Saturday, August 14, 2010

కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక బహుమతుల ప్రదానోత్సవం ఆగస్టు 20న గోవాలో!

కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక బహుమతుల ప్రదానోత్సవం ఆగస్టు 20న గోవాలో!

2009 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ముందు అనుకున్నట్టు కొత్త ఢిల్లీలో కాకుండా గోవాలో ఈ నెల 20న (శుక్రవారం సా.5.30కి) నిర్వహిస్తున్నారు.

దీనానాథ్‌ మంగేష్కర్‌ కళా మందిర్‌, కాంపాల్‌, పానాజీలో - సాహిత్య అకాడమీ చైర్మన్‌ సునీల్‌ గంగోపాధ్యాయ అధ్యక్షతన జరిగే ఈ సభకు - ప్రఖ్యాత మళయాళీ రచయిత ఎం.టి.వాసుదేవన్‌ నాయర్‌ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. సాహిత్య అకాడమీ కార్యదర్శి అగ్రహార కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు సుతీందర్‌ సింగ్‌ నూర్‌ ప్రభృతులు సభలో పాల్గొంటున్నారు.

మొత్తం 24 భాషల్లో ఒక్కో భాషనుంచి ఎంపిక చేసిన ఒక్కొకరికి చొప్పున ఇరవైనలుగురు అనువాదకులకు బహుమతులు అందిస్తారు.
ఆ భాషలు: అస్సామీస్‌, బెంగాలీ, బోడో, డోగ్రీ, ఇంగ్లీష్‌, గుజరాతీ, హిందీ, కనడ, కశ్మీరీ, కొంకణి, మైథిలీ, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, రాజస్థానీ, సంస్కృతం, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ.

తెలుగు నుంచి ఈ అవార్డుకు ప్రభాకర్‌ మందార ఎంపికైన విషయం విదితమే.
డా.యాగాటి చిన్నారావు సిద్ధాంత గ్రంథం ''దళిత్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఐడెంటిటీ'' ని ''ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర''పేరిట చేసిన అనువాదానికి గాను ఈ అవార్డు దక్కింది.

ఈ పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించింది.

1 comment:

  1. Hi
    welcome to my blog
    gsystime.blogspot.com
    Read for Universal knowledge and spiritual information
    Thanks
    Nagaraju

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌