, ఒక జర్నలిస్టు ఆత్మవిమర్శ, తెలంగాణ రచనల సంకలనం-వివేచన ఇతర ప్రధానమైన
ప్రచురణలు.



2009 ఎన్నికలు ప్రాంతీయ, బడుగు పార్టీలకు హెచ్చరిక
- టంకశాల అశోక్‌


అట్టమీద బొమ్మలు : శంకర్‌
కవర్‌ డిజైన్‌ : రమణ జీవీ
ధర : రూ. 40
తొలి ముద్రణ : జూలై, 2009

ప్రతులకు, వివరాలకు :

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500067
ఫోన్‌ ; 23521849

EMAIL : hyderabadbooktrust@gmail.com

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌