Tuesday, March 26, 2013

"1948:హైదరాబాద్ పతనం" పుస్తకావిష్కరణ చర్చలో పాల్గొనాల్సిందిగా అందరికీ ఇదే మా ఆహ్వానం.

1948:హైదరాబాద్ పతనం

మొహమ్మద్ హైదర్ రాసిన "1948:హైదరాబాద్ పతనం" పుస్తకావిష్కరణ చర్చలో పాల్గొనాల్సిందిగా అందరికీ ఇదే మా ఆహ్వానం.

వేదిక: సారస్వత పరిషత్ హాల్ (ఎస్ పి హాల్)
తేది : 7 ఏప్రిల్ 2013 ఆదివారం ఉదయం 10 గంటలకు

హైదరాబాద్ బుక్ ట్రస్ట్, (040 23521849)
అన్వేషి సంస్థ (040 27423168)
సంయుక్త నిర్వహణ

RETRACING HYDERABAD 1948

Release of Mohammed Hyder's  "1948: HYDERABAD PATANAM"
(translation of the English book OCTOBER COUP)

Hyderabad Book Trust and Anveshi Research Centre for Women's Studies
Invite you to a discussion
At SP Hall (Saraswat Parishad Hall)
On April 7, Sunday at 10 AM
Lunch follows at 1 AM

Hyderabad Book Trust : 040 23521849
ANVESHI 040 040 27423168



Monday, March 18, 2013

తెలంగాణా రైతాంగ పోరాటం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కొద్దీ మా లైబరీలోని వివిధ పుస్తకాలు చూస్తూండగా, ఈ పుస్తకం దొరికింది.....

మనకు  తెలియని మన చరిత్ర
- అసూర్యంపశ్య (pustakam.net)

తెలంగాణా రైతాంగ పోరాటం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కొద్దీ మా లైబరీలోని వివిధ పుస్తకాలు చూస్తూండగా, ఈ పుస్తకం దొరికింది.

ఏమిటీ పుస్తకం?
ఈ సంపాదకవర్గం వారు తెలంగాణ పోరాటంలో పాల్గొన్న స్త్రీలతో, అందునా పూర్తిగా ప్రధాన నాయకత్వంలోని వారు మాత్రమే కాక, వివిధ స్థాయుల్లో పోరాటంలో పాల్గొన్న వారితో మాట్లాడి,

అప్పటి పోరాటంలో స్త్రీల పాత్ర గురించిన ఒక అధ్యయనం చేయాలన్న ఆశయంతో చాలా చోట్లకి తిరిగి సుమారు 60-70 మందిని ఇంటర్వ్యూలు చేసారు. అయితే, మొత్తం ఇంటర్వ్యూలు

అవీ అయ్యాక, ఆ అనుభవాలు గమనించాక, ఈ ఇంటర్వ్యూలని ఉన్నదున్నట్లుగా, వారి జీవితాలని ఒక సజీవ చరిత్రగా అక్షరబద్దం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అందులో కొందరి

కథలతో కూడిన పుస్తకమే ఇది. సంపాదకుల మాటల్లో:

“ముందు ఈ గొంతులందరికీ వినిపించేటట్లు చేయడం మా బాధ్యత అనుకున్నాం. అందుకే తెలంగాణ భాషలో ఉన్నా, ఆంధ్ర భాషలో ఉన్నా, కొన్నిసార్లు రెండూ కలిసిపోయి ఉన్నా దాన్ని

మార్చే ప్రయత్నం చేయలేదు. వాళ్ళు చెప్పిన భాషలోనే ఉంచినప్పుడే వాళ్ళ భావాన్ని మార్చకుండా ఉంచగలుగుతామని అనుకోవడమే దీనిక్కారణం. ఈ చరిత్రలు తెలియజేయడం మాకెంత

ముఖ్యమో, వాటిని స్వయంగా చెప్పగలగడం వారికీ అంతే ముఖ్యం అని గుర్తించడానికి మేం గర్వపడుతున్నాం.”

పుస్తకంలోకి వెళ్తే,

మొదట సాయుధ పోరాట నేపథ్యం, అప్పటి పరిస్థితులు, ఉద్యమంలో కమ్యూనిస్టులు, స్త్రీల పాత్ర గురించి కొంచెం క్లుప్తంగా రాశారు ఒక వ్యాసంలో. ఆపై, స్త్రీల చరిత్ర అంటే ఏమిటి? అందులో

ఏముంటాయి? ఏది స్త్రీల చరిత్ర? ఏది కాదు… అసలు స్త్రీల చరిత్ర తాలూకా చరిత్ర ఏమిటి? – ఇలా అన్ని విషయాలని వివరంగా చర్చిస్తూ సాగిన సైద్ధాంతిక మూలాలున్న వ్యాసం

ఒకటుంది. ఇందులోనే మళ్ళీ చివరికొచ్చేసరికి, ఈ పుస్తకం రాయడం ఎందుకు అవసరమో చెబుతారు. కొంచెం క్లిష్టంగా ఉన్నా, చాలా ఆసక్తికరమైన వ్యాసం ఇది. దీని తరువాత, వరుసగా,

ఉద్యమకారిణులు తమ కథలను చెప్పిన వ్యాసాలున్నాయి.

ఇందులో తమ కథలు చెప్పిన వారు:

    * చాకలి ఐలమ్మ
    * కమలమ్మ
    * అక్కిరాజుపల్లిలో – కొండమ్మ, వజ్రమ్మ, గజ్జెల బాలమ్మ, సైదమ్మ, గొల్ల మల్లమ్మ, గొల్ల బుచమ్మ
    * ప్రియంవద
    * సుగుణమ్మ
    * ప్రమీలా తాయి
    * కొండపల్లి కోటేశ్వరమ్మ
    * దూడల సాలమ్మ
    * మానికొండ సూర్యావతి
    * అచ్చమాంబ
    * జమాలున్నీసా బాజీ – రజియా బేగం
    * మోటూరి ఉదయం
    * బ్రిజ్ రాణీ
    * లలితమ్మ
    * పెసర సత్తెమ్మ
    * మల్లు స్వరాజ్యం

ఒక్కొక్కరి కథా ఒక్కోరకంగా కదిలించింది నన్ను. .......    ....
......    ....

పూర్తి  సమీక్షను పుస్తకం డాట్ నెట్ లో చదవండి.

http://pustakam.net/?p=14141

.

Monday, March 11, 2013

దళిత చరిత్రకు దర్పణం




దళిత చరిత్రకు దర్పణం
కోస్తా ఆంధ్రలో అంబేద్కర్ ఆలోచనలతో ప్రభావితమై ఎదిగిన దళిత ఉద్యమ చరిత్రే బొజ్జా తారకం గారి నవల 'పంచతంత్రం'. విద్యా ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకుంటున్న తొలితరం దళితులు, అప్పుడప్పుడే వారి అనుభవంలోకి వస్తున్న 'స్వాతంత్య్రం', మొదటి తరం దళిత నాయకత్వం ఎదిగిన తీరు వంటి అంశాలను ఈ నవల కళ్ళకు కట్టినట్టు చిత్రించింది. కేవలం పరిశోధన ద్వారా రాయగలిగే నవల కాదిది. గొప్ప జీవితానుభవం ఉన్నవాళ్ళు మాత్రమే రాయగలరు.

తారకంగారి తండ్రి బొజ్జా అప్పలస్వామిగారు మొదటితరం అంబేద్కరిస్టు. ఆయన జీవితం, పోరాటమే 'పంచతంత్రం' నవలకు నేపథ్యం. తారకంగారు కూడా సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉన్న వ్యక్తి. మూడు తరాల పోరాటాలకు ప్రతినిధి. 1947 తర్వాత ఎగసిన అంబేద్కర్ ఉద్యమాలతోనే ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1970లలో ఉవ్వెత్తున లేచిన రైతాంగ ఉద్యమాలు, పౌరహక్కుల ఉద్యమాలు ఆయనను రాటుదేలిన పోరాట యోధుణ్ణి చేశాయి. 1985లో జరిగిన కారంచేడు మారణకాండ ఆయన్ని పూర్తిస్థాయి దళిత నాయకుణ్ణి చేసింది. ఏడుపదుల వయస్సులో లక్ష్మింపేట ఉద్యమాన్ని కూడా ఆయనే ముందుండి నడుపుతున్నారు. ఈ నేపథ్యం, రాజకీయ ప్రభావాలు, చారిత్రక ఘట్టాలన్నీ 'పంచతంత్రం' నవలను అర్థం చేసుకోవడానికి చాలా అవసరం.

తెలుగు దళిత సాహిత్యంలో 'పంచతంత్రం' ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందుతుంది. తొలి దశ దళిత ఉద్యమ చరిత్ర కథాంశంగా నవలలు ఇంతవరకూ రాలేదు. గాంధేయవాదాన్ని వదిలించుకుంటూ వామపక్ష ఉద్యమాలకు వెలుపల స్వతంత్రంగా ఎదిగిన దళిత ఉద్యమాల చరిత్ర మీద రాసిన నవలలేమీ లేవు. చిలుకూరి దేవపుత్ర గారి 'పంచమం' నవల కారంచేడు తర్వాతి పోరాటాలను చర్చిస్తే, కల్యాణరావుగారి 'అంటరాని వసంతం' నవల దళితుల సాంస్కృతిక వారసత్వం, క్రైస్తవంలోకి మారడం, పీడనకు దోపిడీకి వ్యతిరేకంగా వారు చేసిన భూపోరాటాలు, చివరగా నక్సలైటు ఉద్యమంలో భాగం కావడాన్ని చిత్రీకరించింది. వేముల ఎల్లయ్య 'కక్క' నవల తెలంగాణ మాదిగ జీవితం, భాష, సంస్కృతిని వివరిస్తుంది. వీటన్నిటికీ భిన్నంగా 'పంచతంత్రం' ఆంధ్రలో అంబేద్కర్ ఆలోచనా విధానంతో ప్రభావితమైన దళిత ఉద్యమ క్రమాన్ని చూపిస్తుంది.

మాలపల్లెకు, జమీందారీ కుటుంబానికి మధ్య ఘర్షణ ప్రధాన ఇతివృత్తంగా సాగే ఈ నవలలో ముఖ్యపాత్రలు మూడు. కాపు కులస్తుడైన జమీందారు విశ్వనాథం, మాల యువకుడు విద్యార్థి నాయకుడు అయిన సూరన్న, మిలట్రీలో పనిచేసి వచ్చిన మరో మాల కులస్తుడు సుబ్బారావు. సూరన్న బాల్యం నుంచి అనేక అవమానాలకు, వివక్షకు గురవుతూ చివరికి తన కృషితో, చైతన్యంతో విద్యార్థి నాయకుడుగా ఎదిగిన తీరును చాలా బాగా చిత్రించారు.

సుబ్బారావు మాలపల్లెకు నైతిక ధైర్యాన్నిస్తూ, సూరన్నను కాపాడుకుంటూ దళిత ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తాడు. పాలేర్లుగా, వెట్టిచాకిరీ చేసే కూలీలుగా, అంటరానివారిగా అవమానాలకు, అణచివేతకు గురవుతూ బతుకుతున్న దళితులు విద్యావకాశాల వల్ల, ఉద్యమ చైతన్యం వల్ల, 'స్వాతంత్య్రం' తెచ్చిన వెసులుబాటు వల్ల విద్యావంతులుగా, నాయకులుగా రూపొందడం, జమీందార్ల అక్రమ ఆక్రమణ నుండి భూముల్ని తిరిగి తీసుకోవడం, జమీందారు ఆస్తులకు అండగా ఉన్న రెవిన్యూ పోలీసు వ్యవస్థను వ్యతిరేకించడం వంటి ఘటనలన్నిటినీ అత్యంత వాస్తవికంగా మన కళ్ళ ముందు నిలిపారు రచయిత. తారకంగారి కథన శైలి, కవిత్వం తొణికిసలాడే భాష ఈ నవలను మరింత పఠన యోగ్యం చేశాయి.
- కె. సత్యనారాయణ
(ఆదివారం ఆంద్ర జ్యోతి 10 మార్చ్ 2013 సౌజన్యం తో )


పంచతంత్రం ,
బొజ్జా తారకం
పేజీలు : 290,
వెల : రూ. 100
ప్రతులకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్

.

Sunday, March 10, 2013

ఆత్మాభిమానం కోటేశ్వరమ్మ గారి ఇంటి పేరు!


ఆత్మాభిమానం కోటేశ్వరమ్మ గారి ఇంటి పేరు!

మార్చి 2013

ఈ జీవితానికి నాకు మధ్య ఎప్పుడూ యుద్దమే!
నా భాధతోనే కాదు – ఈ లోకంలోని భాధ అంతటితోనూ,
చీకటి అంతటితోనూ నా నిరంతర పోరాటం.
అందుకే ఈ చరిత్ర బాధార్ణవం -ఒక శోకార్ణవం
 -చలం
‘నిర్జన వారధి ‘ రచయిత్రి కొండపల్లి కోటేశ్వరమ్మగారి బాధ కూడ పూర్తిగా వ్యక్తిగతం కాదు, సామాజికమైనది, రాజకీయమైనది కూడ. అందుకే ఆమె బాధ ప్రతి పాఠకుని హృదయాన్ని పిండి వేస్తుంది. ఈ పుస్తకం కోటేశ్వరమ్మగారి అంతర్వాహిని గా సాగినా, ఆమె శైలి, కధనంలోని భిన్నత్వం మనల్ని పుస్తకం పూర్తి అయ్యిన దాకా వదలనివ్వదు.
తన తొంభై రెండు ఏళ్ళ వయస్సులో ఇంచుమించు ఎనిమిది దశాబ్ధాలు ప్రజాజీవితంలో గడిపిన ఆమె  జీవితం కచ్చితంగా ఇతర స్రీల జీవితాల కంటే వైవిధ్యమైనది, విశిష్టమైనది. ఆమె జీవితం ఉద్యమం, సాహిత్యం, సంగీతం, నాటకంతో పెనవేసుకొని ఆమెను ఒక విభిన్న వ్యక్తిగా నిలబెట్టాయి. ఉద్యోగాన్ని కూడా తన మనసుకు నచ్చిన విధంగా మలచుకొని తన సర్వ జీవచైతన్య శక్తులు చివరివరకు సజీవంగా ఉంచగలిగారు. అందుకే తొంభై ఏళ్ళ వయసులో కూడా తేటినీలాపురం పక్షులని చూసి పరవశించగలిగారు.

.......

 కొండపల్లి కోటేశ్వరమ్మ '' నిర్జన వారధి '' పుస్తకం పై రమా సుందరి గారి సమీక్ష
"వాకిలి ఇ సాహిత్య మాసపత్రిక " లో చదవండి

http://vaakili.com/patrika/?p=1412


హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌