Wednesday, July 29, 2015

చరిత్ర రచనపై బాలగోపాల్‌

చరిత్ర రచనపై

బాలగోపాల్‌


బాలగోపాల్‌ రాసిన 'ప్రాచీన భారతదేశ చరిత్ర : డి.డి. కోశాంబి పరిచయం' తెలుగు పాఠకులకు సుపరిచితమే. 1986 నుండి ఎన్నో పునర్ముద్రణలు పొందింది  ఆ పుస్తకం. దానికి ముందు, తర్వాత చరిత్రపై బాలగోపాల్‌ రాసిన  పది వ్యాసాలను కలిపి ఇప్పుడు మరో పుస్తకం తీసుకొస్తున్నాం. 


ఇందులో సగం వ్యాసాలు వివిధ పుస్తకాలపై సమీక్షలుగా రాసినవి. రెండు నేరుగా బుక్‌లెట్స్‌ రూపంలో వచ్చినవి.

ఒకటి హిస్టరీ కాంగ్రెస్‌లో ఆధునిక ఆంధ్రదేశ చరిత్రపై ఇచ్చిన అధ్యక్షోపన్యాసం. పాతికేళ్ళలో (1981-2007) అక్కడక్కడా వచ్చిన ఈ వ్యాసాలు 'చరిత్ర' కంటే చరిత్ర రచనా పద్ధతిని ఎక్కువగా చర్చించినందువల్ల ('భారత కార్మిక ఉద్యమ చరిత్ర' వ్యాసం మినహా) ఈ పుస్తకానికి దాన్నే శీర్షికగా పెట్టాం.

    ఈ వ్యాసాలలో కనీసం రెండు మూడు శతాబ్దాలకు చెందిన అనేక పేర్లు, సంఘటనల ప్రస్తావన ఉన్నందువల్ల పాఠకుల సౌలభ్యం కోసం ఫుట్‌నోట్లు ఇచ్చాం. ఎంత ప్రయత్నించినా కొందరి గురించి, కొన్నిటి గురించి పూర్తి సమాచారం దొరకలేదు. ఎవరైనా ఇవ్వగలిగితే తర్వాతి ముద్రణలో చేరుస్తాం. ఈ విషయంలో ఇంకేమైనా లోటుపాట్లు ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి సవరించుకుంటాం. 


మన్నం బ్రహ్మయ్య, వేమన వసంతలక్ష్మి చేసిన ఈ పనిలో స్వాతి వడ్లమూడి, చిట్టిబాబు పడవల, జిలుకర శ్రీనివాస్‌,  మోతుకూరు నరహరి సహకారం కూడా ఉంది. వారందరికీ కృతజ్ఞతలు.

- హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌




చరిత్ర రచనపై బాలగోపాల్‌

227 పేజీలు  

ధర   :    రూ. 130/-

తొలి ముద్రణ    :    జూలై 2015

కవర్‌ డిజైన్‌    :     అనంత్‌   

ప్రతులకు, వివరాలకు    :   

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ,  ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,  గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006.        
ఫోన్‌ : 040- 23521849
ఇ మెయిల్ ఐడి : hyderabadbooktrust@gmail.com



   

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌