
బెంగాలీ నవలల అనువాదాలు రెండుమూడు దశాబ్దాల పాటు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి, మధ్యతరగతి జీవుల్లో పఠనాభిలాషను పెంపొందించాయి.
శరత్ నవలలైతే తెలుగువారికి ఎంత హృదయగతమయ్యాయో చెప్పనవసరమే లేదు.
బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ వంటి బెంగాలీ రచయితలు తెలుగు పాఠకులకు పరిచయమైంది అప్పుడే.
ఆయన రాసిన ''అరణ్యన్'' గిరిజన జీవితాల లోతుల్లోకి వెడుతూ ప్రకృతితో మమేకమై అరణ్య ప్రాంతాల స్థితిగతులతో మమేకం చేస్తుంది.
బెంగాలీలో 1938లోనే ముద్రితమైన ఈ నవలను ''వనవాసి'' పేరుతో సూరంపూడి సీతారాం అనువదించారు.
1961లో సాహిత్య అకాడమీ తొలి అనువాదాన్ని వెలువరించింది.
దాదాపు యాభై ఏళ్ల తర్వాత హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పునర్ముద్రించింది.
- ఈనాడు ఆదివారం 09 జనవరి 2010 సౌజన్యంతో
వనవాసి
బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ
తెలుగు అనువాదం: సూరంపూడి సీతారాం
తొలి ముద్రణ: అద్దేపల్లి అండ్ కో, రాజమండ్రి; సాహిత్య అకాడెమీ, న్యూఢిల్లీ తరఫున,1961
హెచ్బిటి ముద్రణ: సెప్టెంబర్ 2009
278 పేజీలు, వెల: రూ.120
ప్రతులకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్, గుడిమల్కాపూర్,
హైదరాబాద్-500067
ఫోన్: 040 2352 1849
ఇమెయిల్: hyderabadbooktrust@gmail.com
No comments:
Post a Comment