
ఏప్రిల్ 14న సాయంత్రం 6 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్లింగంపల్లి, హైదరాబాద్లో జార్జిరెడ్డి 40వ వర్ధంతి సభ
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో జార్జిరెడ్డి హత్య జరిగి 40 సంవత్సరాలైంది. జార్జిరెడ్డి సైన్స్ కాలేజీలో రీసెర్చ్ స్కాలర్గా గోల్డ్ మెడల్ సాధించిన అత్యున్నత ప్రతిభాశాలి. ఉస్మానియా యూనివర్సిటీలో విప్లవ వామపక్ష విద్యార్థి ఉద్యమాలకు పునాదులు వేసిన మూలపురుషుడు. ఆనాటి ''జీనాహైతో మర్నా సీఖో- ఖదం ఖదం పర్ లడ్నా సీఖో'' నినాదం అగ్గిరవ్వగా మారి అనేక విద్యార్థి ఉద్యమాలను వెలిగించింది.
ఆ యువనేతను స్మరించుకోడానికి, ఆనాటి వాతావరణాన్ని మనముందుంచడానికి, ఆయనతో కలిసి మెలిగిన మిత్రులు ఈ సభలో ఆయన విశిష్ట వ్యక్తిత్వాన్ని వివరిస్తారు.
- జార్జి మిత్రులు
No comments:
Post a Comment