Monday, October 24, 2011

మతాలపై వైజ్ఞానిక విశ్లేషణ


... మత విశ్వాస పరిణామాలను వైజ్ఞానికంగా విశ్లేషించిన వ్యాసాల కూర్పు ఇది. ప్రకృతి శక్తులకు తలొగ్గి దినదినగండంగా బతికిన ఆదిమానవులకు మత భావనలు మంచే చేశాయి. వారి మధ్య ఐకమత్యం పెంచి సామూహిక పద్ధతిలో ఆశావాద దృక్పథాన్ని కలిగించాయి. అయితే లాభనష్టాలను బేరీజు వేసినప్పుడు మత విశ్వాసాల ద్వారా సమకూరేఉపయూగాలేవీ ఇన్‌హేలర్ల స్థాయిని మించవని రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ విస్పష్టంగా చెబుతారీ పుస్తకంలో! అవి వ్యక్తిగత, సమాజ ఆరోగ్యానికి పట్టిన జలుబును ఎంత మాత్రం తగ్గించవనీ, పైగా 'సైడ్‌ ఎఫెక్ట్స్‌' ప్రమాదకరమైనవనీ వివరిస్తారు. ఈ క్రమంలో సాంస్కృతిక చరిత్రకున్న భిన్న పార్శ్వాలను స్థూలంగా ప్రస్తావిస్తారు రచయిత. ప్రాచీన నాగరికతలూ, దేశధేశాల్లోని విశ్వాసాలూ, అవశేషాల విశేషాల గురించి ఆకట్టుకునే చిత్రాల సాయంతో వివించారు. ఉద్వేగాలకు తావివ్వకుండా, సిద్ధాంతాల ప్రమేయం లేకుండా సాగిన ఈ వ్యాసాల శైలి సులభంగా, సూడిగా ఉండి ఆసక్తికరంగా చదివిస్తుంది.
- వేణు (ఈనాడు ఆదివారం 23 అక్టోబర్‌ 2011 సౌజన్యంతో)

మనుషులు చేసిన దేవుళ్లు

రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌


పేజీలు: 196; వెల: రూ. 100/-
ప్రతులకు :
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌

ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,

గుడి మల్కాపూర్‌, హైదరాబాద్‌ 500 ౦౬౭

...

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌