Saturday, April 25, 2015

Release of the ICDS Book “UDAKANI METHUKU” On the 26th April 2015 at 10 AM at the St. Ann’s Generalate, Tarnaka, Secunderabad.



INVITATION

THE HYDERABAD BOOK TRUST, HYDERABAD
and
THE ANDHRA PRADESH SOCIAL SERVICE SOCIETY, SECUNDERABAD

Invite you to the Release of the ICDS Book  
“UDAKANI METHUKU”
BY
Dr. Pushpa M. Bhargava
Eminent Scientist and Founder-Director, the CCMB, Hyderabad
Authored by
K.R. Venugopal
Former Secretary to the Prime Minister

On the 26th April 2015 at 10 AM at the St. Ann’s Generalate, Tarnaka, Secunderabad.

Shri Suresh Chanda IAS
Principal Secretary, Health, Medical and Family Welfare Department, Government of Telangana
will preside over the function.
(Programme overleaf)
1. Welcome by K.R. Venugopal
2. Address by Prof. Shantha Sinha, former Chairperson, National Commission for Protection of Child
Rights and Trustee, Hyderabad Book Trust.
3. Address by Father Raymond Ambroise, Founder, Andhra Pradesh Social Service Society, Secunderabad.
4. Observations by Shri K. Madhava Rao IAS (RETD), former Chief Secretary, Government of Andhra
Pradesh.
5. Observations by Smt Chaya Ratan IAS (RETD), former Additional Chief Secretary, Government of
Andhra Pradesh.
6. Release of the Book and Keynote address by Dr. Pushpa M. Bhargava, Eminent Scientist and Founder-
Director, the CCMB, Hyderabad.
7. Presidential Address by Shri Suresh Chanda IAS, Principal Secretary, Health, Medical and Family
Welfare Department, Government of Telangana.
8. Vote of Thanks by Father Thomas Pallithanam, Director, People’s Action For Rural Awakening.

PROGRAMME
10 AM TO 11-45 AM
Tea 11-45 AM to 12 Noon

SEMINAR on “How to Restructure and Enhance the ICDS Programme?” - 12 noon to 5 p.m.
Chairperson:

Smt. Chaya Ratan IAS (RETD)

Lunch 1-30 PM to 2-00 PM Tea 3-45 PM to 4 PM.
Former Additional Chief Secretary, Government of Andhra Pradesh



 

మట్టికి దూరమైన మనందరి కథ

మట్టికి దూరమైన మనందరి కథ
మరల సేద్యానికి - జి ఆర్ మహర్షి సమీక్ష (సాక్షి 25 మే 2015)


తల్లి మనల్ని భూమ్మీదకి తెస్తే ఆ భూమి తల్లిలా మనల్ని తనలోకి తీసుకుంటుంది.
భూమంటే మనకి ఇష్టం.
మనమంటే భూమికి ఇష్టం.
అందుకే అది నిరంతరం మనల్ని స్పర్శిస్తూ ఉంటుంది .
...


Wednesday, March 18, 2015

అంగన్‌వాడీ కార్యక్రమంపై అరుదైన పుస్తకం : ''ఉడకని మెతుకు'' - రచన: కె.ఆర్‌.వేణుగోపాల్‌, అనువాదం: రివేరా

ఉడకని మెతుకు
సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసిడిఎస్‌)
(ఒక మునక - ఒక ముందంజ)


భారత ప్రభుత్వం 1975 నుంచి దేశవ్యాప్తంగా నిరుపేద కుటుంబాలకు చెందిన ఆరేళ్ల లోపు చిన్నారులకు ఆరోగ్యం, పోషకాహారం, ప్రాథమిక పూర్వ విద్య తదితర అవసరాలను తీర్చేందుకు అమలు పరుస్తున్న కార్యక్రమం 'ఐ.సి.డి.ఎస్‌.' (ది ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌). సమగ్ర శిశు అభివృద్ధి పథకం అంటే చాలామందికి తెలియకపోవచ్చు కానీ ''అంగన్‌వాడీ కార్యక్రమం'' అంటే అందరికీ అర్థమవుతుంది. తీవ్ర శ్రమ దోపిడీకి గురవుతున్న అంగన్‌ వాడీ కార్యకర్తల ఇటీవలి ఆందోళనల వల్ల ఈ  పథకం గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పథకం అమలు తీరుతెన్నులను, లోటుపాట్లను కె.ఆర్‌.వేణుగోపాల్‌ నిశితంగా పరిశీలించి 'ది ఇంటిగ్రేటెడ్‌ ఛైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌: ఫ్లాగ్‌షిప్‌ ఎడ్రిప్ట్‌ అనే పుస్తకాన్ని వెలువరించారు. దాని తెలుగు అనువాదమే ఈ 'ఉడకని మెతుకు'.
...

'' పేదల జీవితాలతో లోతుగా ముడిపడిపోయిన ఒక పథకం ఏవిధంగా నిర్వీర్యం అవుతున్నదనేది చెప్పేందుకే రచయిత ఈ పుస్తకం రచించారు. ఇలాంటి పరిస్థితులను చూసి ఆగ్రహించకుండా ఉండలేం. ఈ నేపథ్యంలోనే దీనికి కారణమైన వారిని రచయిత ప్రశ్నించారు. వారిని బాధ్యులను చేశారు . దాని ఫలితాలు కనిపంచడం కూడా మొదలయింది. ఐసీడీఎస్‌ కార్యక్రమం అమలును సామాజిక తనిఖీకి గురి చేసినప్పుడు వెలికి వచ్చిన అవకతవకలు కల్గించే ఆగ్రహం నుంచి ఈ పథకాన్ని రచయిత 'ఒక ముందంజ .. ఒక మునక' అని అభివర్ణించారు.''
- ద హిందూ, 27 ఏప్రిల్‌ 2012

''ఐసీడీఎస్‌ కార్యక్రమం ఒకటే కాదు, మొత్తంగా దేశంలోని మానవ వనరుల పరిస్థితిని చూసి ఆందోళన చెందే ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకం.''
- ఫ్రంట్‌లైన్‌, 21 ఏప్రిల్‌- 4 మే, 2012



ఉడకని మెతుకు
సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసిడిఎస్‌)
(ఒక మునక - ఒక ముందంజ)


రచన: కె.ఆర్‌.వేణుగోపాల్‌

ఆంగ్ల మూలం:  The Integrated Child Development Services: Flagship Adrift, First pubglished in English by Konark Publishers Pvt.Ltd., New Delhi in association with the Council for Social Development, New Delhi, 2012

తెలుగు అనువాదం: రివేరా

154 పేజీలు, వెల రూ. 80/-

ఐఎస్‌బిఎన్‌ : 978-81-907377-6-0




Monday, March 9, 2015

'ఇంట్లో ప్రేమ్‌చంద్‌' అనువాదానికి గాను శ్రీమతి ఆర్‌.శాంతసుందరికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక పురస్కారం

'ఇంట్లో ప్రేమ్‌చంద్‌' అనువాదానికి గాను శ్రీమతి ఆర్‌.శాంతసుందరికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక పురస్కారం

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించిన ''ఇంట్లో ప్రేమ్‌చంద్‌'' పుస్తక అనువాదానికి గాను  కేంద్ర సాహిత్య అకాడమీ వారు శ్రీమతి ఆర్‌. శాంతసుందరికి ఈ యేడు అనువాదక అవార్డును ప్రదానం చేయబోతున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.

గత 40 సంవత్సరాలుగా అనువాద ప్రక్రియలో కృషి చేస్తున్న శ్రీమతి ఆర్‌. శాంతసుందరి ఇప్పటివరకు కథ, నవల, కవిత్వం, నాటకం, వ్యక్తిత్వ వికాసం మొదలైన అన్ని ప్రక్రియలలో మొత్తం 68 పుస్తకాలకు అనువాదం చేశారు. 


ఇంగ్లీషు హిందీ భాషల నుంచి తెలుగులోకే కాకుండా అనేక పుస్తకాలను హిందీలోకి అనువదించి తెలుగు సాహిత్యానికి జాతీయ స్థాయి ప్రాచుర్యాన్ని కల్పించారు. అలాంటి అనువాదాల్లో సలీం నవల 'కాలుతున్న పూలతోట', పెద్దింటి అశోక్‌ కుమార్‌ కథలు, ఓల్గా కథలు, డా. కె.శివారెడ్డి 'అంతర్జనం', డా.ఎన్‌.గోపి 'కాలాన్ని నిద్రపోనివ్వను', వరవరావు ఎంపిక చేసిన 51 కవితలు మొదలైనవి వున్నాయి.

ప్రఖ్యాత రచయిత శ్రీ కొడవటిగంటి కుటుంబరావు కుమార్తె అయిన శ్రీమతి ఆర్‌. శాంతసుందరి 1947లో మద్రాసులో జన్మించారు. బిఎ ప్రెసిడెన్సీ కాలేజీలో, ఎంఎ, బిఎడ్‌ దిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసారు. వీరి సోదరుడు శ్రీ కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ రచించిన పలు పుస్తకాలను హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించిన విషయం విదితమే. 


కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారానికి ఎంపికైన ''ఇంట్లో ప్రేమ్‌ చంద్‌'' పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ 2012 సెప్టెంబర్‌లో ప్రచురించింది. అంతకంటే ముందు జనవరి 2009 నుండి జూలై 2012 వరకు భూమిక మాస పత్రికలో సీరియల్ గా వెలువడింది.  ప్రేమ్‌చంద్‌ రచనల గొప్పదనాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఆ మహారచయిత వ్యక్తిత్వం, మానవీయత, విశాల హృదయం గురించి మనకు తెలియని అనేక విషయాలను స్వయంగా ఆయన సతీమణి శివరాణీదేవి ఇందులో అద్భుతంగా ఆవిష్కరించారు. శ్రీమతి ఆర్‌.శాంతసుందరి ఈ పుస్తకాన్ని హిందీ నుంచి సరళమైన తెలుగులోకి అనువదించి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు .

శ్రీమతి ఆర్‌. శాంతసుందరి గతంలో భారతీయ అనువాద్‌ పరిషద్‌, దిల్లీ వారి 'డా.గార్గీ గుప్త్‌ ద్విగాగీష్‌ పురస్కార్‌; నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ దిల్లీ వారి అనువాద పురస్కారం; హైదరాబాద్‌ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారి అనువాద పురస్కారం అందుకున్నారు.

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించిన పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక బహుమతి  లభించడం ఇది రెండో సారి. గతంలో హెచ్‌బిటి ప్రచురించిన డా.యాగాటి చిన్నారావు రచన దళిత్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఐడెంటిటీ (ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర) అనువాదానికి గాను ప్రభాకర్‌ మందారకు ఈ అవార్డు లభించింది.

ఈసందర్భంగా శ్రీమతి ఆర్‌. శాంతసుందరికి హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ శుభాభినందనలు తెలియజేస్తోంది. 




Sunday, March 1, 2015

గ్రామీణ జీవన సౌందర్యం - వేణు (ఈనాడు)

గ్రామీణ జీవన సౌందర్యం 

శివరాం కారంత్ నవల "మరల సేద్యానికి" పై ఈనాడులో వేణు గారు  చేసిన సమీక్ష :
(ఈనాడు ఆదివారం 01 మార్చ్ 2015 సౌజన్యంతో )


మరల సేద్యానికి'
శివరామ కారంత్‌ నవల,
తెలుగు అనువాదం: తిరుమల రామచంద్ర
336 పేజీలు, ధర రూ.150/-

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006
ఫోన్‌ : 040 23521849
Email: hyderabadbooktrust@gmail.com 
 

Friday, February 27, 2015

"ఆలస్యమైనా ... ఆనందంగానే ఉంది !" కె.లలిత గారితో వసంత లక్ష్మి గారి ఇంటర్వ్యూ - ఆంద్ర జ్యోతి

"ఆలస్యమైనా ... ఆనందంగానే ఉంది !"

'90లలో 'విమన్ రైటింగ్ ఇన్ ఇండియా' ఒక పెద్ద సంచలనం. '
' వాళ్ళూ రాశారు' అనే మాట స్థానంలో 'ఇన్ని రాశామా' అని స్త్రీలలోనే ఆశ్చర్యం కలిగించి,
'ఇన్ని రాసినా గుర్తించరేం' అనే ఆగ్రహం కలిగించి ,
'ఎందులోనూ ఎవరికీ తీసిపోము' అనే ఆత్మవిశ్వాసం కూడా కలిగించిన రెండు గొప్ప సంకలనాలివి.
సంపాదకులైన సుశీతారు, కె.లలితల సుదీర్ఘ శ్రమ ఫలితంగా వెలువడ్డ ఈ గ్రంధాలలో రెండవ దాన్ని
"దారులేసిన అక్షరాలు- ఇరవైయ్యవ శతాబ్దపు భారతీయ మహిళల రచనలు" పేరుతో అన్వేషి, హెచ్ బీ టీ కలిసి ఇటీవల తెలుగులోకి తీసుకొచ్చాయి. ఆ సందర్భంగా కె.లలితతో ఇష్టాగోష్టి .

(ఆంధ్రజ్యోతి 23 ఫిబ్రవరి 2015 సౌజన్యంతో )

దారులేసిన అక్షరాలు - 
ఇరవైయవ శతాబ్దపు భారతీయ మహిళల రచనలు 

సంపాదకులు : సుశి తారు, కె.లలిత

600 పేజీలు, ధర : రూ. 400/-

ప్రతులకు, వివరాలకు: 

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006
ఫోన్‌ : 040 23521849


E Mail:    hyderabadbooktrust@gmail.com


వెలుగు దరికి ... తెలుగు దారి ! కే.లలిత గారితో సరస్వతీ రమ గారి ఇంటర్వ్యూ - సాక్షి దినపత్రిక


వెలుగు దరికి ... తెలుగు దారి !
దారులేసిన అక్షరాలు !ఇరవయ్యవ శతాబ్దపు మహిళల రచనల సంకలనం.
ఇంగ్లీష్ లో వచ్చిన "విమెన్ రైటింగ్స్ ఇన్ ఇండియా " కు తెలుగు అనువాదం.
ఆంగ్ల మూలానికి సారధ్యం వహించిన వనితలు సూశీతారు , కే.లలితలే ఈ తెలుగు అనువాదానికీ
సంపాదకత్వం వహించారు.
ఆ రచనల గురించి కే.లలిత తో సరస్వతీ రమ జరిపిన ఇంటర్వ్యూ .

(సాక్షి 06 ఫిబ్రవరి 2015 సౌజన్యం తో ...)







  దారులేసిన అక్షరాలు - 
  ఇరవైయవ శతాబ్దపు భారతీయ మహిళల రచనలు 

  సంపాదకులు : సుశి తారు, కె.లలిత

  600 పేజీలు, ధర : రూ. 400/-

  ప్రతులకు, వివరాలకు: 

  హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
  85, బాలాజీ నగర్‌,
  గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006
  ఫోన్‌ : 040 23521849


 E Mail:    hyderabadbooktrust@gmail.com


 

Tuesday, February 17, 2015

అత్యంత వాస్తవికంగా, గొప్ప దార్శనికతతో వ్రాసిన కథలు

ఇస్మత్‌ చుగ్తాయ్‌ కథలు – ఉమామహేశ్వరి నూతక్కి


”హృదయంలేని మనిషొకరు ఒక నల్లటి బక్క పిల్లని బెత్తంతో నిర్దాక్షిణ్యంగా బాదుతున్నారు. అతనెవరో, దెబ్బలు తింటున్న ఆ అభాగ్యుగాలెవరో కూడా తెలుసుకొనే వయసు నాకు లేదు. కానీ నాకు బాగా ఏడుపొచ్చింది. బాగా ఏడ్చాను. ఆ లావాటి బెత్తం ఆ పిల్ల వీపు మీద చేసిన శబ్దం నా చెవులలోనే ఉండిపోయి ఇప్పటికీ తరుచూ వినపడుతూ ఉంటుంది.
నాకప్పుడర్థం అయ్యింది. పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళని ఎప్పుడూ కొడతారు. బలవంతులు బలహీనులను హింసిస్తారు. బలవంతులు తల ఎత్తుకు నిలబడతారు. బలహీను వాళ్ళ పాదాల కింద ధూళిలా అయిపోతారు అనిపించింది. నేను బలవంతులను అభిమానించి బలహీనులను ఏవగించుకోవడం మొదలుపెట్టాను. అయినప్పటికీ నా లోపల నాకు తెలియని భావాలేవో దాగి ఉన్నాయి. ఒక గొప్ప భవనపు గోడలకి నాచు పట్టి గడ్డీ గాదమూ మొలచినప్పుడు నేను లోలోపల సంతోషించేదాన్ని. చిరునవ్వు వచ్చేది నాకు. అంతటి భవనాన్ని నాశనం చేయగల శక్తి ఆ పిచ్చి మొక్కకి ఉండడాన్ని చూస్తే సంభ్రమం కలిగేది….”
ఈ మాటలు ఇస్మత్‌ చుగ్తాయ్‌ తన జీవన యాత్రలో ”ముళ్ళూ పువ్వులూ” అంటూ తన గురించి చెప్పుకున్న నాందీ ప్రస్తావన. ఒక రచయిత్రి నేపధ్యం గురించి, చెప్పదలుచుకున్న శిల్పం గురించి, వ్యక్తీకరించిన శైలి గురించి అర్థం చేసుకోవడానికి పై మాటలు చాలు. స్త్రీలు, అందునా సాహిత్యంలో స్త్రీల ప్రస్థానం అటుంచి అసలు సాహిత్యం అన్న పదాన్ని కలగనటం కూడా పెద్ద నేరంగా పరిగణించబడే 1930 -40ల నాటి కాలంలో తనకంటూ ఒక ఒరవడి సృష్టించి సాహిత్య రంగంలో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న రచయిత్రి కథలు ఈ నెల మీకు పరిచయం చేయబోతున్న ”ఇస్మత్‌ చుగ్తాయ్‌” కథలు. శైలీ విన్యాసంలోనూ శిల్ప పరిణితిలోనూ అగ్రస్థానానికి ఎదిగి, తన సహ రచయిత్రులలో కూడా సృజనాత్మకత పెంచి వారిని అభివ్యక్తి వైపు నడిపించిన రచయిత్రి ఇస్మత్‌ చుగ్తాయ్‌. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె నిజాయితీ, ధైర్యసాహసాలకు మారుపేరు. తాహిరీ నఖ్వీ ఆంగ్లంలోకి తర్జుమా చేసిన ఈ కథలని ప్రముఖ రచయిత్రి పి. సత్యవతి తెలుగులోకి అనువదించారు.
15 కథల ఈ సంపుటిలో మనం ముందుగా చెప్పుకోవలసిన కథ ”లిహాఫ్‌”. 1944లో రాసిన ఈ కథ సాహిత్యంలో కొత్త ధోరణి ప్రవేశపెట్టింది. ఒక తుఫాన్‌ సృష్టించింది. కథలోకి వస్తే వైవాహిక జీవితంలో ఆశాభంగానికి గురయిన స్త్రీ బేగం జాన్‌. ఆమె ఒక పరిచారిక దగ్గర లైంగికంగాను, ఉద్వేగపరంగాను ఉపశమనం పొందుతుంది. ఒక స్త్రీ చిన్ననాటి జ్ఞాపకాల రూపంలో ఉంటుంది కథ. చిన్నపిల్ల ఊహల్లోంచి వచ్చిన కథ కనుక అమాయకత్వంతో కూడిన ధైర్యమూ నిష్కపటత్వమూ కనిపిస్తుంది. బేగంకూ ఆమె పరిచారికకూ ఉన్న సంబంధాన్ని కళ్ళకి కట్టినట్లు చూపిస్తూనే చిన్నపిల్ల చేత చెప్పించడం వల్ల కథలో ఒక సున్నితత్వం మనకు కనిపిస్తుంది. ఈ కథ ఆరోజుల్లో పెద్ద దుమారాన్ని లేపింది. పాఠకులూ, విమర్శకులూ ఆమె కథను తీవ్రంగా విమర్శించారు. అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం అశ్లీలత క్రింద లాహోర్‌ కోర్టులో కేసు కూడా పెట్టింది. అయితే ఆ కథని కేవలం స్వలింగ సంపర్కం గురించి వ్రాసిన కథగా గాక అప్పటి స్త్రీల జీవితాలలో వివాహ వ్యవస్థ సాంప్రదాయాలు, పితృస్వామ్యం కలిసికట్టుగా సృష్టించిన విధ్వంసం, వారి జీవితాల్లో పేరుకున్న నిరాశ, నిస్పృహ ఈ కోణంనించి చూసినప్పుడు మాత్రం మన మనస్సులు చలించక మానవు.
మరొక కథ ”మేలి ముసుగు” ఈ కథ చెప్తున్న గోరిబీ పురుష స్పర్శ ఎరుగని ఎనభై యేళ్ళ కన్య. అత్యంత సౌందర్యవతి అయిన గోరిబీ కోటి ఆశలతో కొత్త సంసార జీవితంలోకి అడుగు పెడుతుంది. భర్తకు ఎదురయిన ఒక చిన్న ఆత్మ నూన్యత భావం అర్థం చేసుకోలేనితనం వల్ల ఆమె జీవితం నరకప్రాయమవుతుంది. చేయని తప్పుకు ఆమె నిండు జీవితం బలైపోతుంది. భార్యగా, కోడలిగా, తల్లిగా తన బాధ్యతలను నిర్వహించడంలో మునిగిపోయిన చుగ్తాయ్‌ వదిన కథ ”శిల” మరో కథ. బంధాలకు విలువ ఇవ్వడంలో మునిగిపోయిన ఆమె కరిగిపోతున్న తన జీవితాన్ని పట్టించుకోదు.
ఇస్మత్‌ కథలన్నీ స్త్రీ పాత్రలు ప్రధానంగా వారి చుట్టూనే నడుస్తుంటాయి. అయినా ఏ కథా మరొక కథలా ఉన్నట్లు అనిపించదు. అర్థ శతాబ్దం క్రిందట ఇంత అవగాహనతో, ఇంత శిల్ప నైపుణ్యంతో రచయిత్రి వ్రాయడం మనకి ఆశ్చర్యమనిపిస్తుంది. మనల్ని ఆలోచింపచేసే మరొక కథ ”ఒక ముద్ద”. నర్సు సరళా బెన్‌కు బాధ్యతల వల్ల సరైన వయసులో పెళ్ళి జరగదు. అందరికీ తలలో నాలుకలా ఉండే ఆమె ఒక ఇంటిదయితే బాగుండని ఇరుగు పొరుగు వాళ్ళనుకుంటారు. రోజు బస్సులో ఆమెతో ప్రయాణించే వ్యక్తి ఆమె పట్ల చూపుతున్న ఆసక్తిని గమనించి, అతని మెప్పుపొందేటందుకు ఆమెను చక్కగా అలంకరించి పంపుతారు. అయితే ఎప్పుడు అత్యంత సహజంగా, స్వచ్చంగా ఉండే ఆమెను కొత్త వేషంలో అతను గుర్తించలేక ఛీత్కరించుకుంటాడు. బాహ్య సౌందర్యంకన్నా అంత:సౌందర్యం గొప్పదనే భావన కలిగించే ఈ కథ అద్యంతం మనల్ని కట్టి పడేస్తుంది.
అంతే కాదు, మాట కరువయినా వెన్నలాంటి మనుసున్న బిచ్చు అత్తయ్య, దేవుడిచ్చిన అందమే శాపమై కబళించిన అమృతలత ఇలా చుగ్తాయ్‌ చెప్పిన ప్రతీ కథా చాలా విలక్షణంగా ఉంటుంది. ”ఇది పురుషులకోసం పురుషులు చేసిన ప్రపంచం. ఈ ప్రపంచంలో స్త్రీ ఒక పాత్ర మాత్రమే. పురుషుని ప్రేమకో, ద్వేషానికో ఒక అభివ్యక్తి లాంటిది స్త్రీ. అతని చిత్త వృత్తులను బట్టి ఆమెను ప్రేమించడమో, తిరస్కరించడమో జరుగుతుంది” అంటారు ఇస్మత్‌ చుగ్తాయ్‌. ఆమె కథలన్నీ ఇదే సారాన్ని చాలా పదునుగా వ్యక్తం చేస్తాయి.
ఇస్మత్‌ కథలోని పాత్రలు ఆనాటి సామాజిక సాంస్కృతిక పరిస్థితులను చక్కగా ప్రతిబింబిస్తాయి. ఆమె కథలను అధ్యయనం చేస్తే ఉత్తరప్రదేశ్‌లోని ముస్లిం కుటుంబాల సామాజిక, సాంస్కృతిక జీవితాన్ని బాగా అర్థం చేసుకోవచ్చు. వర్గ స్పృహ, వస్త్రధారణ, వంట పద్ధతులు, ఆహారం, పుట్టుక, వివాహం వంటి సందర్భాలలో పాటించే ఆచార ధర్మాలు అన్నీ వివరంగా చర్చిస్తారామె. ”చౌతీకా జోడా” కథలో పెళ్ళి సంబంధాలు కుదుర్చునే పద్ధతి ప్రస్తావిస్తారామె. ఇప్పటికీ అర్థ శతాబ్దం తరువాత కూడా ఇండియాలోనూ, పాకిస్తాన్‌లోనూ ఇంకా ఇలాగే పెళ్ళిళ్ళు కుదురుతున్నాయి. పెళ్ళికూతురు చెల్లిని పెళ్ళికొడుకుతో పరిహాసాలాడడానికి పంపుతారు. అతన్ని ఆకర్షించి పెళ్ళి ప్రతిపాదన రాబట్టడం ప్రధాన యుక్తి. ఆ ప్రతిపాదన కూడా తాను చూసిన అమ్మాయితో కాదు. పెళ్ళివరకూ చూడ నోచుకోని వ్యక్తితో! ఈ కథలో చౌతీ కా జోడా (పెళ్ళయిన నాలుగో రోజు ధరించే దుస్తులు)కున్న ప్రాధాన్యాన్ని, అవి తయారు చేసే పద్ధతినీ కూడా తెలుసుకోవచ్చు.
”ముఖద్దర్‌ ఫర్జ్‌” కథ భారతదేశంలో లౌకికవాద ధృక్పధం అవసరాన్ని ప్రస్తావిస్తుంది. ఇప్పటి కాలమాన పరిస్థితులను కూడా అతికినట్లుండే ఈ కథని చదివినపుడు రచయిత్రిలో దార్శనికత మనం అర్థం చేసుకుంటాం. అలాగే ”ఘూంఘట్‌” కథ వివాహ వ్యవస్థ పద ఘట్టనల కింద నలిగిపోయిన ఒక స్త్రీ గాధ. ఇలా ప్రతి కథలోనూ తన శిల్ప చాతుర్యతతో తనెక్కడా తొణకకుండా ప్రేక్షకురాలిగా మనతో నడుస్తూ మనల్ని నడిపిస్తూ, ఆ కథని ఎలా అర్థం చేసుకోవాలన్న విచక్షణ మాత్రం మనకే వదిలేయడం ఇస్మత్‌ చుగ్తాయ్‌ ప్రత్యేకత. ఇస్మత్‌ కథలలో మరొక ప్రత్యేకత ఏమిటంటే ఆమెలో వస్తు పరిమితితోనే ఆమె గొప్ప కళాత్మకత సాధించగలిగారు. స్త్రీల గురించి, వారి జీవితాలపై సంస్కృతి సాంప్రదాయాల ఆంక్షల గురించి, భారతీయ సమాజంలో స్త్రీల స్థాయి గురించి, ఆమె ఆర్తితో ఆవేదనతో, లోతుగా పరిశీలించారని ఈ కథలు చదివాక మనకు అర్థమవుతుంది. ఆ కాలంలో స్త్రీలపై సామాజికంగా జరుగుతున్న అణిచివేత, దానికి వ్యతిరేకంగా వారి పోరాటం, స్త్రీల మనస్తత్వం, వారికి స్వంతమయిన అనుభూతులు ఆమె కథా వస్తువులు.
ఒక్క మాటలో చెప్పాలంటే ”ఇస్మత్‌ చుగ్తాయ్‌” కథలు అప్నటికీ, ఇప్పటికీ ఒక సామాజిక కదంబమాల లాంటివి. సామాజిక ధృక్పధంతో, సాంప్రదాయేతర శిల్పంతో సాగే ఆమె కథలు మనల్ని ఆసాంతం కుదిపి మనలో నిద్రాణంగా ఉన్న ఆలోచనలు తట్టి లేపుతాయి. ఈ పుస్తకం గురించి మాట్లాడుకునేటప్పుడు పి.సత్యవతి గారి అనువాద పటిమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉర్దూలో వ్రాయబడ్డ ఇస్మత్‌ కథలని ”తాహీరా నఖ్వీ” ఆంగ్లంలోకి అనువదించారు. తరువాత వీటిని ప్రముఖ స్త్రీవాద రచయిత్రి పి. సత్యవతి గారు తెలుగులోకి అనువాదం చేసారు. ఇస్మత్‌ తెలుగులోనే వ్రాసారా అన్నంత సహజమైన శైలిలో ఉంటాయి అనువాదాలు. ఇందులో పాత్రలు ఎంత సహజంగా ఉంటాయంటే పుస్తకం అంతా చదివేసి హాయిగా ఉండడం కుదరదు. చుగ్తాయ్‌ సృష్టించిన ”బేగం జాన్‌, కుబ్రా; ఆమె తల్లీ, చెల్లీ, రుక్సానా, గొరిబీ, సరళా బెన్‌, బిచ్చూ అత్తయ్య, ఇల్లూడ్చే ముసలమ్మ అంతా చాలా సేపు మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు. కలాలకు, గళాలకు స్వేచ్ఛ లేని కాలంలో, సాంప్రదాయ రీతీ రివాజులు సమాజాన్ని తన గుప్పిట్లో ఉంచుకున్న కాలంలో అత్యంత వాస్తవికంగా, గొప్ప దార్శనికతో వ్రాసిన ”ఇస్మత్‌ చుగ్తాయ్‌” కథలు తప్పక చదివి తీరవలిసిన పుస్తకం….
Courtesy: BUMIKA, Telugu Monthly, February 2015

Saturday, February 7, 2015

పరదా చాటు జీవితాలను చిత్రించిన కథలు

ఇస్మత్ చుగ్తాయ్ కథలు

నవాబుల బిడ్డ షమ్మన్ మియాకి పద్దెనిమిదేళ్ళు . చదువు, క్రికెట్ తప్ప మరో ప్రపంచం తెలీదతనికి. కానీ, ఆ మహల్ లో కొన్ని ఆచారాలు ఉన్నాయి. వాటి ప్రకారమే ఆ రాత్రి వేళ అతనికి సేవ చేయడం కోసమని షమ్మన్ మియా తల్లి నవాబ్ బేగం పంపగా అతని గదికి వచ్చింది హలీమా, ఆ ఇంటి దాసీపిల్ల. ఆమె సేవలని తిరస్కరించాడు షమ్మన్ మియా. ఫలితం, ఒకదాసి యజమాని గదికి వెళ్లి చెక్కు చెదరకుండా తిరిగి రావడం అన్నది మొదటిసారిగా జరిగింది ఆ ఇంట్లో.

కొడుకు 'ఆరోగ్యాన్ని' గురించి బెంగ పెరిగింది బేగంకి. మరింత చొరవ చూపించాల్సిందిగా హలీమా మీద ఒత్తిడి పెరిగింది. హకీమ్ సాబ్ చేసిన వైద్యం కన్నా, హలీమా చూపించిన భక్తిపూర్వకమైన ప్రేమ బాగా పనిచేసింది షమ్మన్ మియా మీద. అతనిప్పుడు హలీమా లేకుండా ఉండలేని స్థితికి చేరుకున్నాడు. రోజులు క్షణాల్లో గడిచిపోగా, ఓ ఉదయం హలీమా గర్భవతి అన్న వార్త తెలిసింది మహల్లో. బేగం ఆనందానికి అవధులు లేవు.

కొడుక్కిక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయొచ్చు. సంబంధం సిద్ధంగానే ఉంది కూడా. మరి హలీమా? ఆ ఇంటి ఆచారం ప్రకారం, ఆమె పల్లెటూరికి వెళ్లి అక్కడ బిడ్డని కని, తిరిగిరావాలి. పుట్టిన బిడ్డ మగబిడ్డ అయితే సేవకుడిగానూ, ఆడబిడ్డ అయితే సేవికగానూ మహల్లో జీవితాన్ని గడపాలి.

అనూచానంగా వస్తున్న మహల్ ఆచారాన్ని ఎదిరించిన మొట్టమొదటి వ్యక్తి షమ్మన్ మియా. తల్లిదండ్రులు, సోదరుల మాటని లెక్ఖ చేయలేదు. హలీమాని పెళ్లి చేసుకునేనేందుకు మనసా వాచా సిద్ధపడ్డాడు. అదే జరిగితే ఇంకేమన్నా ఉందా? మహల్ పరువు ఏమైపోవాలి?? షమ్మన్ మియా తన నిర్ణయాన్ని అమలు చేయగలిగాడా లేదా అన్నది ఉర్దూ రచయిత్రి ఇస్మత్ చుగ్తాయ్ రాసిన పాతిక పేజీల కథ 'అలముకున్న పరిమళం' కి ఇచ్చిన హృద్యమైన ముగింపు.

ఈ కథతో పాటుగా ఇస్మత్ రాసిన మరో పద్నాలుగు కథలని తెనిగించి సంకలనాన్ని తయారు చేశారు స్త్రీవాద రచయిత్రి పి. సత్యవతి. పుస్తకంగా ప్రచురించింది హైదరాబాద్ బుక్ ట్రస్ట్.

అనువాదకురాలి పేరు చూడడంతోనే కథానాయిక ప్రధానంగా సాగే కథలని చదవడానికి సిద్ధ పడిపోయాను మానసికంగా. అయితే, దాసీ పిల్లని మనసారా ప్రేమించిన షమ్మన్ మియా కథతో పాటు, చిన్నప్పుడు తను పని చేసిన ఇంట్లో అమ్మాయినే పెళ్లి చేసుకోగలిగే స్థాయికి ఎదిగిన 'కల్లూ,' తనది కాని బిడ్డని తన బిడ్డగా అంగీకరించగల రామ్ అవతార్ ('చేతులు' కథ), ఇంకా మత మౌడ్యాన్ని ఎదిరించే పడుచు ప్రేమజంట ('పవిత్ర కర్తవ్యం) కథా కనిపించి ఆశ్చర్య పరిచాయి.

అయితే, మెజారిటీ కథలు పరదా చాటు జీవితాలని, వాటిలోని సంఘర్షణలనీ చిత్రించినవే.

వృద్ధుడైన నవాబుగారి పడుచు భార్య బేగం జాన్ పరదాల చాటునే తనదైన జీవితాన్ని వెతుక్కోడాన్ని 'లిహాఫ్' కథ వర్ణిస్తే, భర్త ఎదుట తనకితానుగా మేలిముసుగుని పైకెత్తడం అనే సంప్రదాయ విరుద్ధమైన పనిని తన అభీష్టానికి వ్యతిరేకంగా చేయడానికి ఇష్టపడక వృద్ధ కన్యగా ఉండిపోయిన గోరీబీ కథని 'మేలిముసుగు' కథ చిత్రిస్తుంది. పట్టుదల విషయంలో గోరీబీకి ఏమాత్రం తీసిపోని మరో స్త్రీ 'బిచ్చూ అత్తయ్య.' తన భర్త దాసీతో సన్నిహితంగా ఉండడాన్ని చూసిన మరుక్షణం వితంతు వేషం ధరించి, జీవితాంతం అతన్ని'కీర్తిశేషుడు అనే విశేషణం జోడించి మాత్రమే ప్రస్తావించిందామె.

డబ్బులేకపోతే అన్నీ సమస్యలే. పెళ్లి కావడం మరీ సమస్య. పెళ్ళికోసం అలవాటు లేని మేకప్ చేసుకున్న సరళా బెన్ అగచాట్లని 'ఒక ముద్ద' కథ చెబితే, తనవాడవుతాడని నమ్మిన వాడికోసం పడరాని పాట్లు పడ్డ కుబ్రా కరుణరసాత్మక కథ 'చౌతీ కా జోడా.' సంప్రదాయం ఎంత కఠినంగానైనా ఉండొచ్చు గాక. వెతుక్కునే వాళ్లకి గమ్యం చేరుకునే మార్గాలు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయని చెప్పే కథ 'దేవుడి దయ.' భార్యని తనకి అనుకూలంగా మార్చుకునే అన్నయ్యనీ ('శిల') యవ్వనాన్ని కరిగించుకోడం కోసం కష్టపడే రుఖ్సానా యాతనలనీ ('అమృతలత') ఓ పట్టాన మర్చిపోలేం.

'పుట్టుమచ్చ' 'చిన్నక్క' 'గరళం' కథలు వేటికవే ప్రత్యేకమైనవి. వీటికి మెరుపు ముగింపులిచ్చారు రచయిత్రి. వీటిలో చాలా కథలు దేశానికి స్వతంత్రం రాకపూర్వం రాసినవే. 'లిహాఫ్' కథ కోర్టు కేసులని కూడా ఎదుర్కొంది. మనకి ఏమాత్రం తెలియని ప్రపంచంలోకి అలవోకగా తీసుకుపోతారు రచయిత్రి. పదిహేను కథలనీ చదవడం పూర్తిచేశాక కూడా మహళ్ళు, అక్కడి మనుషులు ఓ పట్టాన మన జ్ఞాపకాలని విడిచిపెట్టరు. కథలతో పాటు 'జీవన యాత్రలో ముళ్ళూ, పూలూ' పేరిట చుగ్తాయ్ రాసుకున్న స్వగతం ఉర్దూ కథల్ని ఇంగ్లీష్ లోకి అనువదించిన తాహిరా నఖ్వి రాసిన 'పరిచయం' కథల పూర్వరంగాన్ని గురించి చెబుతాయి.

తెనిగింపుని ఇష్టంతో చేశానని చెప్పారు సత్యవతి.

(పేజీలు 184, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు, హైదరాబాద్ బుక్ ట్రస్ట్).

- నెమలి కన్ను మురళి

http://nemalikannu.blogspot.in/2015/02/blog-post_6.html


.


Friday, February 6, 2015

"దారులేసిన అక్షరాలు" పుస్తకావిష్కరణ సభ 7 ఫిబ్రవరి 2015 శనివారం సాయంత్రం 4.30కు గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్ లో

"దారులేసిన అక్షరాలు" 
పుస్తకావిష్కరణ సభ 
7 ఫిబ్రవరి 2015 శనివారం సాయంత్రం 4.30కు 
గోల్డెన్ త్రెషోల్డ్, 
అబిడ్స్ లో
అందరూ ఆహ్వానితులే !


హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌