Monday, February 18, 2019

ఎదారి బతుకులు పల్లెకతలు : ఎండపల్లి భారతి

ఎదారి బతుకులు పల్లెకతలు :  ఎండపల్లి భారతి
వాస్తవికత, కళాత్మకత, తాత్వికత, గాఢత, చలనశీలత వున్న కథలివి.
మదనపల్లికి కొద్ది దూరంలో వుండేఒక మాదిగ  పల్లె బిడ్డ. కేవం ఐదో తరగతి వరకేచదివింది భారతి. కానీ జీవితాన్ని లోతుగా చదివింది.అనుభవాన్ని సృజనాత్మకంగా వ్యక్తీకరించడానికి చదువేమీ అక్కర్లేదు. పెద్ద చదువు చదివిన కథకులు చాలామంది రాయని, రాయలేని అద్భుతమైన కథలామె రాసింది. చిత్తూరు జిల్లా జీవభాష తొణికిసలాడుతూ వుంది ఆమె చేతిలో. గొడ్డుతునకు, గంగవ్వ పోసే మజ్జిగ, పూపెట్టగుడ్లు, ఒకటా రెండా ఎన్నో కథలు. పూలపెట్ట కథచదివి కడుపారా నవ్వుకున్న. ముగింపు చదివికన్నీరు కార్చా. అలాగే, కోడలికి తిండి సరిగా పెట్టని అత్త కథ చదివి కదిలిపోయా. కథను చెప్పాలి. దృశ్యాన్ని వర్ణించి, సంభాషణు రాసి సినిమా  స్క్రీన్ప్లే నారేషన్తపించే కథలు రాసే వాళ్లు చాలా మంది మనకున్నారు. ఉత్తమ కథ ప్రమాణాకుగానీ ప్రమాణాకు విరుద్దంగా నవీన విధానంలో చేసే విశ్లేషణకు గానీ నిలబడనివి చాలానే వచ్చాయి. కానీ భారతి విశేషణాలకు అందని నిఖార్సైన కథకురాలు. వాస్తవికత, కళాత్మకత, తాత్వికత, గాఢత, చలనశీలత గుణాు పుష్కలంగా వున్న కథలివి. కథలు చదివి మీరే జడ్జిమెంట్ఇవ్వండి.
                                                                                                                                   - జిలుకర శ్రీనివాస్
ఫార్ములా తెలియకుండానే క్లిష్టమైన లెక్కలన్నిట్నీ కరెక్టుగా ఆన్సర్చేసినవాళ్ళను లోకం ఎంత అబ్బురంగా చూపిస్తుందో భారతి రాసిన కథను చదివినప్పుడు నాకు అలాగే అనిపించింది. ఆమె ఒక్క అక్షరం కూడా ప్రయత్నపూర్వకంగా రాయకపోయినా   రోజు సాహిత్యంలో చర్చకు వస్తున్న అన్ని విషయాలూ కథల్లో కనిపిస్తాయి. వూరికే కనిపించడం కాదు;  ఆమె చూపు, భాషతో సహా అన్నీ (కులం , వర్గం, జెండర్‌, లైంగికత అన్నీ) వంక పెట్టడానికి వీల్లేనంత పకడ్బందీగా కథల్లోపలికి వచ్చి కూర్చునిజీవితం అంటే ఇదీ. ఇది మాత్రమే అని  చెపుతున్నట్టుగా ఉంటాయి. నాకు టోపీ లేదు కాని
ఉంటే తీసి భారతి కాళ్ళ ముందు పెట్టేదాన్నే
                                                                                                          - వేమన వసంతక్ష్మి  
మూడుమాట్లు ఈసడిరచుకోబడ్డ బతుకు
భూప్రెపంచకం మొత్తం మీద మూలకి వెళ్ళినా ఆడోళ్ళు దిగనాసితనంలోకి తోసెయ్యబడ్డోళ్ళే. దేశపు ఆడోళ్ళు మరి కాస్తి ఎక్కువే తొక్కబడ్డవోళ్ళు. ఇందులో మళ్ళీ  మా దళిత గూడే ఆడోళ్ళు బయట సమాజంలో కులం పేరుతో, ఇంట్లో మొగోళ్ళ చేతుల్లో ఆడిరగిలితనం పేరుతో, మిగతా కులాల ఆడోళ్ళ మజ్జనేవో కులంతో పాటు బీదరికాన్ని బట్టీ మొత్త్తం మూడు మాట్లు ఈసడిచ్చుకోబడతారు. ఇట్టా లింగ, వర్గ, కుల వివక్షల అట్టడుగు పీడితురాలుగా బతుకుతూనే తన దైన్యపు స్థితి అంతటి నుండీ కుటంబానికి సేవలూ, సౌఖ్యాలూ అందించాల్సిన పరిస్థితుల్లో  దక్షిణ జంబూదేశాన మంగంలో మిరగబాయిలా మలమలా ఏగుతున్న రాయసీమ నే మీద మా ఆడోళ్ళ కడగండ్లు వుంకో అడుగు ఎనక్కి వేసి ప్రపంచపు అత్యంత పీడిత జీవిగా ఆమెను పరిచయం చేస్తాయి. ఎదారి బతుకు నిండా వాస్తవం మట్టి సట్టికి అడుగున కరుగు కొవ్వుకు మల్లే పేరుకుని అగపడతది. పీడకు బతుకుల్ని అనుకరిచ్చటమే నాగరికత, అభివృద్ధి అని నేర్పిన సమాజంలో పీడక ఆసాము భాష, దాష్టీకం, క్రమశిక్షణ పేరుతో చేసే శారీరక హింస లాంటి ఎన్నో అవక్షణాను అరువు తెచ్చుకున్న మా గూడెపు మొగోడు తనతో పాటు సమానంగా బువ్వ సంపాదిచ్చే, తనకన్నా ఎక్కువగానే గుడిసెను భద్రం చేసుకునే దళిత స్త్రీ పట్ల చూపిచ్చేమగతనం భారతి కథల్లో మిగతా స్త్రీవాద సాహిత్యంలోని నిందా దృక్పథంతో కాకుండా ఎద ఆరిన నిస్సహాయతతో పంచలో కూకుని గుడిసె గురిచ్చి దిగాలు పడతన్న మా జేజి మొకంలోని మడత ఇవరంలా కనబడిద్ది. పండక్కో ఇంటికెల్లినప్పుడు నా మంచం పక్కనే కూకుని తలకాయలోని చెమట చీంపొక్కుల్ని గ్లితా మా చెల్లెలు చెప్పే తన సంసారపు కతలా వుంటది.
                                                                                                    - ఇండస్మార్టిన్
భారతికథలు అభివృద్ధి  చెందుతున్న భారతదేశపు క్రీనీదలను చూపించిన కాగడాలు. నగర మధ్యతరగతి భద్రజీవుల కథలు కావివి. కులం రీత్యా వర్గం రీత్యా సమాజపు అంచులలోనుంచీ ఇంకా నడిమధ్యకు రావడానికి పెనుగులాడుతున్న జనం వెతలు. తన అమ్మనుడిలోనే చెప్పకున్న ఈ కథలను, భారతి వర్ణించి వర్ణించి మాజిక్కులు చేసి ఏమీ చెప్పదు. నెత్తిమీద మొట్టీ చెప్పదు. ఉపన్యాసాలూ ఇవ్వదు. కబుర్లు చెప్పినట్టు చెప్పి ఉలిక్కిపడెలా చెస్తుంది. చివర్లో కొన్ని జీవితసత్యాలను అలవోకగా మన మీదకి విసురుతుంది చాలా ఒడుపుగా. ఇవి ఒక్క దిగవబురుజు కతలే కాపు. భారతదేశపు కథలు, భారతి చెప్పిన వెతలు. తెలుగు కథావనంలోకి పచ్చపచ్చగా నడిచి వచ్చింది ఈ కథాభారతి. స్వాగతం పలుకుదాం.
                                                                                                         - పి.సత్యవతి
ఎదారి బతుకులు పల్లెకతలు :  ఎండపల్లి భారతి
రచన :  ఎండపల్లి భారతి
120 పేజీలు, వెల: రూ.100/-
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com  

Thursday, January 31, 2019

డి.డి.కోశాంబి చరిత్రను పక్కదారి పట్టనివ్వలేదు- కొత్తదారి చూపించారు బి బి సి తెలుగు


 "ప్రాచీన భారత దేశ చరిత్ర పుస్తకం పై బి బి సి న్యూస్ తెలుగు లో ప్రచురించిన పరిచయ వ్యాసం:
https://www.bbc.com/telugu/india-45007924

https://www.bbc.com/telugu/india-45007924

డి.డి.కోశాంబి: చరిత్రను పక్కదారి పట్టనివ్వలేదు.. కొత్తదారి చూపించారు
డి.డి.కోశాంబి.. పరిచయం అక్కర్లేని చరిత్రకారుడు. చరిత్ర రచనను కొత్త దారి పట్టించిన పరిశోధకుడు.
చరిత్ర అంటే రాజులు, రాజ్యాలే కాదు మానవ జీవితాలను మలుపు తిప్పిన పరిణామాలను చూడాలంటూ కొత్త విశ్లేషణా పరికరాలను అందించిన వ్యక్తి.
ప్రాచీన భారత చరిత్రపై ఆయన చేసిన పరిశోధన, నిర్ధరణ అన్నీ అంతకుముందున్న చరిత్ర రచనా పద్ధతులను, సరళిని సమూలంగా మార్చేశాయి. సరికొత్త దారి చూపించాయి.
డి.డి.కోశాంబి ప్రస్తుత గోవాలో 1907 జులై 31న జన్మించారు. ఆయన పూర్తి పేరు దామోదర్ ధర్మానంద్ కోశాంబి. చరిత్రతో పాటు గణితం, విజ్ఞాన, తత్వశాస్త్రాలనూ అధ్యయనం చేసిన ఆయన పదుల సంఖ్యలో పుస్తకాలు రాశారు.
డి.డి.కోశాంబి అభిప్రాయాలతో మానవహక్కుల ఉద్యమకారుడు కె.బాలగోపాల్ రాసిన 'ప్రాచీన భారతదేశ చరిత్ర-డి.డి.కోశాంబి పరిచయం' పుస్తకం నుంచి తీసుకున్న అంశాల సమాహారం మీకోసం.
చరిత్ర పరిశోధనకు ఆధారాలు స్థూలంగా రెండు రకాలు. మొదటిది సాహిత్య ఆధారాలు, రెండోది పురావస్తు ఆధారాలు.
సాహిత్య ఆధారాలంటే మత ధార్మిక, పురాణ తదితర గ్రంథాలు, కాల్పనిక సాహిత్య కావ్యాలు, రాజవంశాల అనువంశిక ఆస్థాన చరిత్రలు, పరిపాలనా సంబంధమైన రికార్డులు మొదలైనవి.
వీటిని అధ్యయనం చేసి గతకాలపు చరిత్రను చరిత్రకారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.
పురావస్తు ఆధారాలంటే గత కాలపు నివాసాలు, దేవాలయాలూ మొదలైన కట్టడాలు, వాడకపు పనిముట్లు, ఆయుధాలు, అలంకార ప్రాయమైన వస్తువులు, కర్మకాండ సంబంధమైన సామగ్రి మొదలైన వాటి అవశేషాలు.
కట్టడాలు సాధారణంగా శిథిలాల రూపంలో దొరుకుతాయి. ఆయుధాలు, పనిముట్లు పురావస్తు తవ్వకాలలో బయటపడతాయి.
ఇవికాకుండా అతిముఖ్యమైన ఆధారాలు రాజులుగాని, వర్తకులు గాని ప్రకటించే శాసనాలు, అచ్చు వేసే నాణాలు వగైరా.
శాసనాలు ఎక్కువగా రాళ్లమీద, దేవాలయాల మీద, సమాధుల మీద చెక్కి ఉంటారు. కాబట్టి పురావస్తు ఆధారాలుగా పరిగణించవచ్చును గాని, చరిత్రకారులు శిలాశాసన ఆధారాలు(epigraphic sources) అనే ప్రయోగం చేయడం చూస్తుంటాం.
మన దేశంలో పురావస్తు పరిశోధన చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. మొదట్లో చరిత్రకారులు ఎక్కువగా సాహిత్య ఆధారాలను ఉపయోగించుకున్నారు. ఇతర దేశాలలాగ మన దేశంలో ప్రాచీన కాలపు రాజవంశాలూ రాజస్థానాలూ తమ వ్యవహారాలను గ్రంథస్థం చేయలేదు.
కాబట్టి వేదాలు, ధర్మశాస్త్రాలు, పురాణాలు, కావ్యాలు మొదలైన మత, సాంస్కృతిక సంబంధమైన గ్రంథాలపై ఆధారపడి వాటి నుంచి ఇక్కడొక వాక్యం, అక్కడొక వాక్యం తీసి చరిత్రను మొత్తం వ్యాఖ్యానించేవారు.
పదాల సారూప్యాన్ని బట్టి అలవాట్ల సారూప్యాన్ని, మాటల పోలికను బట్టి కొన్ని శతాబ్దాల చరిత్రనూ 'నిరూపించడం' అలవాటైంది.
పురాణాలలో ఇచ్చిన రాజవంశాల పట్టికలనూ, కథలనూ ఉన్నదున్నట్లుగా స్వీకరించి చరిత్రను వ్యాఖ్యానించారు.
ఈ పద్ధతిని కోశాంబి తీవ్రంగా విమర్శించారు. బాలగంగాధర్ తిలక్ రుగ్వేదంలోని నాలుగు పదాల వాక్యం ఒకటి తీసుకొని ఆర్యులు ఉత్తర ధ్రువం నుంచి వచ్చారని నిర్ధారించిన వైనాన్ని కోశాంబి 'అద్భుతమైన వక్రీకరణ'గా వర్ణించాడు.
శాసన సాహిత్య ఆధారాలను పురావస్తు ఆధారాలతో సమన్వయపరచనిదే చరిత్ర పరిశోధన శాస్ర్తీయం కాదన్న అభిప్రాయాన్ని కోశాంబి పదేపదే వ్యక్తం చేశారు.
పురావస్తు ఆధారాలను పట్టించుకోకుండా కేవలం ప్రాచీన సాహిత్యాన్ని ఆధారం చేసుకుని ఊహాగానాలు చేసే చరిత్రకారులు కోశాంబి చేతిలో చాలా తీవ్రంగా విమర్శకు గురయ్యారు.
పౌరాణిక గాథల నుంచి(అంటే బ్రాహ్మణుల పురాణాలే కాదు, పోచమ్మ, గంగమ్మ మొదలైన గ్రామదేవతల గురించి జనంలో ప్రచారంలో ఉన్న గాథలు కూడా) చరిత్రను అర్థం చేసుకునే ప్రయత్నం కోశాంబి పెద్దఎత్తునే చేశారు.
నిజానికి ఆయన చేసిన పరిశ్రమలో ఇది అత్యంత ముఖ్యమైన భాగం. అయితే, ఎక్కడికక్కడ తన అభిప్రాయాలను పురావస్తు మూలాలతోనూ నైసర్గిక స్థితిగతులతోనూ పోల్చి చూసుకోకుండా ఉండలేదాయన.
సంస్కృత భాషలో తమకున్న పాండిత్యాన్ని ఆసరా చేసుకుని కొందరు పాశ్చాత్యులు కేవలం పద విశ్లేషణ(philological analysis)తో చరిత్రను నిర్ధారించడానికి చేసిన ప్రయత్నాన్ని ఆయన ఖండించారు.
కానీ, సాహిత్య పురావస్తు ఆధారాలను రెండింటినీ సమన్వయపరచి వాడుకున్నా, మన దేశ చరిత్రను పునర్నిర్మించుకోవడానికి అది సరిపోదని కోశాంబి గుర్తించారు.
మన దేశంలో పురావస్తు పరిశోధన చాలా అపరిణతంగా ఉంది. సాహిత్య ఆధారాల విషయంలో కూడా ఇతర దేశాలతో పోలిస్తే మన దేశం పరిస్థితి చాలా అసంతృప్తికరమైనది.
మన ప్రాచీన సాహిత్యంలో లౌకిక సాహిత్యం దాదాపు మృగ్యం. ముస్లింలకు పూర్వం ఏ రాజవంశమూ తన చరిత్రను రాసుకోలేదు, రాయించలేదు. రాజాస్థానాలు ఏ విషయాలలోనూ రికార్డులు నిర్వహించలేదు.
మన దేశ లిఖిత చరిత్ర మొత్తం పురాణాలతో కలిసిపోయి పౌరాణిక గాథలు, ఉపాఖ్యానాల రూపంలో మిగిలింది. ముస్లిం రాజులకు పూర్వం ఏ ఒక్కరి జన్మ సంవత్సరం గానీ ఏ ఒక్క గ్రంథం రాసిన సంవత్సరం కానీ కచ్చితంగా చెప్పలేం. ఒక రాజు పరిపాలించిన ప్రాంతమేమిటో ఇదమిత్థంగా నిర్ణయించలేం. ఒక్కోసారి ఒక సంఘటన ఏ శతాబ్దంలో జరిగిందో కూడా చెప్పలేం.
''ఒక్కో గ్రంథానికి రచయిత ఒకరున్నారని చెప్పగలం. కొన్నిటికి అదికూడా సాధ్యం కాదు'' అంటారు కోశాంబి.
మన దేశాన్ని ఏలిన వాళ్లెవ్వరూ తమ జీవితాలను కానీ, పరిపాలనా వ్యవహారాలను కానీ గ్రంథస్థం చేసే ప్రయత్నం చేయలేదు. అశోకుని శాసనాలు అరుదైన మినహాయింపు. తరువాత కాలంలో ఒక్క భూదానాలను మాత్రమే శాసనాలలో ప్రకటించారు
భారతీయ సంస్కృతి ప్రత్యేకత భిన్నత్వం కాదు అవిచ్ఛిన్నత
మరైతే మన దేశ చరిత్ర రాయడం అసాధ్యమా అన్న ప్రశ్న వస్తుంది. అసాధ్యం కాదు.
ఎందుచేతనంటే వేరే ఏ ఇతర దేశానికీ లేని ఒక గొప్ప సౌకర్యం భారత దేశ చరిత్రకు ఉంది. అదేమిటంటే గతం యొక్క భౌతిక అవశేషాలే కాకుండా సామాజిక సాంస్కృతిక అవశేషాలూ సమాజం పొరలలో భద్రంగా ఉండడం.
అపారమైన భిన్నత్వ భారతీయ సంస్కృతి ప్రత్యేకత అని చాలామంది భావిస్తారు కానీ నిజమైన ప్రత్యేకత భిన్నత్వం కాదు, అవిచ్ఛిన్నత అంటారు కోశాంబి.
గతంలో జరిగిన సామాజిక మార్పులన్నీ తమ ముద్రను మన సమాజం మీద వదిలాయి. వాటి నుంచి చరిత్రను చదవవచ్చుననీ ఆ సౌకర్యాన్ని భారత చరిత్రకారులు వాడుకోవాలనీ అంటాడు.
ఈ అవశేషాలను రెండు రకాలుగా చూడొచ్చు.
ఒకటిమన సామాజిక చరిత్రలో ఏ మార్పూ సంపూర్ణంగా రాలేదు. 5 వేల ఏళ్ల పూర్వం మన దేశంలో అందరూ ఆహార సేకరణ మీద ఆధారపడ్డ సంచార జీవులే. అంటే దొరికిన ఆహారాన్ని ఏరుకుని(లేదంటే వేటాడి) తింటూ స్థిర నివాసం లేకుండా సంచరిస్తూ ఉండేవారు.
ఆ తరువాత క్రమంగా ఆహార సేకరణ మాని ఆహారాన్ని ఉత్పత్తి చేయడం అలవర్చుకున్నారు. కానీ, 5 వేల ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆ మార్పు పూర్తికాలేదు. ఆహార సేకరణ మీద ఆధారపడ్డ ఆటవిక తెగలు ఇంకా మిగిలే ఉన్నాయి.
ఆ తరువాత వచ్చిన అన్ని మార్పులూ ఇంతే. నాగలితో వ్యవసాయం చేయడం, ఇనుప పనిముట్ల వాడకం, స్థిర నివాస గ్రామీణ జీవనం, భూమిపైన వ్యక్తి యాజమాన్యం, సాంస్కృతిక రంగంలో అనాగరిక జంతుబలుల స్థానంలో నాగరిక పూజా విధానం- ఏ మార్పూ కూడా పూర్తిగా రాలేదు. అన్నింటిలోనూ పాత వ్యవస్థను ఇప్పటికీ మిగుల్చుకున్న ప్రజలున్నారు.
రెండోదిమార్పు వచ్చిన చోట కూడా కొత్త వ్యవస్థ పాత వ్యవస్థను పూర్తిగా నాశనం చేయకుండా - కొత్త రూపంలో ఒక్కోసారి అభావ రూపంలో-తనలో ఇముడ్చుకుంది.
చారిత్రకంగా ఉన్నతమైన వ్యవస్థ చారిత్రకంగా వెనుకబడిన వ్యవస్థపైన విజయాన్ని సాధించినా ఓడిపోయిన సమాజం ఆచార వ్యవహారాలపైన తన ముద్ర వేసి తనకు లోబరచుకుని, తనలో చేర్చుకుంది. గతం ఉన్నదుదన్నట్లుగా మిగిలిపోని చోట కూడా పరిణత రూపంలో మిగిలిపోయింది. ఈ అపరిణత రూపంలో గత కాలపు ఛాయలే కాకుండా అది లొంగిపోయిన క్రమం ఛాయలు కూడా ఉంటాయి. గతాన్ని ఇంతగా మిగుల్చుకున్న దేశం మరొకటి లేదు.
ఈ సామాజిక అవక్షేపాలను చరిత్ర పరిశోధనకు ఒక ప్రబలమైన ఆధారంగా గుర్తించడం కోశాంబి ప్రత్యేకత. చరిత్ర పరిశోధనా పద్ధతిలో ఆయన సాధించిన ఆవిష్కరణగా దీన్ని భావించాలి.
తరచుగా ఆయన సాహిత్య ఆధారాలనైనా ఈ స్పష్టాస్పష్టమైన అవక్షేపాలను గుర్తించడం కోసమే పరిశీలిస్తాడు. ఈ విధంగా గుర్తించిన అవక్షేపాలను తిరిగి సాహిత్య పురావస్తు ఆధారాలతో సమన్వయపరిచి చారిత్రక విషయాలను నిర్ధారిస్తాడు.
ఈ దృష్టి కోశాంబికి ఎంతగా అలవాటైందంటే మన పట్టణాలలోని అస్తవ్యస్తమైన రహదార్లలో కూడా ఆయనకు ఆ పట్టణాల పుట్టుకే కనిపిస్తుంది.
హరప్పా, మొహెంజోదారో తరువాత మన దేశంలో ఏ పట్టణమూ ఒక నమూనా ప్రకారం నిర్మించింది కాదని, అన్నీ కూడా కొన్ని సమీప గ్రామాల కలయికగా ఏర్పడినవేనని, పట్టణాల రహదార్లన్నీ ఒకప్పటి పల్లెలను కలిపిన బాటలు కావడం వల్లే అంత అస్తవ్యస్థంగా ఉంటాయని అంటారు.

కోశాంబి దృష్టిలో చరిత్ర అంటే..

§  ''చరిత్ర అంటే మహారాజులు, మహాసంగ్రామాల పట్టిక మాత్రమే అయితే భారతదేశ చరిత్ర రాయడం అసాధ్యం. ఒక ప్రాంతానికి రాజు ఎవరు అనే ప్రశ్న కంటే ఆ ప్రాంతం ప్రజలకు నాగలి వాడకం తెలుసునా లేదా అన్నదే ముఖ్యమైన ప్రశ్న అయితే భారతదేశానికి కచ్చితంగా ఒక చరిత్ర ఉంది. దాన్ని రాయడం కూడా సాధ్యమే'' అన్నది కోశాంబి అభిప్రాయం.
§  ''ఉత్పత్తి శక్తులలోనూ, ఉత్పత్తి సంబంధాలలోనూ క్రమానుసారంగా వచ్చే మార్పులను కాలానుగతంగా వివరించడం చరిత్ర'' అని నిర్వచిస్తారు కోశాంబి.
§  తన దృక్పథం గతితార్కిక భౌతికవాదమనీ, దానికే మార్క్సిజం అంటారనీ చెబుతూ.. అయితే, ఇది ఎంతమాత్రమూ నియతివాదం కాదని కోశాంబి హెచ్చరిస్తారు.
§  ''చరిత్రను పురోగామి స్వభావం ఉన్నదిగా మార్క్సిజం భావిస్తుంది. అంటే ఉత్పత్తి సామర్థ్యంలో వెనుకబడిన దశ నుంచి అభివృద్ధి చెందిన దశకు చరిత్ర పురోగమిస్తుందని, అయితే, ఇది చరిత్రను మొత్తంగా.. అంటే విశాలం భౌగోళిక ప్రాతిపదికన చూసినప్పుడు మాత్రమే. ఒక పరిమితమైన ప్రాంతంలో చరిత్రను పరిశీలిస్తే చరిత్ర చాలాకాలం పురోగమించకుండా కరడుగట్టిపోవడం, ఒక్కోసారి తిరోగమించడం కనిపిస్తుంది.
మనదేశ చరిత్రలో ఇలాంటి ప్రముఖ ఉదాహరణ ఉంది. ఆర్యుల కంటే సింధు నాగరికత ప్రాచీనమైనదప్పటికీ అదే ఆర్థికంగా పైదశలో ఉండింది. సింధు నాగరికతలో నాగలి వాడకం తెలియకపోయినా తేలిక వ్యవసాయ పద్ధతులతో చెప్పుకోదగ్గ అదనపు ఉత్పత్తిని సాధించి పట్టణాలు నిర్మించారు.
వాళ్ల తరువాత వచ్చిన ఆర్యులకు తొలి రోజులలో వ్యవసాయం కానీ పట్టణ నాగరికత కానీ తెలియవు. వాళ్లు పశుపోషణపై ఆధారపడ్డ సంచార జీవులు'' అని కోశాంబి సూత్రీకరిస్తారు.

గోదావరి తీరానికి ఇనుము ఎప్పుడు పరిచయమైంది?

* ఇనుము వాడకం, వ్యవసాయం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి దక్షిణాపథం మీదుగా గోదావరి తీరానికి చేరిందన్నది కోశాంబి అభిప్రాయం.
* గ్రామీణ స్వయంపోషకత్వానికి ఫలితంగా శ్రమ విభజన పెరిగి అనేక వృత్తులు పుట్టుకొచ్చాయని సూత్రీకరిస్తారు కోశాంబి. ఇది క్రీస్తు శకం 2వ శతాబ్దం తరువాత పరిణామంగా ఆయన చెబుతారు.
* క్రీ.శ. 9వ శతాబ్దం తరువాత సామంతస్వామ్యం నుంచి గ్రామీణ భూస్వామ్యం అనే దశ మొదలైందని కోశాంబి అభిప్రాయపడతారు.

(కర్టెసీ: హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ, కె.బాలగోపాల్ రాసిన 'ప్రాచీన భారతదేశ చరిత్ర - డి.డి.కోశాంబి పరిచయం')

ప్రాచీన భారతదేశ చరిత్ర డి. డి. కోశాంబి పరిచయం 
- కె. బాలగోపాల్‌
పేజీలు 196, వెల : రూ. 80/-



కినిగే డాట్ కాం లోఇప్పుడు ఈ పుస్తకం " E BOOK"  రూపం లో లభిస్తోంది:
ఇక్కడ క్లిక్ చేయండి:


Saturday, December 15, 2018

'మాస్టర్ కీ': ఉత్తర భారతాన నూరేళ్ళ దళిత సామాజిక రాజకీయ ఉద్యమాలు : గుండిమెడ సాంబయ్య, తెలుగు అనువాదం: ఆశాలత



'మాస్టర్ కీ': ఉత్తర భారతాన నూరేళ్ళ దళిత సామాజిక రాజకీయ ఉద్యమాలు
సాంబయ్య సాగించిన మేధో ప్రయాణంలో భాగస్వామిని కావటం నాకెంతో సంతోషంగా ఉంది. అందుకే ఈ తెలుగు
అనువాద ప్రయత్నంతో నేను మనస్ఫూర్తిగా మమేకమవుతున్నాను. ఉత్తర, దక్షిణ భారతాల్లో దళిత రాజకీయ 
ప్రస్థానం కొంత భిన్నంగా ఉంది. వీటి మధ్యనున్న వ్యత్యాసాలపై ' నిజమైన' అవగాహనాపూరిత చర్చకు ఈ పుస్తకం  బలమైన భూమికగా నిలుస్తుందని నమ్ముతున్నాను. భారతదేశంలో (ఆ మాటకొస్తే మరెక్కడైనాగానీ) సామాజిక రాజకీయ పరిణామ క్రమాలను లోతుగా విశ్లేషించి విమర్శించే పని అందులో అంతర్భాగంగా ఉన్నవారు చేస్తేనే విలువ ఉంటుంది. ఈ కోణం నుంచి చూసినప్పడు సాంబయ్య చేసిన కృషికి, పుస్తకానికి అదనపు విలువ, బలం చేకూరతాయి. వర్తమాన భారత సామాజిక, రాజకీయ పరిణామాలపై ఆసక్తి ఉన్న, పరిశోధిస్తున్న వారందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగపడే సమర్ధ రచన. అంతేకాదు, దళిత రాజకీయాల పట్ల ఏ ప్రాంతంలో, ఇక్కడ  సానుకూలంగా,క్రియాశీలంగా ఉండే వారికైనా ఇది ఉపకరించే రచనే!  

'మాస్టర్ కీ': ఉత్తర భారతాన నూరేళ్ళ దళిత సామాజిక రాజకీయ ఉద్యమాలు

రచన :  గుండిమెడ సాంబయ్య
తెలుగు అనువాదం :  ఆశాలత
188 పేజీలు, వెల: రూ.150/-
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com

Friday, November 9, 2018

అనేక రామాయణాలు - తెలుగు అనువాదం: పి.సత్యవతి



అనేక రామాయణాలు 
- తెలుగు అనువాదం: పి.సత్యవతి

''రాముడిని ఆదర్శానికి ప్రతీకగా చేసి, జనరంజకంగా చేప్పే రామాయణాలనే
హిందుత్వవాదులు ఇష్టపడతారు. పిల్లలని నిద్రపుచ్చడానికి చెప్పే కథలాగా,  విన్నదంతా నమ్మేసి నిద్రపోయేలా చేసేటట్లువుండే రామాయణమే వారికి నచ్చుతుంది''

- సుగత శ్రీనివాసరాజు (పత్రికా రచయిత్రి)

భారతదేశ చరిత్రలో అనేక రామ కథలున్నాయి.

చాలామంది పండితులు వాల్మీకి రామాయణమే ప్రామాణికమైనదిగా భావిస్తున్న తరుణంలో, ఈ సంకలనంలోని వ్యాస రచయితలు ఆ అభిప్రాయంతో విభేదిస్తారు. అనేక రామాయణాల గురించి ప్రస్తావించి వాటిని విశ్లేషిస్తారు. స్థలకాలాలు, రాజకీయ నేపథ్యం, ప్రాంతీయ సాహిత్య సాంప్రదాయాలు, మతాచారాలు, పాఠకుల, శ్రోతల అభిరుచులు, సృజన ప్రక్రియ మొదలైన వాటిని దృష్టిలో పెట్టుకుని ఎన్ని రామాయణాలు రూపుదిద్దుకున్నాయో సోదాహరణంగా నిరూపిస్తారు. ...

కొంతమంది ఆధ్యాత్మిక ప్రయోజనానికి, కొంతమంది రాజకీయ ప్రయోజనాలకు రామాయణాన్ని పునర్విశ్లేషించారు. చరిత్ర కారులకూ, దక్షిణాసియాపై అధ్యయనం చేసే  పండితులకూ, జానపద సాహిత్యకారులకూ, సామాజిక సాంస్కృతిక పరిణామాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసేవారికీ ఈ వ్యాసాలు ఒక కొత్తచూపునిస్తాయి.

1991లో ప్రచురితమైన ఈ ''మెనీ రామాయణాస్‌'' పుస్తకంలో ఎ.కె.రామానుజన్‌ వ్రాసిన ''మూడువందల రామాయణాలు: ఐదు ఉదాహరణలు'' అనే వ్యాసాన్ని 2008వ సంవత్సరంలో ఢిల్లీ యూనివర్సిటీ వారు చరిత్ర విభాగంలో ఒక బోధనాంశంగా ప్రవేశ పెట్టినప్పుడు అది వివాదానికి దారితీసింది.

హిందూ మితవాద విద్యార్థి కార్యకర్తలు ఈ పాఠ్యాంశాన్ని తొలగించాలని కోరుతూ అందుకు నిరసనగా చరిత్ర విభాగంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అప్పుడు నలుగురు ఎకడెమిక్‌ సభ్యులతో ఒక కమిటీ వేసి ఈ వ్యాసం బోధనాంశంగా వుంచాలా తొలగించాలా అనే విషయంపై విచారణ జరిపించమని సుప్రీంకోర్టు యూనివర్సిటీని ఆదేశించింది.

అందులో ముగ్గురు సభ్యులు ఈ వ్యాసం, సంబంధిత కోర్సుకు చాలా ముఖ్యమైనదని, అందులో వివాదాస్పదమైన అంశం ఏమీ లేదనీ అభిప్రాయపడ్డారు. నాలుగవ సభ్యుడు కూడా ఈ వ్యాసంలో తప్పేమీ లేదనీ కాకపోతే అది విద్యార్థుల మనోభావాలను గాయపరిస్తే తొలగించవచ్చనీ అన్నాడు.

కమిటీ 3-1 ఓట్లతో అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ అకడెమిక్‌ కౌన్సిల్‌ ఆ తీర్పును బేఖాతరు చేస్తూ పాఠాన్ని తొలగించింది. అనేకమంది చరిత్రకారులో మేధావులూ దీనిపై ఆందోళన చేసారు. కమిటీ అట్లా లొంగిపోవడాన్ని తప్పుపట్టారు.

పౌలా రిచ్మన్‌ సంపాదకత్వంలో వెలువడిన ఈ పుస్తకంలో ఏడు వ్యాసాలున్నాయి.
వీటిని పి. సత్యవతి తెలుగులో అనువదించారు.

ఆంగ్ల మూలం : 
MANY RAMAYANAS : The Diversity of a Narrative Tradition in South Asia, edited by Paula Richman, University of California Press, Bderkeley, Los Angeles, USA, 1991

పేజీలు : 160, ధర : రూ.150/-



నవంబర్ 11 ఆదివారం ఉదయం 10-30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు  
హైదరబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం (దొడ్డి కొమురయ్య హాల్)లో 
జరిగే ఒక సాహితీ మిత్రుల సమావేశంలో ఈ పుస్తక అవిష్కరణ ఆ తరువాత చర్చ వుంటుంది. 
పి. సత్యవతి గారు, హెచ్ బి టి మిత్రులు, పుస్తకాభిమానులు పాల్గొంటారు. 
వివరాలకు ఫోన్ చేయండి : 
040 23521849
9441559721  



హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌