Sunday, August 19, 2012

మనం మరచిన రచయిత్రి .... డా. ద్వా.నా.శాస్త్రి (ఈనాడు) ...

మారేపల్లి రామచంద్రశాస్త్రి, 
కుసుమ ధర్మాన్న, 
ముంగిపూడి వెంకటశర్మ వంటి భాషాసాహితీ కృషీవలులు చరిత్రలో కనుమరుగయ్యారు.

తొలి యక్షగాన కవయిత్రిగా చెప్పబడే 
దార్ల సుందరీమణి తదితరులు ఎవరికీ పట్టనివారైపోయారు.

ఎవరో వస్తారు ... అన్నట్టుగానే భండారు అచ్చమాంబను వెలుగులోకి తీసుకురావడానికి 
కొండవీటి సత్యవతి పూనుకున్నారు. 
తొలి కధా రచయిత్రి, తొలి సంఘసంస్కర్త అచ్చమాంబను అర్ధంచేసుకోడానికి తోడ్పడుతుందీ పుస్తకం.

నిజానికిది అచ్చమైన పరిశోధన గ్రంధం. 

గురజాడ కంటే ముందుగానే కథలు రాయడం, 
1902 లోనే స్త్రీ చైతన్యం కోసం వ్యాసాలూ రాయడం, 
అప్పుడే స్త్రీల సమాజం స్థాపించడం వంటి గొప్ప విషయాలను పుస్తకం వెలుగులోకి తెచ్చింది.

భండారు అచ్చమాంబ - సచ్చరిత

రచన: కొండవీటి సత్యవతి
పేజీలు : 92 , వేల : రూ. 50 
 
ప్రతులకు: 
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
85 - బాలాజీ నగర్ , గుడి మల్కాపూర్
హైదరాబాద్ 500 006

- డా.  ద్వా.నా.శాస్త్రి

(ఈనాడు ఆదివారం 19-8-2012 సౌజన్యం తో)

భండారు  అచ్చమాంబ "ఈ పుస్తకం " కోసం ఇక్కడ క్లిక్ చేయండి :

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌